అన్వేషించండి

వాయిస్‌ పెంచిన వసంత్‌కృష్ణ ప్రసాద్- గుంటూరు ఘటనపై పార్టీ లైన్ దాటారా?

గుంటూరు ఘటనపై ఓ ఎన్‌ఆర్‌ఐపై కేసు పెట్టడాన్ని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తప్పు పట్టారు. ఇలా చేస్తే ఎవరూ అభివృద్ధి చేయడానికి ముందుకు రారని అన్నారు.

టీడీపీ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణి కార్యక్రమంలో జరిగిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎన్నారైలను ఇబ్బందులు పెడితే సహాయం చేసేందుకు భవిష్యత్‌లో ఎవ్వరూ ముందుకు రారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆంధప్రదేశ్ పాలిటిక్స్‌లో నిత్యం ఏదోక సంచలనం వెలుగు చూస్తోంది. జనవరి ఒకటో తేదీన గుంటూరులో నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. ఈ తొక్కిసలాట రాజకీయంగా సంచలనం రేకెత్తించింది. వైసీపీ ప్రభుత్వం కూడా ఘటనపై సీరియస్‌గా రియాక్ట్ అయింది. కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించిన ఉయ్యూరు శ్రీనివాసరావు అనే ఎన్నారైపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేసింది. విజయవాడలోని ఓ హోటల్‌లో ఉన్న ఉయ్యూరు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. 

ఈ ఘటనను ఆధారంగా చేసుకొని సభలు, సమావేశాల నిర్వాహణపై ఆంక్షలను వైసీపీ ప్రభుత్వం విధించింది. అంతే కాదు మంత్రులు, వైసీపీ లీడర్లు టీడీపీ, శ్రీనివాసరావును కార్నర్‌ చేశారు. ఈ హాట్ కామెంట్స్ నడుస్తున్న టైంలోనే వైసీపీ మైలవరం శాసన సభ్యుడు వసంత చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఉయ్యూరు శ్రీనివాసరావు తనకు మంచి మిత్రుడని ఆయన అందరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పని చేస్తారని కితాబిచ్చురు. ఎన్నారైలపై ఇలాంటి కేసులు పెడితే భవిష్యత్‌లో రాష్ట్రంలో సహాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రారని వసంత అన్నారు. దీంతో వైసీపీలోనే ఈ వ్యవహరం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది.

పార్టీ, ప్రభుత్వం ఒక లైన్‌లో ఉంటే... వసంత కృష్ణ ప్రసాద్‌ మరో లైన్ తీసుకున్నారు. అంటే వైసీపీ గీసిన లైన్ క్రాస్ చేశారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మరి ఇప్పుడు దీనిపై వైసీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో... లేకుంటే లైట్ తీసుకుంటుందో అన్న చర్చ నడుస్తోంది. అసలు వసంత ఈ కామెంట్స్ చేయడం వెనుక చాలా పెద్ద ప్లానే ఉందంటున్నారు ఆయన గురించి తెలిసిన లీడర్లు. 
 
మైలవరంలో వసంత ఇష్యూ ఇదే...

మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఇటీవల కాలంలో విభేదాలు బయటపడ్డాయి. గతంలో నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా పని చేసిన ప్రస్తుత మంత్రి జోగి రమేష్‌తో వసంతకు విభేదాలు ఉన్నాయి. ఈ విషయంపై ఇరువురు నేతలను వైసీపీ సలహాదారు సజ్జల విడివిడిగా పిలిపించి మాట్లాడారు. ఆ తరువాత వసంత నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షలో భాగంగా జగన్ వద్ద కూడా జోగి వ్యవహరాన్ని ప్రస్తావించారు. అయితే జగన్ వీటిని తరువాత చూద్దాంలే అన్న...అంటూ వసంతతో అన్నారట. అయితే స్థానికంగా మాత్రం ఇద్దరు నేతల మధ్య విభేదాలు తగ్గేదేలే అన్నట్లుగా నడుస్తున్నాయి.

వాయిస్ పెంచిన వసంత.....

జోగి రమేష్‌తో విభేదాలు ఉన్నప్పటికీ వాటిని వసంత పెద్దగా పట్టించుకోలేదు. అయితే రాను రాను ఇబ్బందులు ఎక్కువ కావటంతో వసంత ఈ విషయాలపై పార్టీ నాయకులతో చర్చించటంతో ప్రచారం కూడా పెరిగింది. ఆ తరువాత బహిరంగంగానే జోగితో ఉన్న విభేదాలపై వసంత వ్యాఖ్యాలు చేశారు. నియోజకవర్గంలో టీడీపీ నుంచి అత్యంత కీలకమైన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. దేవినేని ఉమాను ఎదుర్కోవాలంటే జోగి రమేష్‌కు బలం లేదని వసంత వర్గం ప్రచారం చేస్తోంది. ఇదే ఈక్వేషన్‌ను వసంత తన బలంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని టాక్. అందులో భాగంగానే సైలెంట్‌గా రాజకీయాలు చేసే మనస్తత్వం ఉన్న వసంత స్వరం పెంచుతున్నారట. అదే బలంతో మిత్రుడు ఉయ్యూరు శ్రీనివాస్‌కు సపోర్ట్‌గా నిలిచారట. ఈ కారణంగానైనా తన బాధను అధిష్ఠానం పట్టించుకొని మైలవరం జోలికి రావద్దని జోకి రమేష్‌కు చెబుతుందని వసంత ప్లాన్ అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Crime News: విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Thaman : 'అఖండ 2' థియేటర్లలో పేలిన బాక్సులు - సౌండ్ మిక్సింగ్ విమర్శలపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్
'అఖండ 2' థియేటర్లలో పేలిన బాక్సులు - సౌండ్ మిక్సింగ్ విమర్శలపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Thaman : 'అఖండ 2' థియేటర్లలో పేలిన బాక్సులు - సౌండ్ మిక్సింగ్ విమర్శలపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్
'అఖండ 2' థియేటర్లలో పేలిన బాక్సులు - సౌండ్ మిక్సింగ్ విమర్శలపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
Embed widget