అన్వేషించండి

Chandrababu: 'రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు రాజధానులు కడతారా?' - బూతులు మట్లాడే వారికే మంత్రి పదవులు ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం

Andhrapradesh News: సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. గుంతలు పూడ్చలేని వారు రాజధానులు కడతారా.? అంటూ సెటైర్లు వేశారు.

Chandrababu Speech In Pamarru Prajagalam Meeting: రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూడ్చ లేని వారు 3 రాజధానులు కడతారా.? అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో (Pamarru) ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ జిల్లాలో ఎంతో మంది గొప్ప మహనీయులు పుట్టారని.. అయితే, ప్రస్తుతం ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్కల్లా కొందరు నేతలు తయారయ్యారని విమర్శించారు. సీఎం జగన్ బూతులు మాట్లాడే వారికే మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ధ్వజమెత్తారు. రైతును రాజు చేయడమే తన ఉద్దేశమని.. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని, సాధారణ పెన్షన్లు కూడా నెలకు రూ.4 వేలకు పెంచుతామని అన్నారు. అలాగే, మహిళలకు నెలకు రూ.1500 అందిస్తామని స్పష్టం చేశారు.

'ఆ బాధ్యత నాది'

అమరావతి రాజధానిగా ఉంటే కృష్ణా జిల్లాలో భూములకు విలువ వచ్చేదని.. రాజధాని పూర్తై ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం వచ్చేదని చంద్రబాబు అన్నారు. 'ఉద్యోగాలు దొరక్క ఇక్కడి యువత హైదరాబాద్ వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. టీడీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ యువతకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం తీసుకొస్తాం. జాబు కావాలంటే బాబు రావాలని అంతా ఎదురు చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం నా చిరకాల కోరిక. సీఎం జగన్ హయాంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా.?. డీఎస్సీ వేశారా.?. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారు. జగన్ కు డబ్బులు కావాలి. నాకు మంచి నేతలు కావాలి. అభివృద్ధికి ఓటు వేస్తారో.?. విధ్వంసానికి ఓటు వేస్తారో.? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఉమ్మడి ప్రచారం

అటు, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ - జనసేన - కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఇప్పటికే చంద్రబాబు ప్రజాగళం సభలు, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ముమ్మరం ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడిగా కలిసి క్యాంపెయిన్ నిర్వహించేలా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రజాగళం మూడో విడతలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల అధినేతలు కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఈ నెల 10న తణుకు, నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లోనూ ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు.

Also Read: Tirupati Constituency: తిరుపతిలో కాంగ్రెస్ ఏం ప్లాన్ చేస్తోంది? కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విశ్వప్రయత్నాలు! ౌ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Assam Congress troubles: అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
Telangana Congress internal democracy: తెలంగాణ కాంగ్రెస్‌లో గీత దాటిపోతున్న అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ పట్టు పైపైనే కనిపిస్తోందా?
తెలంగాణ కాంగ్రెస్‌లో గీత దాటిపోతున్న అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ పట్టు పైపైనే కనిపిస్తోందా?

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana Budget 2026-27: 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
Embed widget