అన్వేషించండి

Telugu Desam Party 2024: 2024 సంవత్సరంలో చంద్రబాబు చాణక్యానికి, లోకేష్‌ పని తీరుకు లిట్మస్‌ టెస్టు

Telugu Desam Party 2024: తెలుగు దేశం పార్టీ భవిష్యత్‌కి 2024 కీలకం కాబోతోంది. 2019లో ఘోర పరాజయం పాలైన తర్వాత ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంది టీడీపీ.

Telugu Desam Party 2024: తెలుగు దేశం పార్టీ భవిష్యత్‌కి 2024 కీలకం కాబోతోంది. 2019లో ఘోర పరాజయం పాలైన తర్వాత ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంది టీడీపీ. అన్నింటిని తట్టుకొని నిలబడి ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నిక్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీకి గడచిన ఫైవ్‌ ఇయర్స్‌లో ముందు నాలుగేళ్లు ఒక ఎత్తైతే ఆఖరి ఏడాది మరో ఎత్తు. 2023 ఏడాదిని టీడీపీ ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరంగా మారిపోయింది. 

టీడీపీని ఇబ్బంది పెట్టిన 2023
గతేడాది చంద్రబాబు కేసుల్లో ఇరుక్కున్నారు. జైలుకి కూడా వెళ్లి వచ్చారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలని పేరున్న లీడర్లంతా కేసులతో సతమతమైన వాళ్లే. అందుకే గతం గతః అన్నట్టు ఈ ఏడాది అయినా మంచి జరగాల్సిన తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వంతోపాటు కేడర్ కోరుకుంటుంది. 

జనసేనతో పొత్తు
తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు కచ్చితంగా జీవన్మరణ సమస్యగా మారిపోయాయి. ఆరునూరైనా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా జాగ్రత్త పడుతోందా పార్టీ. ఇప్పటికే జనసేనతో పొత్తు కుర్చుకుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారీ వ్యూహన్ని రచిస్తోంది. 

సీట్ల పంచాయితీ
ఇప్పటివరకు సోషల్ మీడియా ఇతర మాధ్యమాల ద్వారా జనసేనతో పొత్తుపై పాజిటివ్‌ వాతావరణం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యంగా సీట్ల వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ అందరిలో ఉంది. ఒక వేళ బీజేపీ కూడా కలిసి వస్తే పరిస్థితి ఏంటనే డిస్కషన్ కూడా జరుగుతోంది. సీట్ల విషయంలో జనసేన కేడర్‌కు భారీగా డిమాండ్లు ఉన్నాయి. వాటిని రెండు పార్టీల అధినాయకత్వాలు ఎలా స్వీకరిస్తాయి అనేది కూడా ఆసక్తిగా మారింది. 

ఓట్ల మార్పిడీ పెద్ద టాస్క్
ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది కూడా ఇక్కడ మరో ముఖ్యమైన అంశం. సీట్ల విషయంలో ఎలాంటి లుకలుకలు లేకుండా ప్రక్రియ సాగిపోతే ఓటు ట్రాన్స్‌ఫర్‌ ఈజీగానే జరుగుతుంది. అయితే కొందరు వైసీపీ లీడర్లు మరికొందరు ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు, జనసేనవైపు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వారికి టికెట్లు ఇవ్వాల్సి వస్తే టీడీపీ ఏం చెప్పనుందో అన్న చర్చ నడుస్తోంది. ఈ మధ్యే జనసేనలో జాయిన్ అయిన వంశీకృష్ణ తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు. ఇలాంటి వాళ్లు జనసేనలో చాలా మంది జాయిన్ అవుతున్నారు. వారిని ఎలా సర్దుబాటు చేస్తారనేది పెద్ద్ క్వశ్చన్ మార్క్. 

ఇది జనసేన సొంత వ్యవహారం అయినప్పటికీ అది టీడీపీపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఇది పొత్తుపై ప్రభావం చూపే ఛాన్స్ లేకపోలేదు. అటు టీడీపీలో కూడా 175 నియోజకవర్గాల్లో ఆశావాహులు ఉన్నారు. జనసేనకు ఇచ్చిన టికెట్లలో టీడీపీ వాళ్లను ఎలా శాంతి పరిచి ఓటు షేర్ అయ్యేలా చేస్తారనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలా ఉభయోకుశలోపరి అన్నట్టు అటు కేడర్‌ను ఇటు లీడర్లను ఒప్పించి పొత్తులపై ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. 

మేనిఫెస్టో సవాల్ 
సంక్షేమం పేరుతో అనేక పథకాలు తీసుకొచ్చిన జగన్ అవే తనకు ఓట్ల వర్షం కురిపిస్తాయని నమ్ముతున్నారు. అయితే ఆ ఓటు బ్యాంకును తనవైపునకు తిప్పుకునేలా టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడున్న వినిపిస్తున్న ప్రశ్న. ఇప్పటికే ఐదు గ్యారంటీల పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం, నెలక 2500 నిధులు ఇవ్వాలని, నాలుగు గ్యాస్ సిలిండర్‌లు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. మరి ఎన్నిక మ్యానిఫెస్టో ఎలా ఉంటుందనే చర్చ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వీటికితోడు లోకేష్‌ పాదయాత్ర టైంలో ఇచ్చన హామీలు, స్థానికంగా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతో మ్యానిఫెస్టో సిద్ధం చేయాలి. ఎన్నికల తర్వాత మ్యానిఫెస్టో పట్టించుకోరన్న అపవాదును దాటుకొని ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఎలాంటి వ్యూహంతో వెళ్లాల్సి ఉంటుంది. 

వెంటాడుతున్న కేసులు
చంద్రబాబును ఎప్పుడూ లేనంతగా కేసుల వెంటాడుతున్నాయి. గతేడాది నుంచి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. సుమారు రెండు నెలల తర్వాత బెయిల్ వచ్చింది. మిగతా కేసుల్లో ఆయన మెడపై కత్తి వేలాడుతోంది. వచ్చే ఎన్నికల్లో రిజల్ట్స్‌ ఆధారంగా వీటి కదలిక ఉంటుంది. అందుకే ప్రజలను మెప్పించి అధికారం కైవశం చేసుకోవడం టీడీపీ ముందు ఉన్న లక్ష్యం. 

మీటింగ్‌లతో మరింత జోష్
ఈ వారం నుంచి ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు వాటిని విజయవంతం చేసుకోవడం కూడా ముందు ఉన్న టాస్క్. ఐదు నుంచి ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో సమావేశాలు పెట్టనున్నారు. అదే టైంలో లోకేష్ కూడా జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాలను టచ్ చేయబోతున్నారు. ఇటు చంద్రబాబు టూర్, మరోవైపు లోకేష్‌ పర్యటన. రెండింటినీ మేనేజ్ చేసుకొని ప్రజలను మెప్పిండానికి టీడీపీ సర్వశక్తులు పెట్టేస్తోంది. 

షర్మిలతో రాజకీయ ఫైట్ ఎలా 
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం వైఎస్‌ఆర్‌సీపీలో ఎంత టెన్షన్ పెడుతోందో తెలుగుదేశం పార్టీకి అంతే తలనొప్పిగా మారబోతోంది. ఒక వేళ షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్తే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేందుకు ఛాన్స్ ఉంటుంది. దీన్ని కట్టడి చేయడానికి ప్రతి వ్యూహం ఎలా రచిస్తారనేది ఆసక్తిగా మారుతోంది. 

బీజేపీతో వెళ్తారా?
ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో ఉంది. జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. దీనిపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ విషయంలో తెలుగుదేశం ఎలాంటి స్టెప్‌ తీసుకోనుందో అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఇది కూడా టీడీపీకి ఛాలెంజ్‌. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget