అన్వేషించండి

India to be renamed 'Bharat': 'భారత్' అనే పేరు ఎలా వచ్చింది - మన దేశానికి అసలు పేరు ఏంటి!

మనదేశానికి 'భారత్' అనే పేరు ఎలా వచ్చింది , మొదట్లో మన దేశాన్ని ఏ పేరుతో పిలిచేవారు...ఎన్నో పేర్లున్నా భారత్ అనే పేరు ఎలా ప్రాచుర్యం పొందింది....

India to be renamed 'Bharat': ఇప్పటి వరకూ నగరాల పేర్లు, జిల్లాల పేర్లు మారాయి..తొలిసారిగా మన దేశం పేరు మారుతోంది. ఇప్పటి వరకూ మన దేశాన్ని ఇండియా అని కూడా పిలిచేవాళ్లం. కానీ ఇకపై భారత్ అని మాత్రమే పిలవాలంటోంది కేంద్ర ప్రభుత్వం. అసలు భారత్ అనే పేరు ఎప్పుడు మొదలైంది. పురాణాల్లో భారత్ గురించి ఏముంది.

సంకల్పం చెప్పేటప్పుడు

“జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోఃదక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య, ఆగ్నేయ ప్రదేశే అని ఆయా ప్రాంతాల ఉనికిలో భాగంగా ‘కృష్ణాగోదావరీ మధ్య దేశే’ అని కలిపి చెబుతారు. కొన్ని ప్రాంతాలవారు ‘శ్రీ కృష్ణాకావేరియోః మధ్య ప్రదేశే అని సంకల్పంలో చెబుతారు. జంబూద్వీపం అనేది కేవలం భారత ఉపఖండం మాత్రమే కాదు. జంబూద్వీపంలో ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబూద్వీపాన్ని 9 భౌగోళిక ప్రాంతాలుగా విభజించారు. వాటిలో భరతవర్షం ఒకటి. ఇది మొత్తము 9 ద్వీపాల సముదాయం. స్పష్టంగా చెప్పాలంటే భారత్ అనే పేరు వేదకాలం నుంచే వాడుకలో ఉంది. 

Also Read: బీజేపీ అధికారంలోకి వచ్చాక మారిన నగరాలు, ప్రదేశాల పేర్లు- యూపీలోనే 40కిపైగా మార్పులు

ఎన్నో పేర్లున్నా భారత్ ప్రత్యేకం

మన దేశానికి ఎన్నో పేర్లున్నాయి. జంబూద్వీపం, భరత ఖండం, అజనాభవర్ష్, హిమవర్షం, భారతవర్ష్, ఆర్యవర్ష్, హిందూ, హిందుస్థాన్, ఇండియా... ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. వీటిలో కొన్ని శ్లోకాల్లో ప్రస్తావించారు. అయితే ఎక్కువగా వాడుకలో ఉన్నది మాత్రం భారత్ అనే పేరే. మనదేశంలో ఉన్న వైవిధ్య సంస్కృతుల్లాగే వివిధ కాలాల్లో రకరకాల పేర్లు వచ్చాయి. ఒక్కోసారి భౌగోళికంగా, మరోసారి జాతి స్ఫూర్తితో, ఇంకోసారి ఆచార వ్యవహారాల వల్ల కూడా హిందూ, హిందుస్థాన్, ఇండియా లాంటి పేర్లు భౌగోళికంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇండియా, హిందుస్తాన్ పేర్లు రావడానికి మూలం సింధు నది. 

భరతుడి పేరుతో భారత్

భరతుడు పాలించడం వల్ల భారతదేశం అనే పేరు వచ్చిందంటారు పండితులు. భరతుడు అంటే దశరథుడి తనయుడు, శ్రీరాముడి సోదరుడు కాదు. శకుంతల-దుష్యంతుల పుత్రుడు భరతుడు. భరతుడి పేరుమీదే భారత్ గా మారిందని ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. భరతుడు అనే చక్రవర్తి నలువైపులా ఉన్న భూభాగాన్ని సొంతం చేసుకుని సువిశాల సామ్రాజ్యం స్థాపించాడు. ఆయన రాజ్యానికి భారతవర్ష్ అనే పేరు వచ్చింది.

భారత్ పేరు వెనుక కథలెన్నో
మత్స్యపురాణంలో భారత్ ప్రస్తావన ఉందని చెబుతారు. జైన సంప్రదాయ సూత్రాలు కూడా భారత్ పేరులో కనిపిస్తాయి. భగవాన్ రుషభదేవ్ పెద్ద కొడుకు మహాయోగి భరత్ పేరుమీదే ఈ దేశానికి భారతవర్ష్ అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు. సంస్కృతంలో వర్ష్ అంటే ప్రాంతం అనే అర్థం ఉంది. అందుకే భారత్ అనే పేరు ఒక నిర్దిష్ట వ్యక్తి నుంచి కాకుండా, ఆ జాతి సమూహాల పేరున ప్రాచుర్యం పొందిందనే వాదన కూడా ఉంది.

Also Read: బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్ ట్వీట్, తప్పులో కాలేయడం అలవాటేనంటూ నడ్డా ఫైర్

మహా'భారత్'

దాదాపు 2500 ఏళ్ల క్రితం మహాభారత సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో భారత భౌగోళిక సరిహద్దులో ఉన్న అన్ని సామ్రాజ్యాలూ పాల్గొన్నాయి. అందుకే దానిని మహాభారత్ అన్నారు. 

హింద్, హిందుస్తాన్

హిందూకుష్ అవతల ఉన్న ఆర్యులు వారి సమాజాన్ని ఇరాన్ అన్నారు. తూర్పున ఉన్న సమాజాలను ఆర్యావర్తులు అన్నారు. ఈ రెండు సమూహాలూ చాలా గొప్పవి. హిందుకుష్ మాట క్రీస్తు పూర్వం 2 వేల ఏళ్ల క్రితమే అక్కాదీ నాగరికతలో ఉంది. అక్కద్, సుమేర్, ఈజిప్షియన్... అన్నిటితో భారత్‌కు బంధాలు ఉండేవి. హింద్, హిందూ, హింద్వాన్, హిందుష్ ఈ పేర్లన్నీ అత్యంత ప్రాచీనమైనవి. ఇండస్.. ఇదే హిందిష్ మాటకు గ్రీకు రూపం. గ్రీకులో భారత్‌కు ‘ఇండియా’, సింధుకు ‘ఇండస్’ అనే మాటల ప్రయోగాలు ప్రామాణికం. సంస్కృతంలోని ‘స్థానం’ పార్సీలో ‘స్తాన్’ అవుతుంది. అలా ‘స్తాన్’ అనే మాట ‘హిందు’కు జతకలిసి ‘హిందుస్తాన్’ అయింది. అంటే హిందువులు ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతం అని అర్థం. 

జంబూద్వీపం 'భారత్' కన్నా పాత పేరు

ఇక ‘జంబూద్వీపం’ అనే మాటకు వస్తే అది  దేశానికి అత్యంత పురాతన పేరు. అది భారత్, ఆర్యావర్త, భరతవర్ష్ అనే పేర్ల కంటే పాతది. నేరేడుపండును సంస్కృతంలో జంబూ ఫలం అంటారు.  భారత్‌లో ఒకప్పుడు నేరేడు చెట్లు చాలా ఎక్కువగా ఉండేవి, అందుకే ‘జంబూద్వీపం’ అనేవారు. జంబూద్వీపం అనే పేరు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దాని తర్వాత వచ్చిన 'భారత్' బాగా ప్రాచుర్యం పొందింది. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

గోరింట పుట్టుక వెనుకున్నపురాణకథ! ఆషాఢంలోనే దీనికెందుకంత ప్రత్యేకత!
గోరింట పుట్టుక వెనుకున్నపురాణకథ! ఆషాఢంలోనే దీనికెందుకంత ప్రత్యేకత!
తొలి ఏకాదశి 2026: శుభాకాంక్షలు, విశిష్టత.. ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు తెలియజేయండి!
తొలి ఏకాదశి 2026: శుభాకాంక్షలు, విశిష్టత.. ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు తెలియజేయండి!
2026 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ముందు 3 సవాళ్లు! దేశ రాజకీయ, సామాజిక వాతావరణంలో ప్రధాన మార్పులు ఇవే!
2026 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ముందు 3 సవాళ్లు! దేశ రాజకీయ, సామాజిక వాతావరణంలో ప్రధాన మార్పులు ఇవే!
వాస్తు హెచ్చరిక: ఇంట్లో అద్దాలు పదేపదే పగులుతున్నాయా? నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం!
వాస్తు హెచ్చరిక: ఇంట్లో అద్దాలు పదేపదే పగులుతున్నాయా? నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Embed widget