అన్వేషించండి

T20 World Cup 2024: వన్డే వరల్డ్ కప్ చేజారింది, కానీ బార్బడోస్‌లో జెండా పాతుతాం- ఎప్పుడో చెప్పిన జై షా

IND Vs SA: బార్బడోస్‌లో మరికాసేపట్లో మహా సమరం మొదలుకానుంది. విజేత ఎవరో అందరూ లెక్కలు వేసి చూస్తున్నారు. అయితే బీసీసీఐ కార్యదర్శి జై షా ఈసారి టీ 20 ప్రపంచకప్‌ విజేత ఎవరో ముందే చెప్పేశారు.

BCCI Secy Jay Shah Prediction: బార్బడోస్‌లో మరికాసేపట్లో మహా సమరం జరగనుంది. ఈ సమరంలో గెలిచిన జట్టు జగజ్జేతగా నిలవనుంది. టీమిండియా-సౌతాఫ్రికా(IND Vs SA) మధ్య జరగనున్న టీ 20 ప్రపంచ కప్‌(T20 World Cup) ఫైనల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపైనే ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచం దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎవరి బలాలేంటీ..? బలహీనతలెంటీ..। చెలరేగి ఆడేదవరు ఇలా ఎవరి లెక్కలు వారేసుకుని విజేతలుగా నిలిచేది ఎవరో అంచనా వేస్తున్నారు. అయితే వీళ్లందరి కంటే ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా ఈసారి టీ 20 ప్రపంచకప్‌ విజేత ఎవరో ముందే చెప్పేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 

 
ఎప్పుడన్నారు.. ఏమన్నారు
బార్బడోస్‌లో టీమిండియా జెండా పాతుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా ముందే ఊహించారు. చాలా నెలల క్రితమే జై షా ఈ జోస్యం చెప్పారు. అహ్మదాబాద్‌లో 2023 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి ఎదురై అప్పుడే ఏడు నెలలు గడిచిపోయింది. ఆ సమయంలోనే జై షా కీలక ప్రకటన చేశారు. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఓడిపోయినా.. టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కచ్చితంగా గెలుస్తుందని జై షా జోస్యం చెప్పారు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమితో తీవ్ర భావోద్వేగానికి గురైన జైషా... అప్పట్లోనే ఈ ప్రకటన చేశారు. టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ విజయం సాధిస్తుందని అంచనా వేశారు. తాను ప్రపంచకప్ ఓటమిపై ఇప్పుడు ప్రకటన ఇస్తున్నానని... 2023లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత కూడా టీమిండియా ట్రోఫీని ఎత్తలేకపోవచ్చని... ఇప్పుడు తాము హృదయాలను గెలిచామని 2023 ఫైనల్లో ఓటమి అనంతరం జై షా అన్నాడు. ఈ ఓటమితో ఆగిపోమని... 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో బార్బడోస్‌లో కచ్చితంగా భారత జెండా పాతుతామని అప్పుడే జై షా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ మాటలు నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జై షా మాట్లాడిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఈసారి ఎన్ని అవంతరాలు ఎదురైనా టీమిండియానో విజయం సాధిస్తుందని... అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
 

 
అజేయంగా భారత్‌...
2023 వన్డే ప్రపంచకప్‌లాగానే 2024 టీ20 ప్రపంచకప్‌లో కూడా భారత్ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలో టీమ్ ఇండియా 9 మ్యాచ్‌ల్లో గెలిచి, సెమీ-ఫైనల్‌లోనూ విజయం సాధించింది. కానీ అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో రోహిత్ సేన ఆస్ట్రేలియా ముందు తలవంచింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే పరిస్థితిలో ఉంది. కానీ ప్రత్యర్థి మారింది. దక్షిణాఫ్రికా.. భారత్‌కు.. ప్రపంచకప్‌నకు మధ్య ఉంది. ప్రొటీస్‌ను ధాటి టీమిండియా కప్పును గెలుచుకునేందుకు సిద్ధంగా ఉంది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget