అన్వేషించండి

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిపై ముందే హెచ్చరించిన జగన్నాథుడు - యుద్ధ సూచన కూడా ఇదేనా!

Pahalgam Terror Attack: ఏ క్షణమైనా దాయాది దేశం పాకిస్తాన్ పై భారత్ అటాక్ చేస్తుందని భారతీయులంతా ఫిక్సైపోయారు. అయితే ఈ యుద్ధం గురించి ముందుగానే హింట్ వచ్చిందా? ఆ రోజు జరిగిన ఘటనే ముందస్తు హెచ్చరికా?

 Indo-Pak War 

పహల్గాం ఉగ్రదాడి పూరీ జగన్నాథుడి ఆలయంపై జెండాకి ఏంటి సంబంధం

ఉగ్రదాడి, భారత్-పాక్ యుద్ధం గురించి జగన్నాథుడు ముందే హింట్ ఇచ్చాడా

జగమంతా పాలించే జగన్నాథుడి ఆలయంపై జెండాను గరుడ పక్షి జెండా ఎత్తుకెళ్లడం అశుభానికి సూచనేనా?

ఏదో జరగబోతోందనే సంకేతంగా పూరీ ఆలయంపై జెండాను గరుత్మంతుడు జెండా ఎత్తుకెళ్లాడా?

కురుక్షేత్ర యుద్ధానికి ముందు సంధికోసం శ్రీ కృష్ణుడు కౌరవుల దగ్గరకు వెళతాడు. పాండవులకు ఐదు ఊర్లిస్తే చాలని అడిగినా కౌరవులు అంగీకరించరు. అదే రోజు రాత్రి ఏం జరిగిందంటే...ఓ గరుడ పక్షి వచ్చి ఓ పతాకాన్ని తీసుకెళ్లిపోతుంది, నక్కలు అరుస్తాయి, భూమి కంపిస్తుంది.  ఈ శకునాలు చూసి ఏదో జరగబోతోందని ధృతరాష్ట్రుడు గమనించాడు. అదే విషయం దుర్యోధనుడికి చెప్పి హెచ్చరించాడు కానీ దుర్యోధనుడు పట్టించుకోలేదు. ఆ తర్వాత జరిగిందే కురుక్షేత్ర సంగ్రామం.

ఇప్పుడు కూడా పూరీ జగన్నాథుడి ఆలయంపై జెండాను గరుత్మంతుడు ఎత్తుకెళ్లిన తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకునేందుకు వెళ్లిన పర్యాటకులు వారి కుటుంబాలను పుట్టెడు దుఃఖంలో ముంచెత్తారు. ఆతర్వాత భారత ప్రభుత్వం తీవ్రంగా రియాక్టైంది. దాయాదిదేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఫిక్సైంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. త్రివిద దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రదాని మోదీ. త్వరలోనే ధర్మయుద్ధం జరగబోతోందని భారతీయులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగబోతుందనే సంకేతం ఇస్తూ  జెండాను గరుత్మంతుడు తీసుకెళ్లి ఎగరేసి వదిలేశాడని చెబుతున్నారు ఆధ్యాత్మిక వేత్తలు.  

2025 ఏప్రిల్ 12 సాయంత్రం పూరీ జగన్నాథ్ ఆలయం గోపురంపై ఓ గరుడ పక్షి ప్రదక్షిణలు చేసింది. ఆలయంపై ఉన్న జెండాను పట్టుకుని మరీ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఓ దగ్గర జెండాను వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటనను కొందరు వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన క్షణాల్లో వైరల్ అయింది. పూరీ ఆలయం గోపురంపై ఉన్న జెండాకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ ఆలయంలో జెండా గాలిదిశకు రివర్స్ లో ఎగురుతుంది. 45 అంతస్తులున్న ఈ ఆలయంపై జెండాను నిత్యం మారుస్తారు. 1800 ఏళ్లుగా ఈ ఆచారం సాగుతోంది...ఒక్కరోజు ఈ జెండాను ఎగరేయడం మానేసినా 18 ఏళ్లపాటూ ఆలయం మూతపడుతుందని నమ్మకం. ఇంత మహిమాన్విత అయిన జెండాను గరుడపక్షి తీసుకెళ్లడం అంటే అది ఓ హెచ్చరిక అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు
 
ఇది దైవ సందేశమా..ప్రమాద హెచ్చరికా అని అప్పట్లోనే చర్చ జరిగింది. 2020లో ఈ జెండా అగ్నికి ఆహుతైంది..ఆ సమయంలో కరోనా వచ్చి దేశం అల్లాడిపోయిందని గుర్తుచేశారు. అలానే ఇప్పుడు కూడా ఏమైనా జరగబోతున్నాయా అంటూ సోషల్ మీడియా వేదికలా చాలామంది భక్తులు సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కూడా ఈ కోవకే చెందుతుంది అంటున్నారు. అప్పట్లో కురుక్షేత్ర యుద్ధంలా ఇప్పుడు కూడా భారత్-పాక్ మధ్య యుద్ధం వస్తుందేమో అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. 

ఇందులో వాస్తవం ఎంత? ఇది ఎంతవరకూ విశ్వశించాలి అన్నది స్పష్టంగా చెప్పలేం..ఇది కేవలం నమ్మకం, మత విశ్వాసాలమీద ఆధారపడి చెప్పిన విషయం మాత్రమే.

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
Sanitation worker Honesty: నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
Embed widget