By: ABP Desam | Updated at : 20 Apr 2023 01:00 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదెదో పెద్ద విషయం కూడా కాదు. కేవలం పుట్టిన రోజులు శుభాకాంక్షల ట్వీటే. అది కూడా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు చెప్పారు.
టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడుకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ విజయ్ సాయిరెడ్డి పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది. గతంలో ఆయన పెట్టిన ట్వీట్లను వెలికి తీసి మరీ మీరు మారిపోయార్ సార్ అంటున్నారు నెటిజన్లు.
టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 20, 2023
సాయిరెడ్డి గారూ...
— guthi.chandrashekar (@guthichandrash2) April 20, 2023
మీలో వచ్చిన ఈమార్పు నిజంగా సంతోషకారం...
మా నాయకుడిని గౌరవించిన వార్ని మేమూ గౌరవిస్తాం...
థాంక్యూ వేరీ మచ్ సర్.🤝
గతంలో చంద్రబాబుకు పుట్టిన రోజుల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన విజయసాయిరెడ్డి వివాదాస్పద భాషను వాడారు. 2021 ఏప్రిల్ 20న చేసిన ట్వీట్ కూడా వైరల్గా మారుతోంది.
ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 20, 2021
పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం.17 తర్వాత 'పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని' ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్ళీ నీ 'బ్రీఫ్ డు అవసరం లేదు. pic.twitter.com/mVN3ZunkpW
సర్ మీరు పెద్దవారు మీరు ఇలా మీ పెద్దరికం కాపాడుకోండి సర్ మేము మిమ్మల్ని గౌరవిస్తాం చనిపోతే మనతో వచ్చేది ఎం లేదు కదా సర్, మీ మార్పు మాకు ఆనందాన్ని ఇస్తుంది. జై సాయి రామ్
— raghupathi reddy (@MVRREDDY8) April 20, 2023
Meeru maripoyaru sir, ilane vundandi repsect istham antha educated ayyi vundi chaala chillara posts vesaru but ippudu thelusukunnaru thank you!!! pic.twitter.com/0LkH89d5jO
— . (@vengalaraopach6) April 20, 2023
అయితే చాలా రోజుల నుంచి విజయసాయిరెడ్డి ట్వీట్లలో మార్పు కనిపిస్తోంది. ఎప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుక పడే ఆయన ఈ మధ్య కాలంలో చాలా నెమ్మదించారు. గతంలో పరుషపదజాలంతో ట్వీట్లు చేసేవారు. ఇప్పుడు ఆ వివాదాలు ఆయన ట్వీట్లలో కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలపై ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ఎక్కువగా ట్వీట్లు చేస్తున్నారు. అది కూడా హిందీలో ఎక్కువగా ట్వీట్లు కనిపిస్తున్నాయి.
రామోజీరావుపై సైలెన్స్
గతంలో రామోజీగ్రూప్ చైర్మన్ రామోజీరావు అన్నా ఈనాడు అన్నా పూనకం వచ్చేలా ట్వీట్లు వేసే విజయసాయిరెడ్డి ఇప్పుడు వారి జోలికే వెళ్లడం లేదు. ఈ మధ్య కాలంలో మార్గదర్శి ఇష్యూలో కూడా ఆయన ఇంతవరకు రియాక్ట్ కాలేదు. ప్రభుత్వ పెద్దలు ఆ సంస్థపై, రామోజీరావుపై గుర్రుగా ఉన్నా సాయి రెడ్డి నుంచి ఉలుకూపలుకూ లేదు.
Telangana politics : కేసీఆర్ విమర్శించకపోవడమే అసలు కష్టం - బీజేపీ సమస్యకు పరిష్కారమేది ?
AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు - ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !
Mini Jamili Elections : మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?
BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?
బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ
చాలా సింపుల్గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వివాహం
RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam