అన్వేషించండి

Vizag YSRCP : విశాఖ వైఎస్ఆర్సీపీలో "భూ లకటక " - రాజ్యసభ, లోక్‌సభ ఎంపీల మధ్య రాజకీయంలో నలిగిపోతున్న అధికార పార్టీ !

విశాఖలో వైఎస్ఆర్‌సీపీకి చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యుల మధ్య పరస్పర ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి భూ


Vizag YSRCP :   ఓ వైపు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని ..గర్జనలు నిర్వహిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు మరో వైపు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మీడియాకు ఎక్కుతున్నారు. ఇది వైఎస్ఆర్‌సీపీ నేతల్ని అయోమయానికి చేసింది. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, లోక్ సభ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మధ్య పార్టీలో ఇంత కాలం ఉన్న అంతర్గత కలహాలు ఇప్పుడు ఒక్క సారిగా బయటపడ్డాయి. ఇరువురూ మీడియా ఎదుట ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారు. దీంతో విశాఖ వైఎస్ఆర్‌పీసీలో కలకలం బయలుదేరింది. 

విజయసాయిరెడ్డి వర్సెస్ ఎంవీవీ సత్యనారాయణ 

దసపల్లా భూముల వ్యవహారం, విజయసాయిరెడ్డి అల్లుడు, కుమార్తె కలిసి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంపై గత వారం రోజులుగా విస్తృతమైన చర్చ  జరుగుతోంది. దీనికి వివరణ ఇచ్చే సమయంలో విజయసాయిరెడ్డి .. కూర్మన్న పాలెంలో ఓ బిల్డర్ భూయజమానికి కేవలం ఒక్క శాతమే ఇచ్చి..99 శాతం తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ..దాని గురించి మీడియా ఎందుకు ప్రశ్నించదన్నారు. ఆ బిల్డర్ ఎవరో కాదు .. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణే.  దాంతో ఆయన  వ్యవహారంపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎంవీవీ సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. 

తనపై ఆరోపణలు చేసే ముందు విజయసాయి నిజాయితీని నిరూపించుకోవాలన్న  సత్యనారాయణ !

ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో  విశాఖ ఎంపీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గూండాగిరి చేసి విజయసాయిరెడ్డి భూములు రాయించుకుటున్నారని ఆరోపించారు. ఆ విషయం అందరికీ తెలుసన్నారు. తనపై చేసిన ఆరోపణలు తప్పన్నారు. భూములు కొనాలనుకున్న వారి ఆస్తులపై దాడి చేయడం.. వారి భూములను 22ఏలో పెట్టడం.. తర్వాత భూములు రాయించుకుని తీసేయడం వంటివి చేశారన్నారు. ఒక్క శాతం మాత్రమే ల్యాండ్ ఓనర్లకు ఇచ్చి..తాను 99 శాతం తీసుకుంటూ నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడారు. అది తాను రాజకీయాల్లోకి రాక ముందు 2017లో సెటిలైపోయిన విషయం అన్నారు. లోక్ అదాలత్‌లో ఆ విషయం తెలిందన్నారు. ఇప్పుడు దానిపై విజయసాయిరెడ్డి రచ్చచేయడం రాజకీయమేనని స్పష్టం చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేశారని.. ఇక్కడ విజయసాయిరెడ్డి చేసిందేమిటని ప్రశ్నించారు. తాను ప్రైవేటు భూముల్లో .. ఆ యజమానులతో ఒప్పందం చేసుకున్నానని ప్రభుత్వ భూములతో కాదని.. స్పష్టం చేశారు.  దసపల్లా భూములు ప్రభుత్వానివేనని.. వాటిని విజయసాయిరెడ్డి కొట్టేశారన్నట్లుగా పరోక్షంగా ఎంపీ చెబుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణల నుంచి విజయసాయిరెడ్డి నిజాయితీగా బయటకు రావాలన్నారు. ఎంవీవీ సత్యనారాయణ స్పందన .. నేరుగా విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేయడంతో విభేదాలు రోడ్డున పడినట్లయ్యాయి. 

వైఎస్ఆర్‌సీపీ ఉత్తారంధ్ర ఇంచార్జ్‌గా తప్పించినా విశాఖలోనే విజయసాయి మకాం !

వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. విజయసాయిరెడ్డిని తప్పించారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ మాత్రమే. ప్రత్యేకమైన ప్రాంతం ఉండదు. కానీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ ఎంపీ. పార్టీ పరంగా కానీ సాంకేతికంగా కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డికి విశాఖతో సంబంధంలేదు. కానీ ఆయన ప్రభుత్వ విధఆన నిర్ణయాలపై మాట్లాడుతున్నారు. దీనిపై వైఎస్ఆర్‌సీపీలోనే విస్మయం వ్యక్తవుతోంది. ఆయనను విశాఖ నుంచి తప్పించినా మొండిగా అక్కడే తన కార్యక్షేత్రం అని అంటున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు అంటున్నారు. గతంలో విజయసాయిరెడ్డికి ఇతర వైఎస్ఆర్‌సీపీ నేతలకు పెద్దగా సరిపడేది కాదు.అందుకే ఈ భూ వివాదాల్లో కూడా ఆయనకు మద్దతుగా ముందుకు వచ్చి మాట్లాడేవారు లేరు. 

కొసమెరుపేమిటంటే తనపై ఆరోపణలు చేస్తున్న మీడియాకు వ్యతిరేకంగా మీడియాను.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఎంపీకి వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్‌ను విజయసాయిరెడ్డి ప్రారంభిస్తామని  ప్రకటించారు. ఆయన కావాలనుంటే సొంత పార్టీ కూడా పెట్టుకోవచ్చని..ఎంపీ సత్యనారాయణ సలహా ఇస్తున్నారు. 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget