By: ABP Desam | Updated at : 13 Feb 2023 12:35 PM (IST)
Edited By: nagavarapu
ధర్మశాల క్రికెట్ స్టేడియం (source: twitter)
Border Gavaskar Trophy: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ధర్మశాల వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ టెస్ట్ వేదిక ధర్మశాల నుంచి మారింది. ఈ మ్యాచ్ ను ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ స్పష్టంచేసింది.
మార్చి 1 నుంచి భారత్, ఆసీస్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. షెడ్యూల్ లో భాగంగా ఈ టెస్ట్ ధర్మశాల వేదికగా జరగాలి. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ ను ఇండోర్ కు మార్చారు. ఎందుకంటే ప్రస్తుతం ధర్మశాల మైదానంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఔట్ ఫీల్డ్ ను పునర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తయినప్పటికీ ఇంకా పిచ్ ను పరీక్షించలేదు. అలాగే ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. మూడో టెస్టుకు ఇంకా 2 వారాల సమయమే ఉన్నందున మ్యాచ్ ను ధర్మశాల నుంచి మార్చుతున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఒకే ఒక టెస్ట్ మ్యాచ్
ధర్మశాలలోని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అక్కడి పిచ్ ను పునర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు వర్షాకాలం తర్వాత పనులు ప్రారంభించారు. ధర్మశాలలో ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ జరిగింది. 2017లో భారత్ - ఆస్ట్రేలియాలే మధ్యే ఈ టెస్ట్ జరిగింది. అయితే ఇక్కడ వన్డేలు, టీ20లు బాగా జరుగుతాయి. అలాగే వచ్చే వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లకు ఈ స్టేడియం వేదిక కానుంది.
భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగ్ భారత్- ఆస్ట్రేలియాలు 4 టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడుతున్నాయి. ఇప్పటికే మొదటి టెస్ట్ పూర్తయింది. రెండో మ్యాచ్ ఫిబ్రవరి 17న ఢిల్లీలో ప్రారంభం కానుంది. మార్చి 1 నుంచి మూడో టెస్ట్ జరుగుతుంది. మార్చి 9 నుంచి 13 వరకు చివరిదైన నాలుగో టెస్ట్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతుంది.
టెస్ట్ సిరీస్ తర్వాత భారత్- ఆస్ట్రేలియాలు వన్డే సిరీస్ లో తలపడనున్నాయి.
BCCI has stated that the HPCA’s outfield lacks sufficient grass density due to harsh winter conditions 🏏#CricketTwitter #indvsaus #india pic.twitter.com/FbUsgrveYD
— Sportskeeda (@Sportskeeda) February 13, 2023
తొలి టెస్టులో భారత్ ఘనవిజయం
తొలి టెస్టులో ఆసీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. స్పిన్ ఆడటంలో మరోసారి తమ బలహీనతను బయటపెట్టుకున్న కంగారూలు మూడో రోజుకే చాప చుట్టేశారు. భారత స్పిన్నర్లు విజృంభించిన వేళ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. స్పిన్నర్లు తిప్పేసిన వేళ తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం సాధించింది. 223 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. అశ్విన్, జడేజా, అక్షర్ ల ధాటికి 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
రోహిత్ రికార్డ్
ఈరోజు సెంచరీతో రోహిత్ శర్మ పలు రికార్డులను చేరుకున్నాడు. రెండేళ్ల తర్వాత శతకం బాదిన హిట్ మ్యాన్ కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్ గా టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో శతకాలు చేసిన మొదటి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
Suryakumar Yadav: సూర్యకుమార్ 3 వన్డేల్లో 3 డక్స్! మర్చిపోతే మంచిదన్న సన్నీ!
IPL 2023: రెస్ట్ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్!
‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు
అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్తోపాటు భారత్కూ షాక్ తప్పేట్టులేదుగా!
IPL: ఐపీఎల్లో కొత్త రూల్స్- ఈ సీజన్ నుంచే అమలు- అవేంటంటే..!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు
Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు
Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!
TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !