అన్వేషించండి

Vijayashanti: పార్టీలో ప్రాధాన్యం లేదు - బీజేపీ నేతల తీరుపై విజయశాంతి అసంతృప్తి !

పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని విజయశాంతి బీజేపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఎందుకు మాట్లాడనివ్వడం లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు.


Vijayashanti :  తెలంగాణ బీజేపీ నేతలకు తనకు మాట్లాడే చాన్సివ్వడం లేదని ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్‌కు..  పార్లమెంటరీ బోర్డుతో పాటు ఎన్నికల కమిటీలోనూ చోటు దక్కిన కారణంగా బీజేపీ కార్యాలయంలో ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమానికి విజయశాంతి హాజరయ్యారు. అయితే ఆ తర్వాత కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడిన విజయ శాంతి.. తాను అసంతృప్తిగా ఉన్నానని పరోక్షంగా వెల్లడించారు. తాను  అసంతృప్తిగా ఉన్నానో లేదో మా పార్టీ నేతల దగ్గర క్లారిటీ తీసుకోండని సలహా ఇచ్చారు. తనను ఎందుకు మాట్లాడనివ్వడం లేదో తెలియడం లేదన్నారు. పార్టీ తన సేవలను ఉపయోగించుకోవాలనుకుంటుందో లేదో స్పష్టత లేదన్నారు.

పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత కోసం విజయశాంతి ఎదురు చూపులు

పార్టీకి తన సేవలు అవసరం అయితే తాను సిద్దంగా ఉన్నాననని విజయశాంతి స్పష్టం చేశారు.  నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానని.. ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు.  తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న విజయశాంతి .. ఆ పార్టీపై అసంతృప్తితో  గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరారు. మొదట్లో కొన్ని రోజులు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. తర్వాత ఆమె సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడూ కేసీఆర్ నిర్ణయాలపై విమర్శలు చేయడం మినహా పెద్దగా తెర ముందుకు రావడం లేదు. పార్టీ కార్యాలయంలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. 

తనకు రాను రాను ప్రాధాన్యం తగ్గిపోతోందని ఆందోళన

ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో బీజేపీ నేతలందరూ ఏఏ సీట్లలో పోటీ చేయాలో ఖరారు చేసుకుంటున్నారు. అయితే  విజయశాంతి విషయంలో స్పష్టత లేకుండా పోయింది.  ఆమె కంటూ ప్రత్యేకంగా నియోజకవర్గం లేదు. టీఆర్ఎస్‌లో ఉండగా మెదక్ పార్లమెంట్.. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆమె మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ మెదక్ నుంచి పోటీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత మళ్లీ ఆమె మెదక్ వైపు చూడలేదు. పైగా అక్కడ టిక్కెట్ ఆశించే నేతలు ఎక్కువగా ఉన్నారు. 

ఇటీవల పెద్దగా బీజేపీ కార్యక్రమాల్లో కనిపించని విజయశాంతి

విజయశాంతి బీజేపీలో చేరడంలో కిషన్ రెడ్డి,  కె.లక్ష్మణ్ కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం వారిద్దరూ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.  కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగా.. బీజేపీ అత్యున్నత కమిటీల్లో లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం విజయశాంతిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. తాను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదని విజయశాంతి బాధపడుతున్నారు. బీజేపీ అసంతృప్తిపై బీజేపీ నేతలు ఆమెతో చర్చించే అవకాశం ఉంది.  విజయశాంతి మొదట బీజేపీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తర్వాత తెలంగాణ తల్లి అనే పార్టీని పెట్టారు. టీఆర్ఎస్‌లో విలీనం చేశారు.  తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ  బీజేపీలో చేరారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Elections 2026: పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Sonam Kapoor : రెండోసారి తల్లయిన బాలీవుడ్ హీరోయిన్ - నలుగురితో న్యూ జర్నీ అంటూ...
రెండోసారి తల్లయిన బాలీవుడ్ హీరోయిన్ - నలుగురితో న్యూ జర్నీ అంటూ...
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
విశాఖలో డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
How to Escape from Locked Car: ప్రమాదం తర్వాత మీ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయితే, బయటపడేందుకు చిట్కాలు
ప్రమాదం తర్వాత మీ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయితే, బయటపడేందుకు చిట్కాలు
Embed widget