అన్వేషించండి

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో సోమవారం భారత్‌కు రెండో స్వర్ణం లభించింది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు లక్ష్య సేన్‌ పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం ముద్దాడాడు.

Commonwealth Games 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత క్రీడాకారులు అదుర్స్‌ అనిపిస్తున్నారు. వరుసగా పతకాల పంట పండిస్తున్నారు. బ్యాడ్మింటన్‌లో ఇంతకు ముందే పీవీ సింధు స్వర్ణం గెలవగా ఇప్పుడు ఆమెకు లక్ష్యసేన్‌ తోడయ్యాడు. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం ముద్దాడాడు. మలేసియా షట్లర్‌ యంగ్‌ను 19-21, 21-9, 21-16 తేడాతో చిత్తు చేశాడు. తొలి గేమ్‌లో పోరాడి ఓడినా వెంటనే తేరుకొని కోట్లాది భారతీయులను సంతోషపెట్టాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు టీమ్‌ఇండియాకు 20వ బంగారు పతకం తీసుకురావడం ప్రత్యేకం.

తొలి గేమ్‌ ఓడినా!

ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి గేమ్‌లో 5-4 తేడాతో స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పుంజుకున్న యంగ్‌ 7-7తో స్కోరు సమం చేశాడు. 11-9తో విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. 18-18, 19-19తో పోటీ పడ్డారు. ఈ క్రమంలో యంగ్‌ ఓ అద్భుతమైన క్రాస్‌కోర్టు స్మాష్‌తో 21-19తో గేమ్‌ గెలిచేశాడు.

Also Read: పీవీ సింధుకు గోల్డ్‌! ప్రత్యర్థిని ఉరుకులు పెట్టించిన తెలుగుతేజం

దూకుడు పెంచి

రెండో గేమ్‌లోనూ లక్ష్య 4-6తో వెనకబడ్డాడు. అయితే వెంటనే పుంజుకున్నాడు. 11-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. వరుసగా 10 పాయింట్లు సాధించి 21-9తో రెండో గేమ్‌ కైవసం చేసుకున్నాడు. కీలకమైన మూడో గేమ్‌లో లక్ష్య జోరు మరింత పెంచాడు. 15-12తో దూసుకెళ్లాడు.  ప్రత్యర్థి ర్యాలీ గేమ్‌ మొదలు పెట్టినా 19-15తో గేమ్‌ పాయింట్‌కు చేరువయ్యాడు. ఓ చక్కని క్రాస్‌కోర్టు షాట్‌తో మ్యాచును ముగించాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget