అన్వేషించండి

Ranga Politics : విశాఖ రంగా వర్థంతి సభకు వైఎస్ఆర్‌సీపీ దూరం - ఏపీలో మారుతున్న రాజకీయాలు !

విశాఖలో రంగా వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వైఎస్ఆర్‌సీపీ దూరంగా ఉండనుంది. ఈ మేరకు తమ నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.

 

Ranga Politics :  ఆంధ్రప్రదేశ్‌లో వంగవీటి రంగా వర్థంతి రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. గుడివాడలో పోటాపోటీగా కార్యక్రమాలు చేశారు. అయితే వైసీపీ  మాత్రం రంగాను ఒక్క గుడివాడలో మాత్రమే వర్థంతి నిర్వహించింది. ఇతర చోట్లా పట్టించుకోలేదు. విశాఖలో నిర్వహించానుకున్న రంగా వర్థంతి కార్యక్రమాని కూడా వైసీపీ నేతలు హాజరు కాకూడదని ఆదేశించింది. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో కాపు సామాజికవర్గంలో విశేష ఆదరణ ఉన్న నేతగా ఉన్న వంగవీటి రంగాను అన్ని పార్టీలు గౌరవంగా చూసుకోవడం ప్రారంభించాయి. అకస్మాత్ గా వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో వంగవీటి రంగాకు ఒక్క సారిగా ప్రాధాన్యం పెరిగినట్లయింది. 

టీడీపీలో వంగవీటి రంగా కుమారుడు రాధా !

వంగవీటి రంగా జయంతి, వర్థంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగా విగ్రహాల వద్ద కాపు సామాజికవర్గం నేతలు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తూంటారు. విజయవాడలో ఈ వేడుకలు మరింత ఉత్సాహంగా జరుగుతాయి. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నేతృత్వంలో ఈ ఏడాది కూడా వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. అయితే ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ.. తన తండ్రి వర్ధంతి కార్యక్రమాలపై రాజకీయ నీడలు పడకుండా జాగ్రత్త  పడ్డారు. రంగా అందరి మనిషి అని చెప్పేలా నివాళి అర్పించాలనుకున్న అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానించారు.

గుడివాడలో రంగా వర్థంతి సందర్భంగా రాజకీయ యుద్ధం

నిజానికి వైఎస్ఆర్‌సీపీ నేతలు రంగా వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొన్నది చాలా తక్కువ. అయితే గుడివాడలో కొడాలి నాని మాత్రం ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. టీడీపీ కూడా రంగా వర్థంతిని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసుకుంది.కానీ కొడాలి నాని మాత్రం వంగవీటి రాధా తమ కుటుంబసభ్యుడిలాంటి వారని చెబుతూ వస్తున్నారు. టీడీపీ నేతలు రంగా వర్థంతిని చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఘాటుగా బ దులిచ్చారు. రంగా అందరి మనిషి.. ఆయన కుమారుడు వంగవీటి రాధా టీడీపీలోనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. 

విశాఖ రంగా వర్థంతి కార్యక్రమానికి వైసీపీ దూరం  

రాధా – రంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో రంగా వర్థంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ  సమావేశానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీకి చెందిన నేతలు ఎవరూ హాజరు కావద్దని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. స్టేజ్ పై వైసీపీ నేతలు ఉన్న సమయంలో జై జనసేన నినాదాలు చేస్తే ఇబ్బంది పడాల్సి ఉంటుందని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా.. సమావేశం కోసం నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే తాజా పరిస్థితుల ప్రభావంతో ఈ మీటింగ్ పూర్తిగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలోనే జరుగనుంది. పార్టీలకు అతీతంగా ఈ సభ జరుగనుంది. విశాఖపట్నం ఏఎస్ రాజా గ్రౌండ్స్‌ లో ఈ సభ ఏర్పాటు కానుంది. గంటా శ్రీనివాస్ దీనికి నాయకత్వం వహించనున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో వంగవీటి రంగా విషయంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు వ్యూహాత్మకంగా నివాళి అర్పించారు కానీ.. ఆ పార్టీ హైకమాండ్ మాత్రం విశాఖ సభకు హాజరు కాకూడదన్న నిర్ణయంతో.. తమ వైఖరి స్పష్టం చేసినట్లయింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Embed widget