అన్వేషించండి

Janmashtami 2025: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో!

Lord krishna: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో..

Krishna: భారతదేశంలోని అతి ముఖ్యమైన దైవాల్లో శ్రీ కృష్ణుడు అగ్రస్థానంలో ఉంటాడు. హైందవంలో త్రిమూర్తులతో పాటు కీలకమైన దేవుడిగా చాలాసార్లు మహావిష్ణువు అవతారంగా కనిపించే కృష్ణుడు భాగవతంలో మాత్రం తానే దేవదేవుడుగా కనిపిస్తాడు. భారతదేశం మొత్తం మీద రాముడు లేదా కృష్ణుడు గుడి లేని గ్రామం కనిపించదు. మహాభారతం మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. ఆయన బోధించినట్టుగా చెప్పే  భగవద్గీత ఈరోజు కార్పొరేట్ ప్రపంచంలో  ఒక ముఖ్యమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ సబ్జెక్టుగా మారిపోయింది. అయితే ఇంతకు భారతదేశంలో కృష్ణుడు ఆరాధన ఎప్పుడు మొదలైంది? దానికున్న అతి ముఖ్యమైన చారిత్రక ఆధారాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.

Janmashtami 2025: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో!

(టిక్ల రాక్ పెయింటింగ్స్ 300-200BCE (మధ్య ప్రదేశ్ ) సంకర్షణుడు, వాసుదేవ, ఏకనాంశ)

వాసుదేవుడి ఆరాధన కృష్ణుడి పూజ గా మారిందా?

మొదట్లో మధుర ప్రాంతంలో ఉండే వృష్ణ తెగలో " వాసుదేవ" ఆరాధన ఉండేది. తర్వాత వారే ద్వారకా ప్రాంతానికి వలస వెళ్లారు. అప్పటికే అక్కడ స్థిరపడిన యాదవ తెగ అదే దేవుడ్ని "కృష్ణ " పేరుతో పూజించే వారు. 500BCE నాటికి వాసుదేవుడి ఆరాధన కృష్ణుడి పూజ ఒకటిగా కలిసి పోయాయి. చారిత్రికంగా మొదటిసారిగా అదే కాలానికి చెందిన వ్యాకరణ పండితుడు 'పాణిని' వాసుదేవ ఆరాధన గురించి రాసాడు. 

Janmashtami 2025: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో!

(గ్రీకో-బాక్ట్రియన్ కింగ్ Agathocles of Bactria (190-180 BCE ) ముద్రించిన సంకర్షుణుడు, వాసుదేవ నాణాలు)

 ఆఫ్ఘనిస్తాన్ -కజికిస్తాన్-తుర్కమెనిస్థాన్ ప్రాంతాల్లోనూ దొరికిన కృష్ణుడి నాణాలు

 మొట్టమొదటిసారిగా నాణెలపై కృష్ణుడు బొమ్మ ముద్రించింది  మాత్రం గ్రీకో-బాక్ట్రీయన్ రాజులు. అలెగ్జాండర్ సామ్రాజ్యం నుంచి విడిపోయిన తర్వాత వీళ్ళు ప్రస్తుత  ఆఫ్ఘనిస్తాన్,కజికిస్తాన్,తుర్కమెనిస్థాన్ల నుండి ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతాల వరకూ 256 BC నుండి 120 BC వరకూ పాలించారు. ఆ సమయంలో కృష్ణుడి ఆరాధన  గ్రీక్ రాజ్యాలకు చేరుకుంది.  గ్రీకో- బాక్ట్రియన్ రాజు ఆగథోక్లస్ (190-180BCE) Agathocles I Dicaeus తొలిసారి తన నాణాలపై  కృష్ణుడు బొమ్మ ముద్రించాడు. ఈ నాణాలు ప్రస్తుత ఆఫఘనిస్తాన్ ప్రాంతం లో దొరికాయి. శివ కృష్ణుడు ఆ నాణెం పై వాసుదేవ-కృష్ణ ముద్ర చక్రాన్ని ధరించిన  దేవుడి రూపంలో ముద్రించబడి ఉంది.


Janmashtami 2025: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో!

కృష్ణుడి కోసం గ్రీకులు స్థాపించిన వాసుదేవ స్థంభం -"హెలిడోరస్ పిల్లర్"

200 BCE నుండి 10AD వరకూ ప్రస్తుత పాకిస్థాన్ సహా పంజాబ్ లాంటి పశ్చిమ భారత ప్రాంతాల్ని పాలించిన మరో గ్రీక్ రాజ్యం ఇండో -గ్రీకులు. వీళ్ళ రాజు ఆంటీయల్సిడాస్ (Antialcidas ) 115-95 BCE మధ్య కాలం లో శుంగ వంశ చక్రవర్తి భగభద్ర ( 114-83 BCE ) వద్దకు తన రాయబారి హెలిడోరస్ ను పంపాడు. అతను ప్రస్తుత మధ్యప్రదేశ్ లోని 'విదీశా' సమీపంలో  "దేవ దేవుడైన వాసుదేవుడ్ని " కీర్తిస్తూ ఒక స్తంభాన్ని చెక్కించాడు. అయితే తర్వాత కాలంలో ఇది మరుగున పడిపోయింది. 1877లో  ఈ పిల్లర్ ను బ్రిటీష్ అధికారి అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ కనుగొన్నాడు. ఈ పిల్లర్ కు అతి దగ్గరలో సాంచి స్తూపం ఉండడం తో మొదట్లో బౌద్ధ స్టూపం గా భావించారు. కానీ స్పష్టంగా ఈ స్తంభం పై "వాసుదేవ" అని ఉండడం తో బౌద్ధం బలంగా ఉన్న సమయంలోనే వైష్ణవం లేదా కృష్ణుడి ఆరాధన కూడా ఆ ప్రాంతాల్లో బలంగా ఉన్నట్టు ధ్రువీకరణ జరిగింది. అంతేకాదు ఈ పిల్లర్ చుట్టూ ఒక భారీ వాసుదేవాలయం శిదిలాలు ఉన్నట్టు కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే మధ్య ప్రదేశ్ లోని "టిక్ల" ప్రాంతం లో  300-200BCE మధ్య గీసిన కొన్ని రాక్ పెయింటింగ్స్ కూడా గుర్తించారు. వీటిలో వాసుదేవ (కృష్ణ), సంకర్షణ (బాలరాముడి) తోపాటు అంతగా తెలియని ఏకనాంశ అనే దేవత బొమ్మలు ముద్రించి ఉన్నాయి.దానితో భారతదేశం లో కనీసం రెండున్నర వేల సంవత్సరాల నుండే వాసుదేవ/కృష్ణ ఆరాధన ఉందని చరిత్ర కారులు ధ్రువీకరించారు.


Janmashtami 2025: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో!

టాప్ హెడ్ లైన్స్

Varahi Navaratri Dates2026: వారాహి నవరాత్రుల పూజా విధానం, విశిష్టత, ప్రయోజనాలు తెలుసుకోండి
వారాహి నవరాత్రులు 2026 తేదీలు, పూజా విధానం, విశిష్టత, ప్రయోజనాలు తెలుసుకోండి
Unique Traditions: ఈ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు, శతాబ్దాలుగా అనుసరిస్తున్న 'నిర్వస్త్ర వ్రతం' వెనుక వింత ఆచారం
ఈ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు, శతాబ్దాలుగా అనుసరిస్తున్న 'నిర్వస్త్ర వ్రతం' వెనుక వింత ఆచారం
Dakshinayanam 2026: ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget