అన్వేషించండి

నేడు మరో లిస్టు విడుదల చేయనున్న జగన్‌, నేతల్లో టెన్షన్

వైసీపీ ఆశావాహ నేతలకు టెన్షన్‌ మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది.

వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) ఆశావహ నేతలకు టెన్షన్‌ మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ( Assembly Elections 2024 ) పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. జాబితాలో తమ పేరు ఉంటుందా ? లేదా ? అన్న వణకు నేతల్లో మొదలైంది. ఎన్నికల ముందు వైసీపీలో భారీ మార్పులు జరుగుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేల్ని పిలుస్తున్న జగన్ (Jagan).. టికెట్ ఉందా.. లేదా అని తేల్చేస్తున్నారు.

వేటు ఎవరికి- ట్రాన్స్‌ఫర్ ఎవరికి?

కొంతమంది నేతల స్థానాలు మారుతుంటే... మరికొందరికి టికెట్టే గల్లంతవుతోంది వైఎస్‌ఆర్‌సీపీలో. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లుంటే.. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో 60 నుంచి 70 మందిని మార్చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. సగం మంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదనే అంచనా జగన్‌ వచ్చినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రతి ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడారు. బలాలు, బలహీనతలపై చర్చిస్తున్నారు. గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. గెలుపే ప్రామణికంగా మార్పులు చేస్తున్నారు సీఎం జగన్‌. సీటు నిరాకరిస్తున్న వారికి భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావటం కోసమే నిర్ణయాలు తప్పటం లేదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం సీఎం నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

11 నియోజకవర్గాల్లో మార్పులు

ఎక్కడైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందో వారిని మార్చుతున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసారు. మరో జాబితా సిద్దంగా ఉంది. అది ఇవాలో లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎవరికి ఏ కారణంతో టికెట్ నిరాకరిస్తుందీ సీఎం వివరిస్తున్నారు. సంక్రాంతి నాటికి అన్ని స్థానాలపై క్లారిటీ ఇచ్చేలా జగన్ పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోనే ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు.

తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణలు

ఇప్పటికే సీఎం ఆఫీస్ నుంచి సీటు విషయంలో ఫోన్లు అందుకున్న నేతలు తాడేపల్లిలో పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఒకసారి ప్రకటన చేస్తే మళ్లీ ఎలాంటి మార్పులు ఉండవనే సంకేతాలు ఇస్తున్నారు. మొత్తంగా ఒకవైపు అభ్యర్థుల ప్రకటన, మరోవైపు సీఎం ముందస్తు వ్యాఖ్యలతో వైసీపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. అయితే ఎవరి సీటు ఉంటుంది.. ఎవరి సీటు ఊడుతుంది..? అనే దానిపై క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 11మంది ఇంచార్జ్ లను మార్చిన జగన్‌... వైసీపీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ అధినేత జగన్ అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్నారు. వ్యతిరేకత ఉన్న సిట్టింగులకు టికెట్లు ఇచ్చి.. రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఏ యాంగిల్ లోనూ ఓటమి రాకుండా జాగ్రత్తపడుతున్నారు. టికెట్లు దక్కనివారికి తర్వాత సర్దుబాటు చేస్తామని చెబుతున్న జగన్.. మాట వినకపోతే మీ దారి మీరు చూసుకోవచ్చని చెప్పేస్తున్నారు. ఇలా ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే చెప్పేయడంతో.. ఎవరైనా పార్టీ మారినా పెద్దగా ఇబ్బంది రాకుండా చూసుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన నియోజకవర్గ సమన్వయకర్తలకు కూడా అందర్నీ కలుపుకుపోవాలని ప్రధానంగా చెబుతున్నారు. ఇప్పట్నుంచీ పోలింగ్ రోజు దాకా.. ఓటర్లతో నిరంతరం టచ్ లో ఉండాలని మరీ మరీ చెబుతున్నారు. కొత్తవారు కూడా పాతవారిలాగే ఉంటే.. మార్చడానికి వెనుకాడేది లేదని ముందే చెప్పి మరీ నియామకాలు చేస్తున్నారు జగన్. దీంతో కొత్తవారు పాతవారి కంటే సీరియస్ గా పనిచేస్తారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న చోట ఖచ్చితంగా మార్పు చేయడానికి సిద్ధమయ్యారు. ముందు నుంచే అందుకు ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Advertisement

వీడియోలు

Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Embed widget