అన్వేషించండి

Diwali 2022: దీపావళికి లక్ష్మీ పూజలో ఫాలో అవ్వాల్సిన 10 ప్రత్యేక విషయాలు

దీపావళి, నరకచతుర్థశి ఈ ఏడాది ఒకేరోజు వచ్చాయి..అందుకే ఉదయం నరకచతుర్థశి జరుపుకుని సాయంత్రం చీకటి పడగానే లక్ష్మీపూజ చేసుకుని దివాలీ వేడుకలు నిర్వహిస్తారు. లక్ష్మీపూజ చేసేవారు పాటించే నియమాలేంటంటే..

ధన త్రయోదశి అయిన మర్నాడు నరకచతుర్థశి ఆ తర్వాత రోజు దీపావళి జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది చతుర్థశి, అమావాస్య తిథులు తగులు మిగులు కారణంగా రెండూ ఒకేరోజు వచ్చాయి. అక్టోబరు 24 సోమవారం సూర్యోదయానికి చతుర్థశి ఉండడంతో నరకచతుర్థశి...ఆ రోజు సూర్యాస్తమయం సమయానికి అమావాస్య రావడంతో అదే రోజు దీపావళి జరుపుకుంటారు.  
మరీ ముఖ్యంగా అక్టోబరు 25 మంగళవారం సూర్యగ్రహణం ఉంది..అమావాస్య తిథి కూడా సూర్యస్తమయం వరకూ లేదు.. అందుకే దీపావళి ఏ రోజు జరుపుకోవాలనే ఆలోచనే అవసరం లేదు..అక్టోబరు 24 సోమవారమే దీపావళి. ఇక పూజ చేసుకునే ముహూర్తం అంటూ రకరకాల టైమ్ లు చెబుతున్నారు కానీ..దీపావళికి లక్ష్మీ పూజ అంటే సూర్యస్తమయం అయి దీపాలు పెట్టే సమయమే సరైన సమయం. అంతకుమించి మంచి ఘడియలు చూసుకోవాల్సిన అవసరం లేదు. 

Also Read: దీపావళికి ఈ చీపురు కొంటే సిరిసంపదలని ఎందుకు చెబుతారంటే!

దీపావళి రోజున లక్ష్మీ పూజలో ఫాలో అవ్వాల్సిన 10 ప్రత్యేక విషయాలు

  • బంగారం లేదా వెండి లేదా లోహంతో చేసిన పాదముద్రలను దీపావళి రోజున లక్ష్మీదేవి ఆరాధనలో ఉంచాలి. బంగారం, వెండితో చేసిన పాదముద్రలను ఉంచలేనివారు కాగితంపై చేసిన మెట్ల గుర్తును  పూజించాలి.
  • శంఖం లేకుండా లక్ష్మీదేవి ఆరాధన అసంపూర్ణంగా పరిగణిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటూ దక్షిణాభిముఖ శంఖాన్ని పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
  • శ్రీ యంత్రాన్ని పూజిస్తే అప్పుల బాధలు తీరి సిరిసింపదలకు లోటుండదని చెబుతారు
  • దీపావళి రోజు లక్ష్మీదేవివి ప్రత్యేకంగా స్వీట్ నైవేద్యంగా సమర్పించి సకల శుభాలు ప్రసాదించమని వేడుకుంటారు
  • పరిశుభ్రత ఎక్కువగా ఉండే ఇళ్ళలో లక్ష్మీదేవి ఉంటుంది..అందుకే అమ్మవారికి స్వాగతం పలికేందుకు ఇంటి ప్రధాన ద్వారం వద్దం మామిడి తోరణాలు, పూలదండలు కట్టి ఉంచాలి
  • పసుపు శుభానికి, కుంకుమ సౌభాగ్యానికి చిహ్నం..అమ్మవారిని పసుపు కుంకుమతో అర్చించాలి
  • హిందూమతంలో తమలపాకుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ రోజు లక్ష్మీదేవి, గణేషుడి ఆరాధనలో భాగంగా తమలపాకుపై స్వస్తిక్ గుర్తు వేస్తారు
  • లక్ష్మీదేవి సేవలో ఉంటుంది ఏనుగు. అందుకే లక్ష్మీదేవిని గజలక్ష్మి అని కూడా అంటారు. ఏనుగుకు చెరకుగడలు ఇష్టం కాబట్టి లక్ష్మీపూజలో ఇవి కూడా చేరుస్తారు. మన్మధుడి నుంచి అమ్మవారు తీసుకున్న విల్లుతో సమానంగా చెరుకుగడను భావిస్తారు..అంటే అది ఆయుధం అన్నమాట.
  • చాలా మంది కొత్తిమీర గింజలను కొని వాటిని ఇంట్లోనే ఉంచుకుంటారు. ముఖ్యంగా దీపావళి రోజు పూజలో ఉంచి ఆ తర్వాత బీరువాలో భద్రపరుస్తారు..ఇది అదృష్, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు.
  • లక్ష్మీదేవి ఎప్పుడూ తామరపువ్వుపై కూర్చుని ఉంటుంది. ఆమె ఆసనం అయిన తామరపూలతో లక్ష్మీఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. 

Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' ఏ సమయంలో పెట్టాలి!

దీపావళి లక్ష్మి-కుబేర పూజ మంత్రం
1. ఓం శ్రీం శ్రియై నమః
2. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః
3. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలయే ప్రసిద్ ప్రసిద్ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీయై నమః
4. కుబేరు ప్రార్థన మంత్రము - దండాయ నమస్తుభ్యము నిధిపద్మధిపాయ చ. త్వత్ప్రసాసేన్ ధంధన్యాదిసంపదః..

మహాలక్ష్మి మంత్రం
ఓం శ్రీ హ్రీం శ్రీం కమలే కమలయే ప్రసిద్ ప్రసిద్ ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీయై నమః.

శ్రీ లక్ష్మీ బీజ మంత్ర ఓం
హ్రీం శ్రీం లక్ష్మీభయో నమః

అర్ఘ్య మంత్రం
క్షీరోదరనవసంభూతే సురసురనామస్క్రిత్.
సర్వదేవమయే మాతర్ గృహానాగగరఘ్య నమో నమః.

అభ్యర్థన మంత్రం
సురభి త్వం జగన్మత్తర్దేవీ విష్ణుపాదే స్తి.
సర్వదేవమయే గ్రాసమ్ మాయా దత్తమిం గ్రాస్..

ప్రార్థన మంత్రం
సర్వమయే దేవి సర్వదేవైర్లద్కృతి.
మరమ్మభిలాషితం సఫలం కురు నందిని.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget