అన్వేషించండి

Nandigama Assembly Constituency: నందిగామలో మరోసారి 'మోహన్‌' రాగం వినిపించేనా...? ప్రజలు 'సౌమ్య' లకే పట్టం కట్టేనా.?

NTR District News: తెలుగుదేం ఆవిర్భావం తర్వాత తొలిసారి ఓటమి పాలైన నందిగామలో తిరిగి పట్టుసాధించేందుకు టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తుండగా..సిట్టింగ్ స్థానం నిలుపుకునేందుకు వైసీపీ పోరాడుతోంది.

Andhra Pradesh News: NTR జిల్లా నందిగామ నియోజకవర్గం. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నందిగామ(Nandigama)..విజయవాడ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఒకటి. ప్రస్తుతం వైసీపీ(YCP) తరపున మొండితోక జగన్మోహన్‌రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1955లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో నందిగామలో కొంతభాగంతోపాటు చందర్లపాడు, వీరులపాడు, కంచికచర్ల మండలాలు ఉన్నాయి. దాదాపు లక్షా 80 వేల ఓటర్లు ఉన్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతం కలిగిన నందిగామ నియోజవర్గం మొత్తం విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిగి ఇరువైపులా ఉంటుంది. విజయవాడకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే నందిగామ పట్టణం ఉంది.

ఎర్రన్నల గడ్డ
నందిగామ నియోజవర్గం మొదటి నుంచి వామపక్షాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. 1955లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ(CPI) నుంచి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు కాంగ్రెస్(Congress) అభ్యర్థిపై విజయం సాధించి నందిగామ తొలి ఎమ్మెల్యేగా చరిత్రకెక్కారు. ఆ తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లోనూ సీపీఐ ఈ సీటును నిలబెట్టుకుంది. సమీప కాంగ్రెస్ అభ్యర్థి బండి తిరుపతయ్యపై మరోసారి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు గెలుపొందారు. 1967లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. ఆ పార్టీ నుంచి అడుసుమిల్లి సూర్యనారాయణరావు సీపీఐ అభ్యర్థి కోదండరామయ్యపై విజయం సాధించారు.1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందగా ఆ పార్టీ నుంచి వసంత నాగేశ్వరరావు(Vasantha Nageswararao) జయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండుగా చీలిపోయింది. టిక్కెట్ కోసం పలువురు పోటీపడ్డారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత నాగేశ్వరరావుకు కాకుండా మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి సూర్యనారాయణరావు(Adusumilli Suryanarayana)కు టిక్కెట్ కేటాయించింది. ఇందిరా కాంగ్రెస్ నుంచి మధుసూదనరావు నిల్చున్నారు. దీంతో ఓట్లు చీలిపోయి జనతాపార్టీ అభ్యర్థి ముక్కపాటి వెంకటేశ్వరరావు(Mukkapati Venkateswarao) గెలుపొందారు.

పసుపు ప్రభంజనం
తెలుగుదేశంపార్టీ (Telugudesam) ఆవిర్భావం అనంతరం జరిగిన 1983 ఎన్నికల్లో NTR ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ సీట్లను తెలుగుదేశం కైవసం చేసుకుంది. అదే ఊపులో నందిగామ(Nandigama)లోనూ ఆ పార్టీ అభ్యర్థిగా మరోసారి వసంత నాగేశ్వరరావు విజయ దుందుబి మోగించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి ముక్కపాటి వెంకటేశ్వరరావుపై ఆయన గెలుపొందారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లోనూ కేవలం 2వేల ఓట్లలోపు మెజార్టీతో మరోసారి వసంత నాగేశ్వరరావు గెలుపొంది ఎన్టీఆర్(NTR) ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీని వీడిపోయారు.

1989లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీయగా ఆపార్టీ తరపున ముక్కపాటి వెంకటేశ్వరరావు మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1994 లో జరిగిన ఎన్నికల్లో యువకెరటం దేవినేని వెంకటరమణ(Devineni Venkataramana) తెలుగుదేశంపార్టీ తరపున విజయకేతనం ఎగురవేశారు. అతి తక్కువ కాలంలో నియోజకవర్గంపై పట్టుసాధించారు. పాలనలో వినూత్న ఒరవడితో ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా... చంద్రబాబు(Chandrababu) మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న దేవినేని వెంకటరమణ.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రైలు ప్రమాదంలో కన్నుమూశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రమణ సోదరుడు దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma Maheswara Rao) పోటీలో నిలవగా....కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత వెంకట కృష్ణప్రసాద్‌(Vsantha Krishna Prasad) కాంగ్రె తరపున బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో దేవినేని ఉమ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు.

2004లో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి దేవినేని ఉమ తెలుగుదేశం నుంచి బరిలో దిగగా....ఈసారి ఏకంగా మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు పోటీలో నిల్చున్నా తెలుగుదేశం గెలుపును నిలువరించలేకపోయారు. వరుసగా రెండోసారి దేవినేని ఉమ గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో నందిగామ ఎస్సీ నియోజకవర్గంగా మార్పుచెందడంతో ...2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తంగిరాల ప్రభాకరరావు(Thangiralla Prabhakarao) గెలుపొందారు. 2014లోనూ తెలుగుదేశం నుంచి తంగిరాల ప్రభాకరావు పోటీలో నిలవగా...తొలిసారి వైసీపీ(YCP) నుంచి మొండితోక జగన్మోహన్‌రావు(Mondithoka Jaganmohanrao) బరిలో నిల్చున్నారు ఈ ఎన్నికల్లోనూ తంగిరాల ప్రభాకర్‌రావు విజయం సాధించినా...అనతికాలంలోనే గుండెపోటుతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఉపఎన్నికకు వైసీపీ దూరంగా ఉండాలని భావించినా....కాంగ్రెస్ నుంచి బోడపాటి బాబూరావు పోటీలో ఉండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. తెలుగుదేశం నుంచి తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య(Sowmya) బరిలో నిల్చుని రికార్డు మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ హవా నడవడంతో ఫ్యాన్ గాలిలో తెలుగుదేశం కొట్టుకుపోయింది. నందిగామ నియోజకవర్గంలోనూ ఆ పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఓటమిపాలయ్యారు. వైసీపీ నుంచి డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి వీరివురే మళ్లీ పోటీపడనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget