అన్వేషించండి

Janmashtami 2025: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో!

Lord krishna: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో..

Krishna: భారతదేశంలోని అతి ముఖ్యమైన దైవాల్లో శ్రీ కృష్ణుడు అగ్రస్థానంలో ఉంటాడు. హైందవంలో త్రిమూర్తులతో పాటు కీలకమైన దేవుడిగా చాలాసార్లు మహావిష్ణువు అవతారంగా కనిపించే కృష్ణుడు భాగవతంలో మాత్రం తానే దేవదేవుడుగా కనిపిస్తాడు. భారతదేశం మొత్తం మీద రాముడు లేదా కృష్ణుడు గుడి లేని గ్రామం కనిపించదు. మహాభారతం మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. ఆయన బోధించినట్టుగా చెప్పే  భగవద్గీత ఈరోజు కార్పొరేట్ ప్రపంచంలో  ఒక ముఖ్యమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ సబ్జెక్టుగా మారిపోయింది. అయితే ఇంతకు భారతదేశంలో కృష్ణుడు ఆరాధన ఎప్పుడు మొదలైంది? దానికున్న అతి ముఖ్యమైన చారిత్రక ఆధారాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.

Janmashtami 2025: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో!

(టిక్ల రాక్ పెయింటింగ్స్ 300-200BCE (మధ్య ప్రదేశ్ ) సంకర్షణుడు, వాసుదేవ, ఏకనాంశ)

వాసుదేవుడి ఆరాధన కృష్ణుడి పూజ గా మారిందా?

మొదట్లో మధుర ప్రాంతంలో ఉండే వృష్ణ తెగలో " వాసుదేవ" ఆరాధన ఉండేది. తర్వాత వారే ద్వారకా ప్రాంతానికి వలస వెళ్లారు. అప్పటికే అక్కడ స్థిరపడిన యాదవ తెగ అదే దేవుడ్ని "కృష్ణ " పేరుతో పూజించే వారు. 500BCE నాటికి వాసుదేవుడి ఆరాధన కృష్ణుడి పూజ ఒకటిగా కలిసి పోయాయి. చారిత్రికంగా మొదటిసారిగా అదే కాలానికి చెందిన వ్యాకరణ పండితుడు 'పాణిని' వాసుదేవ ఆరాధన గురించి రాసాడు. 

Janmashtami 2025: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో!

(గ్రీకో-బాక్ట్రియన్ కింగ్ Agathocles of Bactria (190-180 BCE ) ముద్రించిన సంకర్షుణుడు, వాసుదేవ నాణాలు)

 ఆఫ్ఘనిస్తాన్ -కజికిస్తాన్-తుర్కమెనిస్థాన్ ప్రాంతాల్లోనూ దొరికిన కృష్ణుడి నాణాలు

 మొట్టమొదటిసారిగా నాణెలపై కృష్ణుడు బొమ్మ ముద్రించింది  మాత్రం గ్రీకో-బాక్ట్రీయన్ రాజులు. అలెగ్జాండర్ సామ్రాజ్యం నుంచి విడిపోయిన తర్వాత వీళ్ళు ప్రస్తుత  ఆఫ్ఘనిస్తాన్,కజికిస్తాన్,తుర్కమెనిస్థాన్ల నుండి ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతాల వరకూ 256 BC నుండి 120 BC వరకూ పాలించారు. ఆ సమయంలో కృష్ణుడి ఆరాధన  గ్రీక్ రాజ్యాలకు చేరుకుంది.  గ్రీకో- బాక్ట్రియన్ రాజు ఆగథోక్లస్ (190-180BCE) Agathocles I Dicaeus తొలిసారి తన నాణాలపై  కృష్ణుడు బొమ్మ ముద్రించాడు. ఈ నాణాలు ప్రస్తుత ఆఫఘనిస్తాన్ ప్రాంతం లో దొరికాయి. శివ కృష్ణుడు ఆ నాణెం పై వాసుదేవ-కృష్ణ ముద్ర చక్రాన్ని ధరించిన  దేవుడి రూపంలో ముద్రించబడి ఉంది.


Janmashtami 2025: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో!

కృష్ణుడి కోసం గ్రీకులు స్థాపించిన వాసుదేవ స్థంభం -"హెలిడోరస్ పిల్లర్"

200 BCE నుండి 10AD వరకూ ప్రస్తుత పాకిస్థాన్ సహా పంజాబ్ లాంటి పశ్చిమ భారత ప్రాంతాల్ని పాలించిన మరో గ్రీక్ రాజ్యం ఇండో -గ్రీకులు. వీళ్ళ రాజు ఆంటీయల్సిడాస్ (Antialcidas ) 115-95 BCE మధ్య కాలం లో శుంగ వంశ చక్రవర్తి భగభద్ర ( 114-83 BCE ) వద్దకు తన రాయబారి హెలిడోరస్ ను పంపాడు. అతను ప్రస్తుత మధ్యప్రదేశ్ లోని 'విదీశా' సమీపంలో  "దేవ దేవుడైన వాసుదేవుడ్ని " కీర్తిస్తూ ఒక స్తంభాన్ని చెక్కించాడు. అయితే తర్వాత కాలంలో ఇది మరుగున పడిపోయింది. 1877లో  ఈ పిల్లర్ ను బ్రిటీష్ అధికారి అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ కనుగొన్నాడు. ఈ పిల్లర్ కు అతి దగ్గరలో సాంచి స్తూపం ఉండడం తో మొదట్లో బౌద్ధ స్టూపం గా భావించారు. కానీ స్పష్టంగా ఈ స్తంభం పై "వాసుదేవ" అని ఉండడం తో బౌద్ధం బలంగా ఉన్న సమయంలోనే వైష్ణవం లేదా కృష్ణుడి ఆరాధన కూడా ఆ ప్రాంతాల్లో బలంగా ఉన్నట్టు ధ్రువీకరణ జరిగింది. అంతేకాదు ఈ పిల్లర్ చుట్టూ ఒక భారీ వాసుదేవాలయం శిదిలాలు ఉన్నట్టు కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే మధ్య ప్రదేశ్ లోని "టిక్ల" ప్రాంతం లో  300-200BCE మధ్య గీసిన కొన్ని రాక్ పెయింటింగ్స్ కూడా గుర్తించారు. వీటిలో వాసుదేవ (కృష్ణ), సంకర్షణ (బాలరాముడి) తోపాటు అంతగా తెలియని ఏకనాంశ అనే దేవత బొమ్మలు ముద్రించి ఉన్నాయి.దానితో భారతదేశం లో కనీసం రెండున్నర వేల సంవత్సరాల నుండే వాసుదేవ/కృష్ణ ఆరాధన ఉందని చరిత్ర కారులు ధ్రువీకరించారు.


Janmashtami 2025: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో!

టాప్ హెడ్ లైన్స్

అయోధ్య ఆలయంలో 40 రోజుల్లో 70 సార్లు చోరీ - ప్రాచీన భారతంలో ఆలయ చోరులకు ఎలాంటి శిక్షలు విధించేవారు?
అయోధ్య ఆలయంలో 40 రోజుల్లో 70 సార్లు చోరీ - ప్రాచీన భారతంలో ఆలయ చోరులకు ఎలాంటి శిక్షలు విధించేవారు?
Bangles History: మహిళలు చేతులకు గాజులు ధరించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? భారతీయ సంస్కృతిలో వాటి లోతైన చరిత్ర!
మహిళలు చేతులకు గాజులు ధరించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? భారతీయ సంస్కృతిలో వాటి లోతైన చరిత్ర!
తులా నుంచి మీనం వరకు ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయ్ - 28 జూన్ - 4 జూలై వారఫలాలు!
తులా నుంచి మీనం వరకు ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయ్ - 28 జూన్ - 4 జూలై వారఫలాలు!
Weekly Horoscope: 28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!
28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget