అన్వేషించండి

Environment Protection : తులసి పూజ అంటే పర్యావరణ పరిరక్షణకు ప్రతీక

మన పూర్వికులు ఆచార, వ్యవహారాల్లోనే ప్రకృతి పరిరక్షణను పొందుపరిచారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాల ద్వారా ప్రకృతిని భారతీయ మహిళలు రక్షిస్తూ ఉంటారు

పర్యావరణ పరిరక్షణ అనేది నేడు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్న పదం. నిజానికి మన పూర్వికులు ఆచార, వ్యవహారాల్లోనే ప్రకృతి పరిరక్షణను పొందుపరిచారు. వాటికి దూరమవుతూనే ప్రకృతిని కాపాడుకోవాలంటూ నినదిస్తుండడం విచారకరం. ఇక భారతీయ మహిళలది సంస్కృతిలో ప్రత్యేక పాత్ర అనే చెప్పుకోవాలి. పురుషుల కంటే ఎక్కువ మహిళలే ప్రకృతికి దగ్గరగా ఉంటారు. అందుకే భూమాత, గోమాత, గంగమ్మ తల్లి అని పిలుచుకుంటారు భారతీయులు. అంతటి ప్రాధాన్యత ఉన్న మహిళలు ప్రకృతి పండుగలు ఎంచక్కా జరుపుకుంటారు. అందుకు కొన్ని ఉదాహరణలను చెప్పుకుందాం.

ఉత్తరాఖండ్‌లో కోషి నది కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడే రాధా బెన్ అనే మహిళ నది బచావ్ అభియాన్ ప్రారంభించారు. అంతేకాకుండా అడవుల్లోని చెట్లను రక్షిస్తూ వచ్చారు. గిరిజన తెగలవారిని, గ్రామస్తులను ఏకం చేస్తూ 2007లో తన ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. 2010 నాటికి రాధాబెన్‌ పోరాటం ఫలించింది. నది తిరిగి జీవం పొందింది. నది ఆధారిత గ్రామాలు పచ్చదనంతో కళకళాడాయి.

అక్కడితో ఆగిపోలేదామె... అటవీ పరిరక్షణ కోసం లక్ష్మి ఆశ్రమ్ అనే పేరుతో స్థానిక బాలికలకు తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అదే స్ఫఊర్తితో ప్రేరణ సింగ్ బింద్రా, జానకి లెనిన్, డాక్టర్ వనజా రామ్‌పప్రసాద్, పూనమ్ బిర్ కస్తూరి, బానో హరాలు, సుగతకుమారి, ఆరతికుమార్ రావ్, అమ్ల రూయా, జె.విజయ, నళిని శేఖర్, విద్య ఆత్రేయ, రాధా భట్ వంటి ఎందరో దేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు

వీళ్లలో చాలా మంది పోరాటం ఇంటి నుంచే మొదలైంది. ఇంటి ఆవరణలోని తులసమ్మకు తప్పక పూజ చేస్తారు. దీపం వెలిగించి చల్లంగా చూడాలని మొక్కుకుంటారు. అంటే గడప నుంచే మొక్కల సంరక్షణ ప్రారంభిస్తున్నారు అన్నమాట. ఇలా మొదలై దేవాలయాల్లో రావి చెట్టు.. వేప చెట్టు.. ఉసిరి.. తదితర చెట్లకు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజాధికారులు నిర్వహిస్తారు.

విషపూరితమైన పాముకు కూడా నాగులచవితి, నాగుల పంచమి పర్వదినాలలో పాలు పోస్తారు. అంటే పరోక్షంగా వారు చెట్లను.. జీవరాశులను కాపాడుకోవాలనే సందేశాన్ని ఇస్తున్నారు. ప్రకృతి సమతుల్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇక ఊరంత పూజించే గ్రామ బొడ్రాయి కొండలు, గుట్టలను పూర్వీకులు రక్షించుకునేందుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చెప్పకనే చెబుతోంది.

ఇక పండుగల విషయానికి వస్తే బతుకమ్మను తీసుకొవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ పూల పండుగకు ఖ్యాతి సొంతమైంది. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు మహిళల నిండుతనాన్ని.. ప్రకృతిలోని అందాలను మన కనులకు కడుతుంటాయి. అంటే పువ్వుల కోసమే కాకుండా.. వన్యప్రాణుల కోసం అడవులను కాపాడుకోవాలనే విషయాన్ని ఈ పండుగ ద్వారా తెలుసుకుంటాం. నిజానికి ఈ పూలకు నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. దాంతో వాటిని చెరువులు.. కుంటల్లో వేసినప్పుడు నీరు శుద్ధి అవుతుంది. ఇదే కోవకు చెందినది వినాయక చవితి పత్రి కూడా.

అంతేకాకుండా తీజ్ పండుగ కూడా భారతీయులకు సుపరిచితమే. శ్రావణ మాసంలో మహిళలు, యువతులు ఈ పండుగను చేసుకుంటారు. తమ కుటుంబ సభ్యులు, భర్త ఆయురారోగ్యాలతో వర్థిలాల్లని ఉపవాసాలు చేస్తారు. ముఖ్యంగా ప్రకృతికి పూజలు చేయడం ఈ పండుగలో ప్రధాన భాగంగా ఉంటుంది. దీనినే హరితాళిక అని కూడా అంటారు. అడవులు, గ్రామ శివారుల నుంచి సేకరించిన వివిధ ఔషధ గుణాలతో కూడిన మొక్కల ఆకులతో పూజలను నిర్వహిస్తారు. ఇక సంక్రాంతికి ఆవు పేడతో చేసిన గొబ్బె మ్మలను రంగవల్లికలలో పేర్చి వాటిని కృష్ణుడిగా గోపికలుగా భావించి పూజిస్తారు. ఆవుపేడతో వాకిలిని చల్లుతారు. ఇది నేలలో ఉండే రకరకాల క్రిమికీటకాలను నశింపచేస్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఏ విధంగా చూసుకున్నా భారతీయ స్త్రీలది ప్రకృతితో విడదీయలేని బంధం అని అర్థం చేసుకోవచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాల ద్వారా ప్రకృతిని భారతీయ మహిళలు రక్షిస్తూ ఉంటారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget