అన్వేషించండి

Andhra Politics : వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలపై టీడీపీ పక్కా వ్యూహం - రాజీనామాలు చేసినా పదవులు వాళ్లకే !

Andhra Pradesh : వైసీపీ నేతల చేరికలపై టీడీపీ పక్కా వ్యూహం పాటిస్తోంది. రాజ్యసభ, మండలిలో వైసీపీ బలం తగ్గిపోయేలా టీడీపీ బలం పెరిగేలా చూసుకుంటోంది.

TDP Strategy on the inclusion of YCP leaders :  వైఎస్ఆర్‌సీపీలో వరుస రాజీనామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ పలువురు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. వారికి ఏ పార్టీలో ఎంట్రీ లభిస్తుందో స్పష్టత లేదు. ఇప్పటికైతే .. అసలు వైసీపీలో ఉండటం కన్నా.. రాజీనామా చేసి ఖాళీగా ఉండటం మంచిదని అనుకున్నారు. అదే పని చేశారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామా బాటపట్టారు. ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీకి చాలా పరిమతంగా ఉంది. రాజ్యసభలో.. శాసనమండలిలో మాత్రం ప్రభావం చూపగల స్థాయిలో బలం ఉంది. ఇప్పుడు వ్యూహాత్మకంగా ఆ రెండు చట్టసభల్లోనూ వైసీపీ నామమాత్రంగా మిగిలేలా టీడీపీ వ్యూహం పాటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 

రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది సభ్యులు    

వైసీపీకి రాజ్యసభలో  పదకొండు మంది సభ్యులు ఉన్నారు. టీడీపీకి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పుడు రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తుందని ముందుగానే  ప్రకటించారు. స్పీకర్ ఎన్నిక విషయంలో ఆయన బీజేపీ అడగక ముందే మద్దతు ప్రకటించారు. కానీ ఇటీవల పాలసీ మార్చుకున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో విబేధిస్తామని సూచనలు పంపారు. అదే సమయంలో ఢిల్లీలో ఆయన చేసిన ధర్నాకు ఇండియా కూటమి పార్టీలన్నీ వచ్చి మద్దతు పలికాయి. దాంతో ఆయన ఇండియా కూటమికి దగ్గరగా  మారిపోయారని క్లారిటీ వచ్చేసింది. అప్పట్నుంచే అసలు రాజకీయం ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా ఏదో ఓ పార్టీలో చేరిపోయేందుకు సిద్ధపడుతున్నారు. 

ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలకు కేంద్రం ఓకే: రామ్మోహన్‌ నాయుడు     

ఎవరు రాజీనామా చేసినా టీడీపీ ఖాతాలోకే !

టీడీపీలోకి ఎవరు రావాలన్నా రాజీనామా చేసి రావాలని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అంటే.. ఎవరు టీడీపీలోకి వచ్చినా రాజీనామా చేస్తారు. అందులో సందేహం లేదు. ఇక్కడ రాజీనామాలు చేయడం వల్ల ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు. ఇంకా  అధికార పార్టీకి ప్లస్ అవుతుంది. ఎందకంటే.. రాజీనామా చేసిన ప్రతీ స్థానంలోనూ గెలుపు కూటమిదే అవుతుంది. రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేస్తే ఉపఎన్నికలు వస్తాయి. ఇప్పుడు అసెంబ్లీలో బలం కూటమికే తిరుగులేని స్థాయిలో ఉంది. కనీసం పోటీ పెట్టడానికి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కూడా వైసీపీకి లేదు. అందుకే ఉపఎన్నికలు వస్తే కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం అవుతారు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి టీడీపీలోనో.. బీజేపీలోనే.. జనసేనలోనే చేరిపోతే ఉపఎన్నికలు వస్తాయి. వారికి అదే సీటును ఇస్తే వారి పదవి వారికి ఉంటుంది. కానీ పార్టీ మాత్రం.. అదికారికంగా మారిపోతారు. 

వైఎస్ఆర్‌సీపీలో రాజీనామాల విప్లవం - పెద్ద ఎత్తున రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పే చాన్స్

ఎమ్మెల్సీ అయినా అంతే !

ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైసీపీకి..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలకు ఉపఎన్నికలు వచ్చిన టీడీపీనే గెలుస్తుంది. ఇటీవల విశాఖ స్థానిక సంస్థల ఉపఎన్నిక విషయంలో జగన్ బొత్సను అభ్యర్థిగా ఖరారు చేయడంతో వ్యూహాత్మకంగా పోటీ పెట్టలేదని తెలుస్తోంది. దీని వెనుక భారీ రాజకీయం ఉందని చెబుతున్నారు. మిగతా ఎలాంటి ఎమ్మెల్సీలు వచ్చినా  టీడీపీ కూటమి గెల్చుకుంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న వారు కూటమిపార్టీల్లో చేరి రాజీనామాలు చేసినా వారి పదవులు వారికి ఉంటాయి. అందుకే రాజీనామాల పర్వం సాగబోతోందని చెబుతున్నారు. 

మొత్తంగా వైసీపీకి ఉన్న రాజకీయ  బలం.. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలే. ఇప్పుడు ఆ బలాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేందుకు పక్కా ప్రణాళికతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లుగా భావించవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget