అన్వేషించండి

Pawan Delhi Tour: త్వరలో ఢిల్లీకి జనసేనాని.. పొత్తులపై బీజేపీ పెద్దలతో చర్చలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి వచ్చేలా బిజెపిని ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Janasenani Delhi Tour : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి వచ్చేలా బిజెపిని ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఢిల్లీ పర్యటనకు పవన్ కళ్యాణ్ తాజాగా సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలోనే జనసేన, టిడిపితో పొత్తుపై ఒక స్పష్టతకు వచ్చేలా పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

నాన్చుడి ధోరణితో ప్రమాదం..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి అభ్యర్థులను ఖరారు చేస్తూ ఎన్నికల రణక్షేత్రంలోకి ముందుగా దూకింది. పొత్తు నిర్ణయాలు తేలక టిడిపి, జనసేన, బిజెపి.. ఇప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇది కూటమికి రానున్న రోజుల్లో ఇబ్బందికర అంశంగా పరిణమిస్తుంది తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుపై స్పష్టతకు రావాలని మీరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనలోనే కూటమిలో బిజెపి చేరటంపై స్పష్టతను తీసుకురావడంతోపాటు సీట్ల సర్దుబాటు పైన ఒక ప్రకటన చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి రాగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఈ ఇరువురు నేతలు బిజెపి అగ్ర నాయకులతో సమావేశమై సీట్ల పంపకాలపై తేల్చుకోనున్నారు.

పొత్తు ధర్మంపై ఇరు పార్టీల ఆగ్రహం..

వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయబోతున్నామంటూ జనసేన, తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు చెబుతున్నారు. కూటమి చర్చలు పూర్తికాకుండానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట, అరకు అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు. తనపై ఒత్తిడి ఉండడం వల్లే అభ్యర్థులను ప్రకటించాలంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పైన పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొత్తు పై స్పష్టత రాకుండానే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడమే కాకుండా జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులను పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ప్రకటించారు. రాజానగరం, రాజోలు అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. పొత్తు, సీట్ల పంపకాల ప్రక్రియ వేగంగా పూర్తి కాకపోతే ఇటువంటి ఇబ్బందులే తలెత్తుతాయని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఈ తరహా చిక్కులకు ఆస్కారం లేకుండా వీలైనంత వేగంగా పొత్తు, చెట్ల పంపకాలపై స్పష్టతకు రావాలని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget