అన్వేషించండి

Chandrababu: 'రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు రాజధానులు కడతారా?' - బూతులు మట్లాడే వారికే మంత్రి పదవులు ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం

Andhrapradesh News: సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. గుంతలు పూడ్చలేని వారు రాజధానులు కడతారా.? అంటూ సెటైర్లు వేశారు.

Chandrababu Speech In Pamarru Prajagalam Meeting: రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూడ్చ లేని వారు 3 రాజధానులు కడతారా.? అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో (Pamarru) ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ జిల్లాలో ఎంతో మంది గొప్ప మహనీయులు పుట్టారని.. అయితే, ప్రస్తుతం ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్కల్లా కొందరు నేతలు తయారయ్యారని విమర్శించారు. సీఎం జగన్ బూతులు మాట్లాడే వారికే మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ధ్వజమెత్తారు. రైతును రాజు చేయడమే తన ఉద్దేశమని.. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని, సాధారణ పెన్షన్లు కూడా నెలకు రూ.4 వేలకు పెంచుతామని అన్నారు. అలాగే, మహిళలకు నెలకు రూ.1500 అందిస్తామని స్పష్టం చేశారు.

'ఆ బాధ్యత నాది'

అమరావతి రాజధానిగా ఉంటే కృష్ణా జిల్లాలో భూములకు విలువ వచ్చేదని.. రాజధాని పూర్తై ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం వచ్చేదని చంద్రబాబు అన్నారు. 'ఉద్యోగాలు దొరక్క ఇక్కడి యువత హైదరాబాద్ వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. టీడీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ యువతకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం తీసుకొస్తాం. జాబు కావాలంటే బాబు రావాలని అంతా ఎదురు చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం నా చిరకాల కోరిక. సీఎం జగన్ హయాంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా.?. డీఎస్సీ వేశారా.?. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారు. జగన్ కు డబ్బులు కావాలి. నాకు మంచి నేతలు కావాలి. అభివృద్ధికి ఓటు వేస్తారో.?. విధ్వంసానికి ఓటు వేస్తారో.? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఉమ్మడి ప్రచారం

అటు, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ - జనసేన - కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఇప్పటికే చంద్రబాబు ప్రజాగళం సభలు, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ముమ్మరం ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడిగా కలిసి క్యాంపెయిన్ నిర్వహించేలా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రజాగళం మూడో విడతలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల అధినేతలు కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఈ నెల 10న తణుకు, నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లోనూ ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు.

Also Read: Tirupati Constituency: తిరుపతిలో కాంగ్రెస్ ఏం ప్లాన్ చేస్తోంది? కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విశ్వప్రయత్నాలు! ౌ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi 7 Appeals: అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Modi Mind Game on Revanth Reddy: మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?
మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget