అన్వేషించండి

United Politics : వైఎస్ఆర్‌సీపీ సమైక్యాంధ్ర నినాదానికి బీఆర్ఎస్‌కు లింక్ ఉందా ? జరగుతున్న రాజకీయం దేనికి సంకేతం ?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం డైనమిక్‌గా మారిపోతోంది. ఒకేసారి ఏపీ అధికార పార్టీ సమైక్యాంధ్ర నినాదం తీసుకు రాగా తెలంగాణ అధికార పార్టీ.. జాతీయ వాద బావంతో తమ పార్టీ పేరు మార్చేసింది. ఇది దేనికి సంకేతం ?

United Politics :  విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మధ్య ..  కలుద్దాం..కలిసి ఉందాం అన్న స్లోగన్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. ఉన్నట్టుంది ఇప్పుడెందుకు మళ్లీ ఒక్కటవుదాము అన్న మాటలు ఏపీ అధికారపార్టీ నేతల నుంచి  వస్తున్నాయనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ. నిన్నటివరకు నీళ్లు, సరిహద్దు వివాదాలు ఇలా ఒకటేమిటి పలు విషయాలపై మాకు అన్యాయం జరుగుతోందంటే మాకు జరుగుతోందని రెండు తెలుగురాష్ట్రాల నేతలు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఒక్కటవుదాం..ఒక్కటిగా ఉందాం అన్న మాటలు ఏపీ పాలకుల నుంచి వినిపించడంతో రాజకీయ వాతావరణం మారిపోయింది. 

రెండు రాష్ట్రాలు కలిసిపోవాలన్నదే తమ విధానమంటున్న వైఎస్ఆర్‌సీపీ

ముందస్తు ఎన్నికలకు రెండు తెలుగు రాష్ట్రాలు కసరత్తులు చేసుకుంటున్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  తెలంగాణ, ఏపీల్లో ఎవరి రాజకీయాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. కేంద్రంతో తెలంగాణ ఫైట్‌ చేస్తుంటే ఏపీలో అధికార పార్టీ విపక్షాలతో ఢీ కొడుతోంది. ఇలా ఆయా రాష్ట్రాల అధికా రపార్టీల నేతలు ఎవరి హడావుడిలో వాళ్లు ఉంటే ఇప్పుడు సరికొత్తగా రెండు రాష్ట్రాలు కలిసిపోతే బాగుంటుందన్న వాదన తెరపైకి వచ్చింది. విభజన చట్టంలోని హామీల గురించి ప్రస్తావిస్తూ ఏపీ వైసీపీ నేతలు మరోసారి కలిసి ఉండాలన్న ఆకాంక్షను బయటపెట్టారు. మళ్లీ ఇంతకు ముందులాగా ఏపీ రాష్ట్రంగా రెండు తెలుగురాష్ట్రాలు ఉండాలన్నదే మా పార్టీ ఉద్దేశ్యమని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. 

వైఎస్ఆర్‌సీపీపై ఘాటుగా స్పందించిన తెలంగాణ విపక్ష పార్టీలు

ఇప్పుడిదే తెలంగాణలో అగ్గి రాజేసింది. వైసీపీ నేతల తీరుపై టీఆర్‌ ఎస్‌ తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ కూడా అహనం వ్యక్తం చేశాయి. తిట్టని తిట్టు తిట్టకుండా ఓ రేంజ్‌ లో ఆడేసుకున్నారు. తెలంగాణ నేతలు. మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం చేతకాక మా రాష్ట్రంపై పడి ఏడుస్తారా అని అధికార టీఆర్‌ ఎస్‌ విమర్శించింది. అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్‌ వన్‌ గా ఉన్న తెలంగాణని మళ్లీ సొంతం చేసుకోవాలన్న కుటిలబుద్ధితోనే వైసీపీ ఈ డ్రామాలాడుతోందని ఆరోపించింది. ఇక బీజేపీ అయితే ఇదంతా కుట్రలో భాగమనేనని తేల్చేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం నుంచి డైవర్ట్‌ చేసేందుకే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాటకాలాడుతున్నారని విమర్శించింది. అటు కాంగ్రెస్‌ కూడా వైసీపీ నేతల మాటలను తప్పుబట్టింది. ఆనాడు రాష్ట్రం విడిపోతే తెలంగాణకే నష్టమని చెప్పిన వాళ్లు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్లీ ఇలాంటి మాటలు మాట్లాడతారని ఎద్దేవా చేసింది.  సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విభజనచట్టం హామీపై వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న వాదనలు లేకపోలేదు. కేంద్రంతో విభజన హామీలపై తేల్చుకోకుండా ఇలాంటి అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు. ఇక విడిపోయినవాళ్లు కలిసే ప్రసక్తే లేదని పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఎలా వదలుకుంటామని తెలంగాణ ప్రజాసంఘాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. ఈ వి’భజన’మాటలు ఆపకపోతే వైసీపీకే నష్టమన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. 

ఆ మాటల వెనుక మర్మేమేమిటీ? 

తెలుగురాష్ట్రాలు కలవాలన్న ఆలోచన వైసీపీదా? లేదా టీఆర్ఎస్ దా? లేక కేసిఆర్ - వైసీపీ నేతలతో అలా పలికిస్తారా? ఉండవల్లి అరుణ్ కుమార్ తెరమీదకు తెచ్చిన ఈ అంశం వెనుక భారీ స్కెచ్ ఉందనే టాక్ నడుస్తోంది. అటెక్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు పడిన రాజకీయనాయకులు తెలుగు రాష్ట్రాల మద్య సున్నితమైన అంశాలను అప్పుడప్పుడు మాట్లాడి ప్రజల అటెక్షన్ ను డైవర్షన్ చేస్తున్నారనే వాదనలు, సంఘటనలు లేకపోలేదు. ఉండవల్లి, సజ్జల కామెంట్స్ పై తెలంగాణలో అన్నీ పార్టీలు స్పందించాయి కానీ బీఆర్ఎస్ మాత్రం స్పందించలేదు ఎందుకో? అసలే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారిన హడావుడిలో ఆ పార్టీ ఉంటే ఇప్పుడే ఎందుకు ఈ విభజన అంశం గురించి ఎందుకు అనుకున్నదో? ఏమో? మొత్తానికి సైలెంట్ అయిపోయింది ఆ పార్టీ. 

షర్మిల ఘాటు స్పందన మరింత ఆశ్చర్యకరం

తెలంగాణ వైఎస్ ఆర్ పార్టీ అధ్యక్ష్యురాలు వై.ఎస్. షర్మిల మాత్రం ఉండవల్లి, సజ్జల కామెంట్స్ పై ఘాటుగానే స్పందించారు. ఎప్పుడూ ఏపీ ప్రభుత్వాన్ని కానీ, వైసీపీని కానీ డైరక్ట్ గా విమర్శించిన ధాఖలాలు లేవు. మొదటిసారి షర్మిల ఈ అంశంపై మాట్లాడి, వైసీపీ పార్టీని విమర్శించడం కొసమెరుపు. ఈ సమైక్యవాద రాజకీయం ఎటు వైపు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Embed widget