![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Raja Shyamala Yagam : పురాణాల్లో రాజసూయ యాగం, రాజకీయాల్లో రాజ శ్యామల యాగం- కేసీఆర్ యాగం చేయడం వెనుకున్న పరమార్థం ఇదేనా!
Raja Shyamala Yagam :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం చేస్తున్నారు. ఇంతకీ ఈ యాగం ఎందుకు చేస్తారు.. దానివల్ల ఎలాంటి ఫలితం పొందుతారు..
![Raja Shyamala Yagam : పురాణాల్లో రాజసూయ యాగం, రాజకీయాల్లో రాజ శ్యామల యాగం- కేసీఆర్ యాగం చేయడం వెనుకున్న పరమార్థం ఇదేనా! Difference between Rajasuya yaga and Rajashyamala Yagam, Delhi BRS Chief KCR Rajashyamala Yagam sentiment before elections Raja Shyamala Yagam : పురాణాల్లో రాజసూయ యాగం, రాజకీయాల్లో రాజ శ్యామల యాగం- కేసీఆర్ యాగం చేయడం వెనుకున్న పరమార్థం ఇదేనా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/13/8b6dc65a7bcb0116100b005ade9a7fce1670913422890217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Raja Shyamala Yagam : పురాణాల్లో చేసిన రాజసూయ యాగం-రాజకీయ నాయకులు నిర్వహించే రాజ శ్యామల యాగం రెండూ ఒకటేనా... రెండిటికీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి...
రాజసూయ యాగం
'సూయం' అంటే శాశ్వతం... రాజ్యాన్ని, రాజుని శాశ్వతంగా ఉండేలా చేసేది కునుకే రాజసూయ యాగం అంటారు. తమ సార్వభౌమాత్వాన్ని ప్రకటించుకునేందుకు రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో చేసే యాగం ఇది. రాజసూయ యూగం రాజ్యం నిలబడడానికి, నా విజయానికి ఎదురులేదని చెప్పడానికి, శత్రువు తన ఎదురు నిలిచేందుకు కూడా సహాసించలేడని చెప్పేందుకు ప్రతీక. ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు, మండలం రోజులు అంటే 41 రోజులు చేయొచ్చు..ఇంకా 21 రోజులు, 16 రోజులు, 3 రోజులు చేస్తారు. యాగం ముగిసిన తర్వాత పూర్ణాహుతి సమర్పించే సమయానికి అక్కడున్న సభలో ఎవరు గొప్పవారైతే వారికి ధారపోస్తారు. ధర్మరాజుతో కృష్ణుడు చేయించిన యాగం ఇది. రాజసూయ యాగం..ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయిస్తాడు. మహాభారతంలో సభాపర్వంలోనే ఉంటుంది ఈ యాగం ప్రస్తావన. శత్రు క్షయాన్నీ, కీర్తినీ, విజయాన్నీ సిద్ధింప చేస్తుంది కాబట్టి తప్పక ఈ యాగాన్ని చేయాలని శ్రీ కృష్ణుడు సూచించాడు. మయసభలో దుర్యోధనుడి పరాభవం - మహాభారత యుద్ధానికి మూలం కూడా ఇక్కడే జరిగింది. యాగం పూర్తైన తర్వాత శిశుపాలుడి వధ జరిగిందీ ఇక్కడే అంటే యాగం పూర్తైన వెంటనే శత్రు సంహారం జరిగిందన్నమాట..
రాజ శ్యామల యాగం
రాజ్యలక్ష్మి వరించాలని..విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామలయాగం. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయ లక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు
Also Read: యజ్ఞయాగాదులు దేవుడికోసం అనుకుంటే మీరు పొరబడినట్టే...
రాజసూయ యాగం- రాజ శ్యామల యాగం ఒకటేనా!
మహాభారతంలో ధర్మరాజు తో శ్రీ కృష్ణుడు చేయించిన రాజసూయ యాగం, ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న రాజ శ్యామల యాగం ఒకటేనా అంటే...ఈ రెండు యాగాలు ఒకటే కాకపోయినా వాటి వెనకున్న ఆంతర్యం, పరమార్థం మాత్రం ఒకటే. ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి, శత్రువులు క్షీణించాలి, సార్వ భౌమాధికారం సిద్ధించాలి, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని చేస్తారు. రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు అది నిర్వహించడం అంత సుసాధ్యం కాదు అందుకే అందుకు ప్రతిగా రాజశ్యామల యాగం ద్వారా విజయం సిద్ధించేలా చేయేమని శ్యామలా దేవిని ప్రశన్నం చేసుకుంటారు.
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, 30 రోజులు పాడే పాశురాల ప్రత్యేకత ఏంటి!
యాగం చేసిన ప్రతిసారీ విజయం అందుకున్న కేసీఆర్
ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా రాజ శ్యామల యాగం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు యాగాలు చేసిన కేసీఆర్..గత ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు. ఇప్పుడు బి ఆర్ ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా మళ్లీ రాజ శ్యామల యాగం చేస్తున్నారు. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని..ఈ సారికూడా రాజ శ్యామల యాగం ద్వారా జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తారని పార్టీ వర్గాల విశ్వాసం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)