అన్వేషించండి

YSR Law Nestham: జూనియర్ లాయర్లకు గుడ్ న్యూస్ - బటన్ నొక్కి లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్

YSR Law Nestham: యువ న్యాయవాదులకు 2023–24 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 2,677 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 6,12,65,000 ను విడుదల చేశారు.

YSR Law Nestham: యువ న్యాయవాదులకు తొలి మూడు సంవత్సరాలు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ లా నేస్తం నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. 2023–24 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,677 మంది జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5000 స్టైఫండ్‌ చొప్పున.. ఫిబ్రవరి 2023 – జూన్‌ 2023 (5నెలలు)కు ఒక్కొక్కరికి రూ.25,000 పంపిణీ చేశారు. ఇలా మొత్తం రూ. 6,12,65,000 ను క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి మరీ రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నడుస్తోందని... ఈ ఏడాదికి సంబంధించి మొదటి విడతలో 2,677 మంది అడ్వకేట్‌లకు రూ.6,12,65,000 వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. న్యాయవాదులు లా కోర్సు పూర్తి చేసిన మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అన్నారు. అప్పుడే చదువులు పూర్తి అయి, కోర్టుల్లో అడుగు పెడుతున్న పరిస్థితుల్లో వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు సాయం చేస్తున్నట్లు వివరించారు. జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలుస్తూ.. ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60 వేలు ఇస్తున్నామన్నారు. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80లక్షలు ఇచ్చామని చెప్పారు. దీనివల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారని అన్నారు. ఈ సాయం వల్ల జూనియర్ న్యాయవాదులు ఇబ్బంది పడకుండా జీవితంలో ముందుకు వెళ్తారన్న మంచి ఆలోచనతోనే ఈ పథకం ప్రారంభించామని చెప్పుకొచ్చారు. 

4 ఏళ్లలో 5,781 మందికి రూ.41.52 కోట్లు సాయం..

ఇప్పటి వరకు 5,781 మంది జూనియర్‌ న్యాయవాదులకి మేలు చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2019 నవంబరులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నాలుగేళ్లలో ప్రతి నెలా రూ.5వేల చొప్పున ఇస్తూ.. ఇంత వరకు మొత్తంగా రూ. 41.52 కోట్లు జూనియర్‌ లాయర్లకు ఇచ్చామన్నారు.

రూ.100 కోట్లతో వెల్ఫేర్ ట్రస్టు...

ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ నాయకుడూ చేయలేదన్నారు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇదొక్కటే కాకుండా అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్‌ ట్రస్టును ఏర్పాటు చేశామని తెలిపారు. మెడిక్లెయిమ్ కాని న్యాయవాదుల అవసరాలకు రుణాలు వంటి వాటికి, ఈ నిధుల నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగిందన్నారు. ఈ రెండు కార్యక్రమాల ద్వారా నాలుగేళ్ల కాలంలో అడ్వకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తోడుగా ఉందనే సంకేతం వెళ్లిందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి డిసెంబరు నాటికి ఆరు నెలలు అవుతుందని.. 6 నెలలకు ఒకేసారి మొత్తంగా రూ.30వేలు వస్తే.. ఇంగా బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో క్రితం సారి మార్పు చేశామని పేర్కొన్నారు. మరలా డిసెంబరులో ఈ ఏడాదికి సంబంధించిన రెండో దఫా కార్యక్రమం జరుగుతుందన్నారు. వీటన్నింటివల్లా న్యాయవాదులకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని సీఎం జగన్ వివరించారు. 

పేదల పట్ల మమకారం చూపండి..!

ఇంత మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని.. ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటేనని తెలిపారు. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరికీ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం వీళ్లు పేదలపట్ల చూపిస్తారని ఒక విశ్వాసం ఉందన్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గర నుంచి తాను ఆశిస్తుంది ఇదేనని వివరించారు. దేవుడి దయ వల్ల మంచి జరుగుతుందన్నారు. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేటట్టుగా జూనియర్ లాయర్లు చేయాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget