అన్వేషించండి

Margasira Lakshmi Vara Vratham: మార్గశిర గురువారాలు చదువుకోవాల్సిన వ్రత కథ! పేదరికం నుంచి సిరిసంపదకు అధిపతిగా మారిన సుశీల!

Margasira Lakshmi Vara Vratham: మార్గశిర మాసం నవంబర్ 21న ప్రారంభమైంది.. డిసెంబర్ 19తో పూర్తవుతుంది. ఈ నెలలో వచ్చే గురువారాలు చాలా ప్రత్యేకం. ఈ రోజుల్లో పూజ అనంతరం చదువుకోవాల్సిన వ్రత కథ ఇదిగో...!

మార్గశిర గురువారం పూజ పూర్తిచేసిన తర్వాత ఈ వ్రతకథ చదువుకోవాలి.. వ్రత విధానం, నైవేద్యం గురించి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Margasira Lakshmi Vara Vratham Vrata Katha :   పూర్వకాలం సుశీల అనే ఓ బాలిక ఉండేది. ఆమె చిన్నప్పుడే తల్లి మరణించింది. తండ్రి వేరొక వివాహం చేసుకున్నాడు. వచ్చిన సవతి తల్లి సుశీలతో ఇంటి పనులన్నీ చేయిస్తూ విశ్రాంతి తీసుకునేది. కాలక్రమంలో సవతి తల్లి సుశీలకు ఓ బాబు పుట్టాడు. అప్పటి నుంచి ఇంటి పనులతో పాటూ తమ్ముడిని చూసుకునే బాధ్యత కూడా సుశీలపైనే పడింది. బాబుని ఆడిస్తున్నందుకు బదులుగా రోజూ ఓ చిన్న  బెల్లం ముక్క ఇచ్చేది సవతి తల్లి. సుశీల పరిస్థితి చూసి ఇరుగుపొరుగువారు చలించిపోయారు. అన్నిటికీ ఆ అమ్మవారే ఉంది..శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకో అని చెప్పేవారు. ఆ మాటలు విని సుశీల.. మట్టితో శ్రీ మహాలక్ష్మి బొమ్మను తయారు చేసి ...ఆ బొమ్మనే అమ్మగా భావించి నిత్యం పూజచేసేది. సవతి తల్లి ఇచ్చిన బెల్లంముక్కను అమ్మవారిని నైవేద్యంగా పెట్టేది. కొంతకాలానికి యుక్తవయసుకి వచ్చిన సుశీలకు పెళ్లిచేసి పంపించేశారు. వెళుతూ వెళుతూ..మట్టితో తాను తయారుచేసుకున్న మహాలక్ష్మి బొమ్మను కూడా తనతో పాటూ తీసుకెళ్లింది. అప్పటి నుంచి అత్తవారింట్లో సిరిసంపదలు పెరిగాయ్..పుట్టింట్లో సంపద తుడిచిపెట్టుకుపోయి తల్లిదండ్రులు పూర్తి పేదరికంలో మునిగిపోయారు. కోడలు అడుగుపెట్టడంతోనే పొంగిపొర్లిన సిరిసంపదలు చూసి అత్తింటివారు సుశీలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. 

కొంతకాలానికి...
తన పుట్టింటివారు అనుభవిస్తున్న దారిద్ర్యం గురించి తెలుసుకుని బాధపడింది సుశీల. వారికి ఎలాగైనా సహాయం చేయాలని భావించి తన భర్తకు చెప్పింది. భర్త అనుమతి తీసుకున్న తర్వాత సోదరుడికి కబురుపెట్టి ఇంటికి రమ్మని చెప్పింది. ఓ కర్రకు జోలె కట్టి అందులో బంగారునాణేలు పోసి ఇచ్చింది. అక్క ఇంటి నుంచి బయలుదేరిన తమ్ముడు..మార్గమధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆ జోలెను పక్కనే ఉంచి చెరువు వద్దకు వెళ్లి వచ్చాడు. అప్పటికి ఆ బంగారు నాణేలు కనిపించకపోవడంతో ఎవరో దొంగతనం చేశారని భావించి బాధగా ఇంటికి వెళ్లిపోయాడు. 
 
మరికొంత కాలానికి
గతంలో ఇచ్చిన బంగారు నాణేల జోలెను పొగొట్టుకున్నానని సోదరుడు చెప్పాడు. దిగులు చెందవద్దు అని చెప్పిన సుశీల ఈ సారి ఓ చెప్పుల జోడు తెప్పించి వాటి నిండా వరహాలు పోసి ఇచ్చింది. అప్పుడు కూడా ఇంటికి వెళుతుండగా.. మార్గమధ్యలో ఆ చెప్పుల జోడుని కుక్క ఎత్తుకెళ్లిపోయింది.

ఇంకొంత కాలానికి..
మళ్లీ వరహాలు పోగొట్టుకున్నాడని తెలుసుకున్న సుశీల ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి సవతి తల్లికి పంపించింది. తిరుగు ప్రయాణంలో ఓ చోట చద్ది తింటుండగా..ఓ దొంగ వచ్చి గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాడు. తన దురదృష్టానికి తనను తానే తిట్టుకుని ఇంటికి చేరుకున్నాడు..
 
ఓసారి...
తన పుట్టింటివారిని చూడాలనే ఉద్దేశంతో ఇంటికి వెళ్లింది సుశీల. తమ్ముడి ద్వారా జరిగిన విషయాలు మొత్తం తెలుసుకుని బాధపడింది. పుట్టింటి దారిద్ర్యం తొలగిపోవాలంటే...శ్రీ మహాలక్ష్మిని పూజించేలా చేయాలని నిర్ణయించుకుంది. తాను పూజ చేసినట్టే మార్గశిరమాసం గురువారాల్లో తల్లితో వ్రతం చేయిస్తే పుట్టింటి పరిస్థితి మారుతుందని గ్రహించి..తనతో పాటూ తల్లిని తీసుకెళ్లింది 

మార్గశిర మాసం ప్రారంభమైంది...

మొదటి గురువారం తల్లితో నియమ నిష్ఠలతో పూజ చేయిద్దాం అనుకుంది. ఈ రోజు ఏమీ తినవద్దని చెప్పింది. కానీ ఆ తల్లి పిల్లలకు తినిపిస్తూ చటుక్కున నోట్లో వేసుకుంది. ఆ రోజు పూజ పనికిరాదని తర్వాత వారం చేయిద్దాం అనుకుంది సుశీల. రెండో గురువారం పిల్లలకు జడ వేస్తూ చేతికి ఉన్న ఆ జిడ్డును తలకు రాసేసుకుంది...ఇక రెండోవారం కూడా పూజ చేసేందుకు పనికిరాకుండా పోయింది. మూడోవారం అనుకోకుండా తల దువ్వుకుని చిక్కులు తీసుకుని జడ వేసుకుంది...ఇక మూడో వారం కూడా పోయింది. మరోవారం పూజ చేయించాల్సిందే అని తల్లిని ఓ గదిలో పెట్టి గడియ పెట్టేసింది. పిల్లలు అరటిపండ్లు తిని తొక్కలు అటుగా విసిరేశారు. ఆకలికి ఆగలేని ఆ తల్లి ఆ తొక్కలు తినేసింది. అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఇలాంటి ఆలోచనలే వస్తాయని భావించి బాధపడింది. ఇక ఆఖరివారం అవకాశం వదులుకోకూడదని భావించి.. తల్లి కొంగుని తన కొంగుకి ముడివేసుకుని చిన్న పిల్లలా దగ్గరే ఉంచి పట్టుదలగా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించింది. వ్రతభంగం కాకుండా పూజ చేసుకుని తల్లితోనూ పూజ చేయించింది. పూజ పూర్తైన తర్వాత సుశీల పెట్టిన నైవేద్యం స్వీకరించిన శ్రీ మహాలక్ష్మి..ఆమె సవతి తల్లి పెట్టిన నైవేద్యం తిరస్కరించింది. ఇదేమని అడగగా..నువ్వు చిన్నప్పుడు నా పూజ చేసినప్పుడు నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది.. ఆ దోషం వల్ల ఆమె పెట్టిన నైవేద్యం స్వీకరించను అని చెప్పింది అమ్మవారు. తన సవతి తల్లి చేసిన పనిని మన్నించమని ప్రార్థించింది సుశీల. అప్పుడు అమ్మవారు శాంతించి సుశీల పుట్టినింటికి కూడా సిరిసంపదలు ప్రసాదించింది.  

అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్గశిరమాంలో గురువారాలు నియమ నిష్టలతో పూజ పూర్తిచేసి.. తమ శక్తి కొలది పరమాన్నం, పులగం, బూరెలు, అప్పాలు, పులిహోర నైవేద్యంగా సమర్పించి..కుటుంబం అంతా ఆనందంగా ఉండేవారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

2026 మార్చి 29 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 మార్చి 29 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Marriage Muhurat 2026: ఏప్రిల్-మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే! సరైన తేదీలు , సమయం తెలుసుకోండి!
2026 ఏప్రిల్-మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే! సరైన తేదీలు సమయం తెలుసుకోండి!
Vastu Tips Telugus: ఇల్లు కొనేటప్పుడు ఈ దిశలపై ప్రత్యేక శ్రద్ధవహించకపోతే ఇబ్బందులు తప్పవు!
ఇల్లు కొనేటప్పుడు ఈ దిశలపై ప్రత్యేక శ్రద్ధవహించకపోతే ఇబ్బందులు తప్పవు!
Shukra Gochar 2026: మేష రాశిలోకి శుక్రుడు! ఏప్రిల్ 19 వరకూ ఈ 5 రాశులవారికి పండుగే, మిగిలిన రాశులపై ఎలాంటి ప్రభావం?
మేష రాశిలోకి శుక్రుడు! ఏప్రిల్ 19 వరకూ ఈ 5 రాశులవారికి పండుగే, మిగిలిన రాశులపై ఎలాంటి ప్రభావం?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Embed widget