అన్వేషించండి

Chandrababu On Jagan : హోదా కోసం యుద్ధం ఎప్పుడు ప్రారంభిస్తారు జగన్ ?

ప్రత్యేకహోదా కోసం జగన్ ఎప్పుడు యుద్ధం ప్రారంభిస్తారో చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని స్ట్రాటజీ కమిటీ భేటీలో చంద్రబాబు విమర్శించారు.


ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ ఎప్పుడు యుద్దం మొదలు పెడతారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ( Chandra babu ) ప్రశ్నించారు. ప్రధానికి ఇచ్చే వినతి పత్రంలో కూడా హోదా అంశాన్ని జగన్ ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. తమ పోరాటం వల్లనే హోదా విషయంలో కేంద్ర కమిటీ వేశారన్న వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) నేతలు తర్వాత  అజెండా ఎందుకు  మారిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశం రావడానికి సీఎం చేసిన కృషే కారణమని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీడియాలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు డబ్బా కొట్టించుకుని.. సాయంత్రానికి టీడీపీపై బురదజల్లడం జగన్ రెడ్డి అసమర్థతకు, లాలూచీకి నిదర్శనమని  చంద్రబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 

తెలుగు సినీ రంగాన్ని జగన్ కించ పర్చడం బాధాకరం : చంద్రబాబు
  
తెలుగు సినీ  హీరోలను, ప్రముఖులను సీఎం జగన్ మీటింగ్ పేరుతో పిలిపించి అవమానించడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమా ( Tollywood ) పరిశ్రమను జగన్ తన వైఖరితో కించపరిచారని అన్నారు. లేని సమస్యను సృష్టించి సినిమా రంగాన్ని కించపరిచేలా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు.  స్వశక్తితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ( Chiranjeevi ) వంటి వారు సిఎంకు చేతులు జోడించి వేడుకోవాలా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు పాల్గొన్న ఆ సమావేశంలో జగన్ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు మమండిపడ్డారు.  ప్రపంచ స్థాయికి చేరిన తెలుగు సినిమా రంగ ప్రతిభపై కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ ( PM Modi)  చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.

ఈశాన్య రాష్ట్రాల స్థాయికి ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన సీఎం జగన్ ! 

 రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏమాత్రం తగ్గకపోయినా ఆర్థిక వ్యవస్థ ( AP Financial Situation ) నాశనం అవ్వడానికి జగన్  విధానాలే కారణం అని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 112 సార్లు ఒవర్ డ్రాఫ్ట్ కు వెళ్లిందని....193 సార్లు వేస్ అండ్ మీన్స్ తీసుకున్నారని...వెనుక బడిన ఈశాన్య రాష్ట్రాల స్థాయికి రాష్ట్రాన్ని జగన్ తీసుకువెళ్లారని నేతలు వివరించారు. పాఠశాలల విలీనం  విద్యార్థులకు స్కూళ్లు దూరం అవుతున్నాయని.. ఎస్సీ, బీసీ కాలనీల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలు ( Schools ) రద్దు చేయడాన్ని టీడీపీ ఖండించింది.   రాష్ట్రంలో అమలువుతున్న అనధికార విద్యుత్ కోతలపైనా సమావేశంలో చర్చించారు. గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా తీసివేస్తున్నారని....విద్యుత్ రంగంలో మళ్లీ రాష్ట్రం తిరుగమనంలోకి వెళ్లిందన్నారు. కరెంట్ సరఫరా లేకపోయినా....కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయని అన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు తిరస్కరించిన కేసీఆర్‌లాగే ఏపీలో జగన్ రెడ్డి మోటార్లకు మీటర్లు బిగించవద్దని డిమాండ్ చేశారు.

ఆటోనగర్ స్థలాలు లాక్కోవడం కబ్జా చేయడమే ! 

రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లోని ఆటోనగర్ ల ( Auto Nagars ) స్థలాలను కబ్జా చేసేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధికి మార్గం చూపకపోగా... ప్రైవేటు ఆస్థులు లాక్కునేందుకు ప్రయత్నించడానికి నేతలు తప్పు పట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని...మందుల కొరత, ఆర్థిక సమస్యలతో  అసుపత్రుల్లో వివిధ చెల్లింపులు లేవన్నారు. ఉపాధి నిధుల్లో పేదలకు చేరాల్సిన డబ్బును అవినీతితో తినేస్తున్నారని నేతలు సమావేశంలో వివరించారు. ఉపాధి హామీ నిధులు ఏపీలో రూ. 261 కోట్లు అవినీతి పాలయ్యాయని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రకటించింది. ఇది దేశంలో మొదటి స్థానంగా ఉందని రానున్న రోజుల్లో నిధులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget