అన్వేషించండి

టెస్ట్ కెప్టెన్సీ వదిలేసినప్పుడు అతడి నుంచి మాత్రమే మెసేజ్ వచ్చింది: కోహ్లీ

Virat Kohli On MS Dhoni: తాను టెస్ట్ కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పినప్పుడు ఎమ్మెస్ ధోనీ ఒక్కడే తనకు వ్యక్తిగతంగా మెసేజ్ చేశాడని విరాట్ కోహ్లీ తెలిపాడు. తమ మధ్య బంధం నమ్మకంతో కూడినదని వివరించాడు.

మనకు ఎవరితో అయినా నిజాయతీతో కూడిన సంబంధాలు ఉంటే.. ఆ బంధంపై ఇరువైపులా నమ్మకముంటుందని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తాను టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పినప్పుడు ఒకే ఒక్కరు తనకు మెసేజ్ చేశారని తెలిపాడు. ఆ వ్యక్తి ఎమ్మెస్ ధోనీ అని.. తమ మధ్య అలాంటి నమ్మకమైన బంధం ఉందని విరాట్ వివరించాడు. 

ధోనీ ఒక్కడే

ఆదివారం పాక్ తో మ్యాచ్ తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్బంగానే తనకు ధోనీతో ఉన్న బంధాన్ని మరోసారి గుర్తుచేశాడు. తాను టెస్ట్ కెప్టెన్సీ వదిలేసినప్పుడు ధోనీ ఒక్కడే తనకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపాడని తెలిపాడు. చాలామంది వద్ద తన ఫోన్ నెంబర్ ఉందని.. అయితే వారెవరు తనకు మెసెజ్‌లు పంపలేదని అన్నాడు. ధోనీ నుంచి తాను ఏమీ ఆశించనని.. అలాగే తన నుంచి ధోనీ ఏమీ ఆశించడని తెలిపారు. తాము ఇద్దరం ఏనాడూ అభద్రతా భావానికి గురికాలేదని వెల్లడించాడు. 

అలాంటి సలహాలే పరిశీలిస్తాను

అందరూ టీవీల్లోనూ, ప్రపంచం మొత్తానికి తెలిసేలా తనకు సలహాలు ఇస్తున్నారని.. అలాంటి వాటికి తనవద్ద విలువ ఉండదని విరాట్ అన్నాడు. తనతో ఎవరైనా వ్యక్తిగతంగా  మాట్లాడి సలహాలు ఇస్తే వాటిని తాను పరిశీలిస్తానని స్పష్టంచేశాడు. మనం ఎంత బాగా ఆడినా ఫలితం దేవుడి చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. 

తప్పులు సహజం

నిన్నటి మ్యాచ్ లో అర్హదీప్ క్యాచ్ వదిలేయడంపైనా విరాట్ స్పందించాడు. అలాంటి ఉత్కంఠభరిత క్షణాల్లో తప్పులు ఎవరైనా చేస్తారని.. వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్లడమేనని అన్నాడు. అతను యువకుడని, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడని అర్హదీప్ కి మద్దతుగా మాట్లాడాడు. సీనియర్లు ఎప్పుడూ కుర్రాళ్లకు అండగా ఉంటారని స్పష్టంచేశాడు. 

వారిద్దరూ గేమ్ ఛేంజర్లు

అలానే సూర్యకుమార్, పాండ్యను వెనకేసుకొచ్చాడు. ఒక్క మ్యాచ్ లో సరిగ్గా ఆడనంత మాత్రాన వారి ప్రతిభను అనుమానించక్కరలేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2022 నుంచి పాండ్య ఆటలో మార్పు కనపడుతోందని అన్నాడు. ఒక నిఖార్సయిన ఆల్ రౌండర్ గా తనని తాను మలుచుకున్నాడని అభినందించాడు. ఇకపోతే సూర్యకుమార్ ఒకసారి ఆడడం మొదలుపెడితే ప్రత్యర్థి నుంచి మ్యాచును లాగేసుకుంటాడని ప్రశంసించాడు. తమ తప్పులు దిద్దుకుని ఆసియా కప్ తర్వాతి మ్యాచులో విజయం సాధించడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు. 

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్థాన్ ఐదు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!

వీడియోలు

Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam
Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
US proposing 500 percent tax:500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
Sabarimala gold theft case: శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
Mahindra XUV 7XO ప్రోస్‌ అండ్‌ కాన్స్‌: ఈ SUV మీకు సరిపోతుందా? మీ డబ్బుకు తగిన విలువ ఇస్తుందా?
Mahindra XUV 7XO ప్లస్‌లు-మైనస్‌లు: కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
IPAC Case in High Court:'న్యాయమూర్తిని మార్చండి' IPAC కేసులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ED విజ్ఞప్తి!
'న్యాయమూర్తిని మార్చండి' IPAC కేసులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ED విజ్ఞప్తి!
Embed widget