అన్వేషించండి

2108 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే పైచేయి, మరి ఈ సారి పరిస్థితేంటి?

Five States Assembly Elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాసేపట్లో నగారా మోగబోతోంది.

Five States Assembly Elections:

తెలంగాణ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మిజోరంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాసేపట్లో నగారా మోగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించనుంది. గత ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు వచ్చాయి. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. 

2018లో రాజస్థాన్ లో కాంగ్రెస్ జోరు

దేశంలోనే వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాజస్థాన్‌‌లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి అశోక్‌‌ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్‌‌ ప్రచారం చేస్తోంది. 2003 తర్వాత ఏ ప్రభుత్వాన్నీ వరుసగా గెలిపించని రాజస్థానీలు, ఈ సారి ఎవరికి పట్టం కడతారో అన్నది ఆసక్తికరంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 108 సీట్లు రావడంతో అశోక్ గెహ్లట్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజార్టీ 101 సీట్లు మాత్రమే. అయితే 108 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. ఆ తర్వాత 13 మంది స్వతంత్రులతో పాటు ఆర్ఎల్డీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ బలం 122కి పెరిగింది. బీజేపీకి 70, భారతీయ ట్రైబల్ పార్టీ 2, కమ్యూనిస్టు పార్టీకి రెండు సీట్లు చొప్పున వచ్చాయి. 

తొలిసారి హస్తం చేతికి అధికారం

 90 నియోజకవర్గాలున్న చత్తీస్ గఢ్ లో, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.  చత్తీస్ గఢ్ అంటేనే ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం. ఇక్కడ ఎస్టీల్లో మెజారిటి వర్గాలు హస్తం పార్టీకే మద్దతుగా నిలుస్తున్నారు. బస్తర్ జిల్లాలోని 12 సీట్లూ, ఇపుడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గినా మెజారిటి మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 68 సీట్లు వస్తే, బీజేపీ 15 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెజార్టీ 46 సీట్లు రావాల్సి ఉంటే హస్తం పార్టీకి ఏకంగా 68 వచ్చాయి. అధికార పార్టీలో చిన్న ఆధిపత్య గొడవలే తప్ప చెప్పుకోదగ్గ అవినీతి ఆరోపణలు లేకపోవటమే కాంగ్రెస్ పార్టీకి ప్లస్సవుతోంది. సుక్మా, రాయపూర్, జగదల్ పూర్, బిలాస్ పూర్, అంబికాపూర్, కోబ్రా, రాయగఢ్ ప్రాంతాల్లో మెజార్టీ వస్తుందన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించింది. రాష్ట్రంలో కుర్మీలు రెండో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్నారు. భూపేష్ భగేల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

2018లో మధ్యప్రదేశ్ లో హంగ్

2018లో  మధ్యప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించింది. 234 సీట్లుంటే 114 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అయితే మెజార్టీకి రెండు సీట్ల దూరంలో ఆగిపోయింది. భారతీయ జనతా పార్టీకి 109 వచ్చాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రెండు పార్టీలు దాదాపు 41% ఓట్లను సాధించాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా కేవలం 47,827 మాత్రమే. ఈ రెండు పార్టీలలో ఏ ఒక్కటీ 116 సీట్లతో మెజారిటీని సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. గత 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఓటర్లు ఆ పార్టీని ఆదరించలేకపోయారు. స్వతంత్రులతో కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టారు. అయితే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేకపోయారు. తర్వాత శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రి అయ్యారు. 

మిజోరాంలో కాంగ్రెస్ పరాభవం

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్  విజయం సాధించింది. ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఎంఎన్‌ఎఫ్‌కు 26 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎంఎన్ఎఫ్‌కు 65 శాతం ఓట్లు దక్కాయి. మిజోరంలో మొత్తం 40 శాసనసభ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 21. ఎంఎన్ఎఫ్ 26 స్థానాల్లో విజయం సాధించింది.  కాంగ్రెస్‌కు కేవలం 5 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు.

టాప్ హెడ్ లైన్స్

YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
Nara Lokesh Praises Pawan Kalyan : పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Embed widget