By: ABP Desam | Updated at : 28 Nov 2022 05:55 PM (IST)
Edited By: nagavarapu
రోహిత్ శర్మ , రాహుల్ ద్రవిడ్ (source: twitter)
Rohit Sharma - Rahul Dravid: టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోనున్నాడా? కోచ్ గా రాహుల్ ద్రవిడ్ భవితవ్యం ఏమిటి? వీరిద్దరి భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో ముంబయిలో జరిగే ముఖ్యమైన సమావేశానికి బీసీసీఐ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు పిలుపొచ్చింది.
బీసీసీఐ త్వరలో ముంబయిలో సమావేశం నిర్వహించనుంది. దీనికి భారత కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ లను హాజరు కావాల్సిందిగా కోరింది. బంగ్లాదేశ్ పర్యటనకు ముందే వీరిద్దరినీ బీసీసీఐ అధికారులు కలవనున్నారు. ఈ భేటీలో వీరి భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
దీనిపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒక వార్తా సంస్థతో మాట్లాడినట్లు తెలుస్తోంది. 'రోహిత్, రాహుల్ తో సమావేశం ఉంటుంది. వచ్చే ప్రపంచకప్ కోసం ప్లాన్ చేసుకోవాలి. కెప్టెన్ తో, కోచ్ తో అధికారులు విడివిడిగా మరియు కలిపి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ సమావేశం తర్వాత అన్నింటిపై నిర్ణయం తీసుకుంటాం. అలాగే ఈ టీ20 ప్రపంచకప్ ప్రదర్శనపై కూడా సమీక్ష నిర్వహిస్తాం' అని అతను చెప్పినట్లు సమాచారం.
టీ20 కెప్టెన్సీ వదులుకునేందుకు రోహిత్ సిద్ధం!
టీ20 కెప్టెన్ నుంచి తప్పుకునేందుకు రోహిత్ శర్మ సుముఖంగా ఉన్నాడనే వార్తలు కొన్నిరోజుల క్రితం వచ్చాయి. దీనిపై రోహిత్ శర్మతో బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారని.. హార్దిక్ కు టీ20 పగ్గాలు అప్పగించటంలో హిట్ మ్యాన్ కు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లుగా సమాచారం.
Acc to Insidesports -
— Abhijeet ♞ (@TheYorkerBall) November 28, 2022
BCCI has called on Captain Rohit Sharma and Rahul Dravid for a special meeting in Mumbai to review the WC Performance and talk about split captaincy and Coaches.
Virat Kohli and the current outgoing selectors will also be there. pic.twitter.com/3UO4LIIqun
BCCI Calls On Rohit Sharma & Rahul Dravid For Review Meeting – dlovesk https://t.co/nMHRmwOLfK
— dlovesk.com (@dloveskdotcom) November 28, 2022
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్ఠాత్మక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ ను వీక్షించేందుకు అత్యధిక అభిమానులు హాజరైనందుకు బీసీసీఐకు ఈ అవార్డ్ లభించింది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 29, 2022న గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. దీన్ని చూసేందుకు 1,01,566 మంది అభిమానులు హాజరయ్యారు. ఇందుకుగాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో బీసీసీఐకు స్థానం దక్కింది. ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన హార్దిక్ పాండ్య నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ తన ఆరంభ సీజన్ లోనే ట్రోఫీ అందుకుంది.
IND vs AUS Test: ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాదే- ఎందుకంటే: గ్రెగ్ ఛాపెల్
IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!
IND vs AUS Test: మరో 5 రోజుల్లో బోర్డర్- గావస్కర్ సిరీస్- డబ్ల్యూటీసీ ఫైనల్ పై భారత్- ఆస్ట్రేలియాల దృష్టి!
IND vs AUS: టెస్టు అరంగేట్రానికి సూర్యకుమార్ రెడీ - ఐదు రోజుల ఫార్మాట్లోనూ చుక్కలు చూపిస్తాడా?
Shaheen Afridi Marriage: షాహిద్ అఫ్రిది కుమార్తెను వివాహమాడిన పాక్ యువ బౌలర్ షహీన్
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్
BRS Nanded Meeting : నాందేడ్లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !
Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ
Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?