అన్వేషించండి

TDP Candidates : ఎవరి సీట్లకు ఎసరు పడుతుందో ? ఉమ్మడి తూర్పులో టీడీపీ, జనసేన అభ్యర్ధుల్లో ఒకటే టెన్షన్‌ !

TDP Janasena Alliance : పొత్తుల్లో భాగం ఎవరి సీట్లు పోతాయోనని తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. తమ సీటు తమకే ఉంచాలని పార్టీల అధినేతల వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు.

East Godavari Politics :   రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయా పార్టీల అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో జనసేనకు పట్టున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా టీడీపీ ఆశావహుల్లో ఒకటే టెన్షన్‌ పట్టుకుంది. ఇన్నాళ్లు ప్రజల్లో తామే అభ్యర్ధులమన్న నమ్మకంతో కష్టపడ్డ టీడీపీ నాయకుల ఆశలు గల్లంతవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుండడంతో గెలుపు దగ్గర్లోనే ఉన్నా పోటీచేసే అవకాశం లేకపోతోందంటూ తలలు పట్టుకుంటున్నారట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో జనసేన ఎగరేసుకుపోతుందని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో ఆ నియోజవర్గాల్లోని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జులు ఒకటే హైరానా పడుతున్నారు. 

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మూడు సీట్లు !

జనసేన పార్టీకు మంచి పట్టున్న ప్రాంతం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాగా ఈ జిల్లా పరిధిలోనే మూడు స్థానాలు జనసేన పోటీచేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ నాయకులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం. అయితే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వైసీపీ గూటికి చేరుకోవడంతో ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచి తీరుతామని మలికిపురం వారాహి సభ సందర్భంగా స్వయంగా జనసేనాన్ని ప్రకటించారు.  అయితే ఇక్కడ టీడీపీ నుంచి బలమైన అభ్యర్ధి గొల్లపల్లి సూర్యారావు ఉండడం ఈసారి టీడీపీనే దక్కించుకుంటుందని ప్రచారం జరుగుతుంది. 

జనసేన నేతల గట్టి  ప్రయత్నాలు

అమలాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. జిల్లా హెడ్‌ క్వార్టర్‌ను టీడీపీ వదులకుంటుందా అంటూ టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ అయితాబత్తుల ఆనందరావుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉండడంతో జనసేనకు కలిసి వచ్చే అంశంగా మారింది. దీంతో జనసేనకు టిక్కెట్టు ఇవ్వాలని ఆ పార్టీ ఇంచార్జ్‌ శెట్టిబత్తుల రాజబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పి.గన్నవరం నుంచి జనసేనకు టిక్కెట్టు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుండగా ఒకే జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాలనుంచి జనసేనకు కేటాయించడం జరగదని చర్చ జరుగుతుంది. రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యంకు సీటు ఇస్తారని అనుకుంటున్నా ఇక్కడ జనసేన పార్టీనే బరిలోకి దింపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

పిఠాపురంపైనే జనసేన ఆశలు..

కాకినాడ జిల్లా పరిధిలోని పిఠాపురం నియోజకవర్గం గెలుపు పైనే జనసేన పార్టీ ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గం జనసేనకు కన్ఫర్మ్‌ అని తెలుస్తోంది. ఇక తుని, కాకినాడ రూరల్‌, జగ్గంపేట నియోజకవర్గాల్లో కూడా జనసేన పోటీచేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం సీటు జనసేనకే ఖరారు కాగా ఇప్పటికే ఈ నియోజకవర్గ జనసేన అభ్యర్ధి బత్తుల బలరామకృష్ణ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం నుంచి కూడా జనసేన బరిలో దిగనుందని ప్రచారం జరుగుతుంది. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో తిరుగులేని నాయకునిగా పేరున్న టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ సారి పోటీ చేయరని, పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉందని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Amaravati Loans: అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు -  చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు - చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Amaravati Loans: అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు -  చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు - చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Telugu TV Movies Today: చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Rammohan Naidu News:శ్రీకాకుళం జిల్లాపై రామ్మోహన్ నాయుడు స్పెషల్ ఫోకస్- ఫిషింగ్‌ హార్బర్, జెట్టీలు ఏర్పాటుపై కేంద్రానికి లేఖ
శ్రీకాకుళం జిల్లాపై రామ్మోహన్ నాయుడు స్పెషల్ ఫోకస్- ఫిషింగ్‌ హార్బర్, జెట్టీలు ఏర్పాటుపై కేంద్రానికి లేఖ
Revanth Chit Chat: కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు  - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Latest Crime News: హైదరాబాద్‌లోని హబ్సీగూడలో విషాదం- ఇద్దరు పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య 
హైదరాబాద్‌లోని హబ్సీగూడలో విషాదం- ఇద్దరు పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య 
Embed widget