అన్వేషించండి

KCR National Party : అన్నీ ప్రతికూలతలే - ఢిల్లీకి గురి పెట్టిన కేసీఆర్ నమ్మకమేంటి ?

జాతీయ పార్టీ పెట్టి ఢిల్లీ కోటను అందుకోవాలనుకుంటున్న కేసీఆర్‌కు అన్నీ ప్రతికూలతలే ఉన్నాయి. ఏ నమ్మకంతో ముందడుగు వేస్తున్నారు ?

KCR National Party :  తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. జాతీయ పార్టీ పెట్టడం ఖాయమని టీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ముందు అనేక ప్రతికూలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ఉత్తరాది ప్రజలకు తెలియకపోవడం దగ్గర్నుంచి  తెలంగాణ పేరుతో ప్రాంతీయ ఉద్యమం నడిపి ఇప్పుడు దేశం మొత్తం రాజకీయం చేస్తాననే భావజాలం వరకూ అనేక ప్రతికూలతలు ఉన్నాయి. అయినా కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. దీనికి కారణం ఆయనపై ఆయనకు ఉన్న నమ్మకం అని అనుకోవచ్చు. 

రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థులకు అందని నేత కేసీఆర్ !

 తెలంగాణలో తిరుగులేని నేతగా ఉన్న కేసీఆర్ ప్రతి అడుగులోనూ రాజకీయం ఉంటుంది. అది ప్రత్యర్థులకు అందని రాజకీయం. అందుకే తెలంగాణ రాష్ట్రాన్నిసాధించారు.  కానీ ఓ ప్రాంతీయ పార్టీ నేత . అదీ కూడా ప్రాంతీయ ఉద్యమాన్ని నిర్వహించి అధికారంలోకి వచ్చిన నేత. తాను జాతీయ రాజకీయాలు.. అని అంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికే టీఆర్ఎస్ పేరుతో కాకుండా జాతీయ పార్టీని ఆయన పెడుతున్నారు. అంటే తెలంగాణ ఇమేజ్‌ను వదిలి నేషనల్ లుక్ కోసం ప్రయత్నిస్తున్నారు. 

తెలంగాణ మోడల్ అభివృద్ధి పై నమ్మకం ! 

తెలంగాణ ఎనిమిదేళ్లలో అద్భుతంగా ప్రగతి సాధించిందని కేసీఆర్ నమ్ముతున్నారు.  ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిన విజయాల్ని దేశం ముందు పెడుతున్నారు. కేసీఆర్ తాను చేసి చూపిస్తానని వారికి తెలంగాణ అభివృద్ధి నమూనాను వారి ముందు ఆవిష్కరిస్తున్నారు.  స్వయంగా ఎవరూ చెప్పరు కాబట్టి...  ప్రకటనల రూపంలో తెలంగాణ అభివృద్దిని ఉత్తరాది ప్రజల ముందు ఉంచుతున్నారు. జాతీయ మీడియాలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ .. తెలంగాణ పాలన ప్రయోజనాలు అభివృద్ధే కనిపిస్తోంది. 

రైతు సెంటిమెంట్‌ను బలంగా ప్రయోగించే ప్లాన్ ! 

రైతులందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ... ఆయన గట్టి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అమలు చేస్తున్నారు కూడా. ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారం ఇచ్చారు. తెలంగాణలో రైతులకు తాము చేస్తున్న మేలు గురించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నారు. అదే సమయంలో అన్ని రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులను ప్రగతి భవన్‌కు పిలిపించి.. తెలంగాణలో రైతులకు చేస్తున్న మేలును వివరించారు. అందరం కలిసి రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ పిలుపు రైతు సంఘాల నేతల్ని ఆకర్షించింది. వారంతా....కేసీఆర్ నేతృత్వంలో రైతు పార్టీగా ఏర్పడి.. మోదీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారని అనుకోవచ్చు. రైతు నేతలంతా చట్టసభల్లో ఉండాలని కేసీఆర్ అన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో రైతు నేతలను ముందు పెట్టి.. రైతు సెంటిమెంట్‌తో.. రైతు పార్టీని కేసీఆర్ లాంఛ్ చేయబోతున్నారని అర్థం చేసుకోవచ్చు.
 
 ప్రత్యేక పార్టీతో ముందుకెళ్లడం ! 

ప్రాంతీయ పార్టీ నేతగా తాను ఇతర పార్టీలతో కూటమి కట్టి మాత్రమే రాజకీయాలు చేయగలనని కేసీఆర్ అనుకున్నారు. కానీ తన ఆలోచనలను చివరికి తానే మార్చుకున్నారు.జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలంటే.. ఈ కూటమి రాజకీయాలతో కుస్తీ పడటం కంటే.. తనదైన ప్రత్యేక పార్టీతో ముందుకెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు.  తన ఆలోచనలను .. ప్రజల్లోకి పంపుతున్నారు. ఇటీవల నిజామాబాద్ సభలో .. తాము వస్తాం.. దేశం అంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చేసిన ప్రకటనపై ఉత్తరాదిలోనూ విస్తృత చర్చ జరిగింది.  
 
కేసీఆర్ ఢీకొట్టబోతున్నది నరేంద్రమోదీని.  ఖచ్చితంగా ఈ పోరాటంలో అడ్వాంటేజ్ మోదీ వైపే ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ కేసీఆర్ రాజకీయాలను మాత్రం తక్కువ అంచనా వేయలేం.  జాతీయ రాజకీయాల్లో గతంలో కేంద్ర ప్రభుత్వాల్ని మార్చగలిగేలా...  ఏర్పాటు చేయగలిగేలా చక్రం తిప్పిన నేతలు ఉన్నారు కానీ... నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్నే లక్ష్యంగా చేసుకున్న తెలుగు నేతలెవరూ లేరు. ఇప్పుడు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Embed widget