అన్వేషించండి

Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతం సులువుగా చేసుకునే విధానం - ఈ రోజు చదువుకోవాల్సిన వ్రత కథ!

Varalakshmi Vratham 2024 : ముందుగా గణపతి పూజ పూర్తిచేసి..ఆ తర్వాత వరలక్ష్మీ వ్రతం ప్రారంభించాలి..గణపతి పూజా విధానం కూడా ఏబీపీ దేశం మీకు అందించింది..

Varalakshmi Vratam Pooja Vidhanam:  గణపతి పూజ పూర్తైన తర్వాత  మళ్లీ ఆచమనీయం చేయాలి... అప్పుడు కలశ పూజ ప్రారంభించాలి.  ( గణపతి పూజ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

 కలశపూజ 
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ: స్థితాః కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా.. ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః..అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః  ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥ అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

అధంగపూజ
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి. 
చంచలాయై నమః  పాదౌ పూజయామి  చపలాయై నమః  జానునీ పూజయామి
పీతాంబరాయైనమః ఉరుం పూజయామి  మలవాసిన్యైనమః  కటిం పూజయామి
పద్మాలయాయైనమః నాభిం పూజయామి మదనమాత్రేనమః స్తనౌ పూజయామి
కంబుకంఠ్యై నమః కంఠంపూజయామి సుముఖాయైనమః  ముఖంపూజయామి
సునేత్రాయైనమః  నేత్రౌపూజయామి రమాయైనమః కర్ణౌ పూజయామి
కమలాయైనమః  శిరః పూజయామి  శ్రీవరలక్ష్య్మైనమః - సర్వాంగాని పూజయామి.

(పూలు, పసుపు, కుంకుమతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి ( మీకు అందుబాటులో లేకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి..ఇందులో ఉంటుంది)
 
తోరాల పూజ  
 అక్షతలతో తోరాలకి పూజచేయాలి..
కమలాయైనమః  ప్రథమగ్రంథిం పూజయామి
రమాయైనమః  ద్వితీయ గ్రంథింపూజయామి
లోకమాత్రేనమః  తృతీయ గ్రంథింపూజయామి
విశ్వజనన్యైనమః  చతుర్థగ్రంథింపూజయామి
మహాలక్ష్మ్యై నమః పంచమగ్రంథిం పూజయామి
క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి
చంద్రసోదర్యైనమః అష్టమగ్రంథిం పూజయామి
శ్రీ వరలక్ష్మీయై నమః  నవమగ్రంథిం పూజయామి

 వరలక్ష్మీదేవికి ధూపం, దీపం, నైవేద్యం, హారతి ఇచ్చి ప్రార్థన చేయాలి.  అనంతరం అమ్మవారి దగ్గరున్న తోరం తీసుకుని చేతికి  కట్టుకోవాలి...

తోరం కట్టుకున్నప్పుడు చదవాల్సిన శ్లోకం 

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

వరలక్ష్మీవ్రత కథ

శౌనకాది మహర్షులతో సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పాడు. ఆ వ్రతం గురించి మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అని చెప్పారు. 

శివుడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీ దేవి భర్తని ఇలా అడిగింది..స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది సంతానం, ఐశ్వర్యంతో తరించే వ్రతాన్ని సూచించమని కోరింది. అప్పుడు శివుడు చెప్పిన వ్రతమే వరలక్ష్మీవ్రతం. శ్రావణమాసంలో రెండో శుక్రావరం ( పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం) ఆచరించాలని సూచించాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి..ఈ వ్రతాన్ని ఎవరు మొదట ఆచరించారో చెప్పమని కోరింది. 
 
పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. బంగారు గోడలతో మిలమిలా మెరిసేది ఆ పట్టణంలో చారుమతి అనే ఓబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె వినయవిధేయురాలు..భగవంతుడిపై భక్తిశ్రద్ధలున్న ఇల్లాలు. నిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేచి భర్తపాదాలకు నమస్కరించి ఇంటి పనులు పూర్తిచేసి అత్తమామలను సేవించేది. ఆమెకు కలలో కనిపించిన వరలక్ష్మీదేవి..శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వ్రతం ఆచరించమని ఎన్నో వరాలు ప్రసాదిస్తానని చెప్పింది. సంతోషించిన చారుమతి..ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పి ...శ్రావణ శుక్రవారం రోజు ఇరుగు పొరుగువారిని పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని పూజించింది. తొమ్మిదిపోగులున్న కంకణాన్ని చేతికి కట్టుకుంది, తొమ్మి రకాల పిండివంటలు నివేదించింది. భక్తిశ్రద్ధలతో పూజచేసి ప్రదక్షిణ చేస్తుండగా  మొదటి ప్రదక్షిణకు కాలి గజ్జెలు, రెండో ప్రదక్షిణకు చేతులకు నవరత్న ఖచిత కంకణాలు, మూడో ప్రదక్షిణ సమయంలో సర్వా భరణ భూషితులుగా మారారు అందరూ. ఈ వ్రతాన్ని చేసిన చారుమతితో పాటూ చూసితరించిన వారు కూడా ఐశ్వర్యవంతులు అయ్యారు. అప్పటి నుంచి ఏటా శ్రావణశుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని పూజించి సిరిసంపదలు పొందుతున్నారు. 

శివుడు..పార్వతికి చెప్పిన ఈకథను సూతమహాముని మహర్షులకు వివరించాడు.. ఈ వ్రతం చేసినవారు మాత్రమే కాదు ఈ వ్రతం చూసిన వారు, ఈ కథ విన్నవారిపై కూడా వరలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలుగుతాయని చెప్పారు. ఈ కథ విని అక్షతలు తలపై వేసుకుని అనంతరం మహిళలు..ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. 

భక్తితో వేడుకుంటే వరాలందించే  వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించడానికి ఏ  నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే సరిపోతుంది. ఎంతో మంగళకరమైన ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Satya Nadella: భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
Embed widget