అన్వేషించండి

Telangana congress: బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పోరాటం: 42% సాధించేనా? | Jantar Mantar వద్ద ధర్నా!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచడమే హస్తినలో ఈ నిరసనకు ప్రధాన కారణం. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులనుతెలంగాణ అసెంబ్లీ ఆమోదించి రాష్ట్రపతికి పంపింది.

Telangana congress :బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ బాట పట్టింది. ఇవాళ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టనుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సహా బీసీ నేతలంతా ఢిల్లీలో మకాం వేశారు.
 
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే ఈ నిరసన
 
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచడమే హస్తినలో ఈ నిరసనకు ప్రధాన కారణం. బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులను రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపింది.
 
1. తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు (విద్యా సంస్థలలో సీట్ల రిజర్వేషన్లు, రాష్ట్ర సేవల్లో నియామకాలు లేదా పోస్టులు) బిల్లు, 2025 (The Telangana Backward Classes, Scheduled Castes and Scheduled Tribes (Reservation of Seats in Educational Institutions and of Appointments or Posts in the Services under the State) Bill, 2025): ఇందులో విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అసెంబ్లీ ఆమోదించిన రీతిలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. అదే రీతిలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది ఈ బిల్లులో పేర్కొన్న ముఖ్యాంశాలు. అంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించి ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం చట్టం చేయాల్సి ఉంది.
 
2. తెలంగాణ వెనుకబడిన తరగతులు (గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్లు) బిల్లు, 2025 (The Telangana Backward Classes (Reservation of Seats in Rural and Urban Local Bodies) Bill, 2025): రాజకీయంగా అంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు. దీన్ని తెలంగాణ శాసనసభ ఆమోదించింది. గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం జరిగింది.
 
ఇలా ఈ రెండు బిల్లులపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే పార్లమెంట్‌లో దీనిపై చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ ఇచ్చింది. ఇక ఇవాళ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగనుంది. రేపు రాష్ట్రపతిని కలిసి విన్నవించాలని సీఎం రేవంత్ రెడ్డి, ఇతర బీసీ నేతలు నిర్ణయించారు.
 
ప్రతిష్ఠాత్మకంగా ఈ నిరసన కార్యక్రమాలను తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 1200 మంది కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ప్రత్యేక రైలులో ఢిల్లీకి తీసుకెళ్లింది. జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేయనుంది. ఇందులో ఏఐసీసీ ముఖ్య నేతలు, ఇండియా కూటమిలోని ఇతర పార్టీ నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
AP Assembly: అసెంబ్లీకి రాకుండా ముట్టడి అంటే అనర్హతే - వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కఠిన చర్యలకు రెడీ అయ్యారా?
అసెంబ్లీకి రాకుండా ముట్టడి అంటే అనర్హతే - వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కఠిన చర్యలకు రెడీ అయ్యారా?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget