అన్వేషించండి

TDP Mahanadu NTR : టీడీపీ మహానాడుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ! ఎన్టీఆర్ కుటుంబం అంతా తరలి రానుందా ?

తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఈ సారి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను మహానాడు వేదికగానే ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సహా అందరూ హాజరవుతారని టీడీపీ వర్గాలు ఆశిస్తున్నాయి.

 

తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ సారి ఒంగోలులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సారి అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు.  ప్రత్యేకతలు కూడా ఎక్కువే ఉండబోతున్నాయి. ఈ సారి మహానాడు వేదికపై ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరూ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు జూమ్ ద్వారానే ఆన్ లైన్ లో  మహానాడు జరిపిన టీడీపీ ఈ సారి మాత్రం ఎన్టీఆర్ కుటుంబసభ్యులు , పార్టీ అభిమానులు ,కార్యకర్తలు ,నేతల సమక్షంలో భారీ స్థాయిలో మహానాడును జరుపడానికి సన్నద్ధం అవుతుంది .  అధికారం లో ఉండగా విశాఖ లో ఒకసారి ,విజయవాడ లో చివరి సారిగా మహానాడు జరిపిన టీడీపీ కోవిడ్  నిబంధనల నేపథ్యంలో గత రెండేళ్లుగా  ప్రజల సమక్షంలో మహానాడు జరుపలేదు .

రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలైన నేపథ్యంలో మహానాడు వేదిక నుండే ఎన్నికల శంఖారావం పూరించాలని  టీడీపీ భావిస్తుంది . ప్రతీ ఏడూ తెలుగు దేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా మే నెల  27,28,29 తేదీలలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేస్తుంది టీడీపీ . పార్టీ భవిష్యత్ ప్రణాళికలకు ,అంతర్మధనానికి మహానాడు వేదిక గా నిలుస్తుంది . ప్రస్తుతం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు కావడంతో పాటు.. ఎన్టీఆర్ జన్మించి 99 ఏళ్ళు పూర్తి కావొస్తుండడం తో ఆయన శత జయంతి ఉత్సవాలను మహానాడు నుండే మొదలు పెట్టాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించి పార్టీ అభిమానుల్లో నూ ,కార్యకర్తల్లోనూ క్రొత్త ఉత్సాహం నింపాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది . ఈ మహానాడు మొదలు వచ్చే మహానాడు వరకూ ఏడాదిపాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చెయ్యడం ద్వారా 2024 ఎన్నికల నాటికి పార్టీని సంసిద్ధం చెయ్యాలని చంద్రబాబు భావిస్తున్నారు . అలాగే రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న నందమూరి కుటుంబ సభ్యులను కూడా మహానాడులో పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా నందమూరి హరి కృష్ణ కుమారులైన కల్యాణ రామ్  , జూనియర్  ఎన్టీఆర్ లను మహానాడులో చూడాలని టీడీపీ అభిమానులు కోరుతున్నారు . 

ఇటీవల అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తె , చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో ఎన్టీఆర్ కుటుంబం అంతా ఏకతాటిపైకి వచ్చింది. వైఎస్ఆర్‌సీపీ నేతల వ్యాఖ్యలను ఖండించింది. ఆ తరహాలోనే ఇప్పుడు టీడీపీ కోసం వారంతా తరలి వస్తారని టీడీపీ అభిమానులు ఆశిస్తున్నారు. అప్పడు ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్ కూడా స్పందించారు. తాము రాజకీయాలకు దూరంగా ఉన్నా.. టీడీపీకి దూరంగా ఉండబోమని వారు చెబుతారని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Vijayawada CP: జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
ABP CVoter Opinion poll  :  అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా -  ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా - ఏబీపీ న్యూస్సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
Weather Latest Update: నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Dinesh Karthik Hitting vs SRH IPL 2024: ప్రపంచకప్ రేసులోకి ఉసేన్ బోల్ట్ లా వచ్చిన దినేష్ కార్తీక్RCB vs SRH IPL 2024: మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్Travis Head Century vs RCB IPL 2024: రికార్డ్ స్కోరింగ్ మ్యాచ్ లో మరోసారి బలైన RCB, 25 పరుగులతో ఓటమిRCB vs SRH Match Highlights | ఆర్సీబీ పై 25 పరుగుల తేడాతో SRH చారిత్రక విజయం | IPL 2024 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Vijayawada CP: జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
ABP CVoter Opinion poll  :  అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా -  ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా - ఏబీపీ న్యూస్సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
Weather Latest Update: నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
IPL 2024: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై హైదరాబాద్‌ ఘన విజయం
హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై హైదరాబాద్‌ ఘన విజయం
Hyderabad News: మందు బాబులకు అలర్ట్! ఆ రోజు ట్విన్ సిటీస్‌లో వైన్ షాపులు బంద్
మందు బాబులకు అలర్ట్! ఆ రోజు ట్విన్ సిటీస్‌లో వైన్ షాపులు బంద్
OnePlus Price Cut: ఈ వన్‌ప్లస్ సూపర్ ఫోన్‌పై ఏకంగా రూ.ఐదు వేలు తగ్గింపు - ఇప్పుడు ధర ఎంత?
ఈ వన్‌ప్లస్ సూపర్ ఫోన్‌పై ఏకంగా రూ.ఐదు వేలు తగ్గింపు - ఇప్పుడు ధర ఎంత?
Pawan Kalyan: సీఎంపై రాయి దాడికి బాధ్యత వారిదే, ముందు ఆ నలుగురిని విచారణ చేయాలి - పవన్ కల్యాణ్
సీఎంపై రాయి దాడికి బాధ్యత వారిదే, ముందు ఆ నలుగురిని విచారణ చేయాలి - పవన్ కల్యాణ్
Embed widget