అన్వేషించండి

వాయిస్‌ పెంచిన వసంత్‌కృష్ణ ప్రసాద్- గుంటూరు ఘటనపై పార్టీ లైన్ దాటారా?

గుంటూరు ఘటనపై ఓ ఎన్‌ఆర్‌ఐపై కేసు పెట్టడాన్ని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తప్పు పట్టారు. ఇలా చేస్తే ఎవరూ అభివృద్ధి చేయడానికి ముందుకు రారని అన్నారు.

టీడీపీ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణి కార్యక్రమంలో జరిగిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎన్నారైలను ఇబ్బందులు పెడితే సహాయం చేసేందుకు భవిష్యత్‌లో ఎవ్వరూ ముందుకు రారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆంధప్రదేశ్ పాలిటిక్స్‌లో నిత్యం ఏదోక సంచలనం వెలుగు చూస్తోంది. జనవరి ఒకటో తేదీన గుంటూరులో నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. ఈ తొక్కిసలాట రాజకీయంగా సంచలనం రేకెత్తించింది. వైసీపీ ప్రభుత్వం కూడా ఘటనపై సీరియస్‌గా రియాక్ట్ అయింది. కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించిన ఉయ్యూరు శ్రీనివాసరావు అనే ఎన్నారైపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేసింది. విజయవాడలోని ఓ హోటల్‌లో ఉన్న ఉయ్యూరు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. 

ఈ ఘటనను ఆధారంగా చేసుకొని సభలు, సమావేశాల నిర్వాహణపై ఆంక్షలను వైసీపీ ప్రభుత్వం విధించింది. అంతే కాదు మంత్రులు, వైసీపీ లీడర్లు టీడీపీ, శ్రీనివాసరావును కార్నర్‌ చేశారు. ఈ హాట్ కామెంట్స్ నడుస్తున్న టైంలోనే వైసీపీ మైలవరం శాసన సభ్యుడు వసంత చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఉయ్యూరు శ్రీనివాసరావు తనకు మంచి మిత్రుడని ఆయన అందరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పని చేస్తారని కితాబిచ్చురు. ఎన్నారైలపై ఇలాంటి కేసులు పెడితే భవిష్యత్‌లో రాష్ట్రంలో సహాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రారని వసంత అన్నారు. దీంతో వైసీపీలోనే ఈ వ్యవహరం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది.

పార్టీ, ప్రభుత్వం ఒక లైన్‌లో ఉంటే... వసంత కృష్ణ ప్రసాద్‌ మరో లైన్ తీసుకున్నారు. అంటే వైసీపీ గీసిన లైన్ క్రాస్ చేశారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మరి ఇప్పుడు దీనిపై వైసీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో... లేకుంటే లైట్ తీసుకుంటుందో అన్న చర్చ నడుస్తోంది. అసలు వసంత ఈ కామెంట్స్ చేయడం వెనుక చాలా పెద్ద ప్లానే ఉందంటున్నారు ఆయన గురించి తెలిసిన లీడర్లు. 
 
మైలవరంలో వసంత ఇష్యూ ఇదే...

మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఇటీవల కాలంలో విభేదాలు బయటపడ్డాయి. గతంలో నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా పని చేసిన ప్రస్తుత మంత్రి జోగి రమేష్‌తో వసంతకు విభేదాలు ఉన్నాయి. ఈ విషయంపై ఇరువురు నేతలను వైసీపీ సలహాదారు సజ్జల విడివిడిగా పిలిపించి మాట్లాడారు. ఆ తరువాత వసంత నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షలో భాగంగా జగన్ వద్ద కూడా జోగి వ్యవహరాన్ని ప్రస్తావించారు. అయితే జగన్ వీటిని తరువాత చూద్దాంలే అన్న...అంటూ వసంతతో అన్నారట. అయితే స్థానికంగా మాత్రం ఇద్దరు నేతల మధ్య విభేదాలు తగ్గేదేలే అన్నట్లుగా నడుస్తున్నాయి.

వాయిస్ పెంచిన వసంత.....

జోగి రమేష్‌తో విభేదాలు ఉన్నప్పటికీ వాటిని వసంత పెద్దగా పట్టించుకోలేదు. అయితే రాను రాను ఇబ్బందులు ఎక్కువ కావటంతో వసంత ఈ విషయాలపై పార్టీ నాయకులతో చర్చించటంతో ప్రచారం కూడా పెరిగింది. ఆ తరువాత బహిరంగంగానే జోగితో ఉన్న విభేదాలపై వసంత వ్యాఖ్యాలు చేశారు. నియోజకవర్గంలో టీడీపీ నుంచి అత్యంత కీలకమైన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. దేవినేని ఉమాను ఎదుర్కోవాలంటే జోగి రమేష్‌కు బలం లేదని వసంత వర్గం ప్రచారం చేస్తోంది. ఇదే ఈక్వేషన్‌ను వసంత తన బలంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని టాక్. అందులో భాగంగానే సైలెంట్‌గా రాజకీయాలు చేసే మనస్తత్వం ఉన్న వసంత స్వరం పెంచుతున్నారట. అదే బలంతో మిత్రుడు ఉయ్యూరు శ్రీనివాస్‌కు సపోర్ట్‌గా నిలిచారట. ఈ కారణంగానైనా తన బాధను అధిష్ఠానం పట్టించుకొని మైలవరం జోలికి రావద్దని జోకి రమేష్‌కు చెబుతుందని వసంత ప్లాన్ అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget