అన్వేషించండి

వాయిస్‌ పెంచిన వసంత్‌కృష్ణ ప్రసాద్- గుంటూరు ఘటనపై పార్టీ లైన్ దాటారా?

గుంటూరు ఘటనపై ఓ ఎన్‌ఆర్‌ఐపై కేసు పెట్టడాన్ని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తప్పు పట్టారు. ఇలా చేస్తే ఎవరూ అభివృద్ధి చేయడానికి ముందుకు రారని అన్నారు.

టీడీపీ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణి కార్యక్రమంలో జరిగిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎన్నారైలను ఇబ్బందులు పెడితే సహాయం చేసేందుకు భవిష్యత్‌లో ఎవ్వరూ ముందుకు రారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆంధప్రదేశ్ పాలిటిక్స్‌లో నిత్యం ఏదోక సంచలనం వెలుగు చూస్తోంది. జనవరి ఒకటో తేదీన గుంటూరులో నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. ఈ తొక్కిసలాట రాజకీయంగా సంచలనం రేకెత్తించింది. వైసీపీ ప్రభుత్వం కూడా ఘటనపై సీరియస్‌గా రియాక్ట్ అయింది. కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించిన ఉయ్యూరు శ్రీనివాసరావు అనే ఎన్నారైపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేసింది. విజయవాడలోని ఓ హోటల్‌లో ఉన్న ఉయ్యూరు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. 

ఈ ఘటనను ఆధారంగా చేసుకొని సభలు, సమావేశాల నిర్వాహణపై ఆంక్షలను వైసీపీ ప్రభుత్వం విధించింది. అంతే కాదు మంత్రులు, వైసీపీ లీడర్లు టీడీపీ, శ్రీనివాసరావును కార్నర్‌ చేశారు. ఈ హాట్ కామెంట్స్ నడుస్తున్న టైంలోనే వైసీపీ మైలవరం శాసన సభ్యుడు వసంత చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఉయ్యూరు శ్రీనివాసరావు తనకు మంచి మిత్రుడని ఆయన అందరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పని చేస్తారని కితాబిచ్చురు. ఎన్నారైలపై ఇలాంటి కేసులు పెడితే భవిష్యత్‌లో రాష్ట్రంలో సహాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రారని వసంత అన్నారు. దీంతో వైసీపీలోనే ఈ వ్యవహరం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది.

పార్టీ, ప్రభుత్వం ఒక లైన్‌లో ఉంటే... వసంత కృష్ణ ప్రసాద్‌ మరో లైన్ తీసుకున్నారు. అంటే వైసీపీ గీసిన లైన్ క్రాస్ చేశారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మరి ఇప్పుడు దీనిపై వైసీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో... లేకుంటే లైట్ తీసుకుంటుందో అన్న చర్చ నడుస్తోంది. అసలు వసంత ఈ కామెంట్స్ చేయడం వెనుక చాలా పెద్ద ప్లానే ఉందంటున్నారు ఆయన గురించి తెలిసిన లీడర్లు. 
 
మైలవరంలో వసంత ఇష్యూ ఇదే...

మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఇటీవల కాలంలో విభేదాలు బయటపడ్డాయి. గతంలో నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా పని చేసిన ప్రస్తుత మంత్రి జోగి రమేష్‌తో వసంతకు విభేదాలు ఉన్నాయి. ఈ విషయంపై ఇరువురు నేతలను వైసీపీ సలహాదారు సజ్జల విడివిడిగా పిలిపించి మాట్లాడారు. ఆ తరువాత వసంత నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షలో భాగంగా జగన్ వద్ద కూడా జోగి వ్యవహరాన్ని ప్రస్తావించారు. అయితే జగన్ వీటిని తరువాత చూద్దాంలే అన్న...అంటూ వసంతతో అన్నారట. అయితే స్థానికంగా మాత్రం ఇద్దరు నేతల మధ్య విభేదాలు తగ్గేదేలే అన్నట్లుగా నడుస్తున్నాయి.

వాయిస్ పెంచిన వసంత.....

జోగి రమేష్‌తో విభేదాలు ఉన్నప్పటికీ వాటిని వసంత పెద్దగా పట్టించుకోలేదు. అయితే రాను రాను ఇబ్బందులు ఎక్కువ కావటంతో వసంత ఈ విషయాలపై పార్టీ నాయకులతో చర్చించటంతో ప్రచారం కూడా పెరిగింది. ఆ తరువాత బహిరంగంగానే జోగితో ఉన్న విభేదాలపై వసంత వ్యాఖ్యాలు చేశారు. నియోజకవర్గంలో టీడీపీ నుంచి అత్యంత కీలకమైన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. దేవినేని ఉమాను ఎదుర్కోవాలంటే జోగి రమేష్‌కు బలం లేదని వసంత వర్గం ప్రచారం చేస్తోంది. ఇదే ఈక్వేషన్‌ను వసంత తన బలంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని టాక్. అందులో భాగంగానే సైలెంట్‌గా రాజకీయాలు చేసే మనస్తత్వం ఉన్న వసంత స్వరం పెంచుతున్నారట. అదే బలంతో మిత్రుడు ఉయ్యూరు శ్రీనివాస్‌కు సపోర్ట్‌గా నిలిచారట. ఈ కారణంగానైనా తన బాధను అధిష్ఠానం పట్టించుకొని మైలవరం జోలికి రావద్దని జోకి రమేష్‌కు చెబుతుందని వసంత ప్లాన్ అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget