![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rath Yatra 2024 Dates and Details: జూలై 7న పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఐదు దశాబ్దాల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు!
Rath Yatra 2024 : ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే పూరీ రథోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఈ ఏడాది జూలై 7 న రథయాత్ర జరగనుంది. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే 3 ఉత్సవాలు ఒకే రోజు జరగనున్నాయి..
![Rath Yatra 2024 Dates and Details: జూలై 7న పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఐదు దశాబ్దాల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు! Rath Yatra 2024 Dates and Details puri jagannath netrotsavam and gopya sevas rath yatra all are same day Rath Yatra 2024 Dates and Details: జూలై 7న పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఐదు దశాబ్దాల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/915f091ba3863e7a9bb4c30c4f63630b1719377941240217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rath Yatra 2024 Dates and Details: 2024 జూలై 7 న పూరీ జగన్నాథుడి రథయాత్ర
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పూరీ ద్వారావతీచైవ సప్తైతే మోక్షదాయకా!
ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి పూరీ. పురుషోత్తముడు కొలువైన ఈ క్షేత్రాన్నికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాద్రి , నీలాచలం అనే పేర్లతోనూ పిలుస్తారు. సంవత్సరం పాటూ గర్భాలయంలో ప్రత్యేక పూజలందుకునే జగన్నాథుడు.. ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ విదియ రోజు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలసి బయటకు అడుగుపెడతాడు. 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ఈ ఆలయ నిర్మాణం ప్రారంభిస్తే.. ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించారు.
Also Read: యక్షిణిలు ఎవరు ? భూమ్మీద ఉన్నారా - యక్షిణి సాధన ఎందుకు చేస్తారు..ఎవరు చేస్తారు!
అద్భుతమైన ఆధ్యాత్మిక సంబరం
పూరీ జగన్నాథుడి రథయాత్ర కేవలం ఓ ఒడిశా వాసులకు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉండే ప్రతి భక్తులు చూసి తీరాల్సిన అద్భుతమైన ఆధ్యాత్మిక సంబరం. ఈ రథయాత్ర ప్రత్యేకతలపై ఎన్నో గాథలున్నాయి. వాటి మహిమల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా నిత్యనూతనమే. ఏటా ఆషాడంలో జరిగే రథయాత్ర చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది జూలై 7న ప్రధాన రథయాత్ర జరగనుంది. అయితే ఇదే రోజు మరో రెండు విశిష్టతలున్నాయి...
మూడు ఉత్సవాలు ఒకేరోజు
సాధారణంగా జగన్నాథుడి నవయవ్వనరూపం, నేత్రోత్సవం, రథయాత్ర వేర్వేరు రోజుల్లో జరుగుతాయి. కానీ ఈ ఏడాది ఈ మూడు ఉత్సవాలు ఒకే రోజు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఈ 3 ఉత్సవాలు ఒకే రోజు నిర్వహిస్తున్నారు. 1971లో నవయవ్వనరూపం, నేత్రోత్సవం, రథయాత్ర ఒకేరోజు చేశారు..ఈ ఏడాది కూడా అదే విధానం అనుసరించాలని నిర్ణయించింది అధికార యంత్రాంగం. జూలై 6 అర్థరాత్రి నుంచి గర్భగుడిలో జగన్నాధ, బలభద్ర, సుభద్రకు ప్రత్యేక సేవలు మొదలువుతాయి. తెల్లవారు జామున నవయవ్వన అవతార అలంకరణం, ఆ తర్వాత నేత్రోత్సవం, గోప్య సేవలు నిర్వహించిన తర్వాత విగ్రహాలను రథం వద్దకు తీసుకొస్తారు. పూరీ రాజు గజపతి దివ్యసింగ్దేవ్ బంగారు చీపురుతో రథం ముందు ఊడ్చిన తర్వాతే రథం ముందుకు సాగుతుంది.
Also Read: అశ్వత్థామ మంచివాడా - చెడ్డవాడా..అత్యంత శక్తిమంతుడైన బ్రాహ్మణ పుత్రుడికి ఎందుకీ శాపం!
జగన్నాథస్వామి ఆలయం నుంచి బయలుదేరే 3 రథాలు అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచాదేవి ఆలయం దగ్గరకు వెళ్లగానే ఆగిపోతాయి. అక్కడే వారంపాటూ ఆతిథ్యం స్వీకరించి ఆ తర్వాత తిరుగుపనయం అవుతాయి. మళ్లీ జగన్నాథ ఆలయానికి చేరుకున్నాక విగ్రహాలను తీసుకెళ్లి తిరిగి గర్భగుడిలో ప్రతిష్టిస్తారు. ఆ ఘట్టంతో ఉత్సవం ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరం రథయాత్ర సాయంత్రం మొదలవుతుంది.. మొదట బలభద్రుడు..ఆ తర్వాత సుభద్ర..ఆఖర్లో జగన్నాథుడి రథాలు బయలుదేరుతాయి. అంటే బలభద్రుడి రథం బయలుదేరేసరికే చీకటి పడుతుంది...అందుకే జూలై 8 న రథాలు బయలుదేరి గుండిచా సన్నిధికి చేరుకుంటాయి.
Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)