అన్వేషించండి

Jagan review : ఇంత చేస్తున్నా ప్రజల నుంచి ఫిర్యాదులా..? ఇక వారికి నోటీసులే...

ప్రభుత్వ పధకాల విషయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తూండటంతో జగన్ అసంతృప్తికి గురయ్యారు, గ్రామ, వార్డు సచివాలాయాల సేవలను నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు.


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అసంతప్తిగా ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి. పని చేయని వారందరికీ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉద్యోగులకు మెమోలు జారీ చేయడం బాధాకరం అయినా ప్రజలకు సరైన సేవలు అందించకపోతే ఉపేక్షించలేమన్నారు. ఈ వ్యవస్థలను పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్లు కూడా.. వారి పనితీరుకు బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల విషయంలో ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నట్లుగా గుర్తించడంతో.. సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు .. ఇంటి వద్దకే సేవలు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసినా ఇంత పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం ఏమిటని ఆయన భావన.  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సరిగ్గా పని చేయకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందని ఆయన నమ్మకానికి వచ్చారు. వాటిపై పర్యవేక్షణ కూడా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే అధికారులు ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలాయలను తనిఖీ చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ మెరుగుపడాలంటే ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తుండాలని .... వారానికి రెండు సార్లు కలెక్టర్లు, నాలుగుసార్లు జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, తనిఖీ చేయాలన్నారు. 

 సబ్‌ కలెక్టర్లు కూడా వారానికి నాలుగుసార్లు సచివాలయాలను సందర్శించి వాటి పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు.  తనిఖీలు చేయని అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలని ...అటు జేసీలకు కూడా మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. త్వరలో  జిల్లాల పర్యటనలు ప్రారంభించబోతున్న సీఎం జగన్.. తాను కూడా..  గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు.  గ్రామ, వార్డు సచివాలాయాల్లోని ఉద్యోగులు ప్రస్తుతం పరీక్షల టెన్షన్‌లో ఉన్నారు. పరీక్షల్లో పాసయిన వారినే పర్మినెంట్ చేస్తామని...  చెబుతున్నారు. ఇప్పుడు.. వారి పనితీరుపైనా ప్రధానంగా ఉన్నతాధికారులంతా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తూండటంతో వారికి మరింత పని ఒత్తిడి పెరగనుంది. 

ప్రభుత్వ పథకాల విషయంలో కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని జగన్ ఆదేశించారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఆగష్టు 10వ తేదీన నేతన్న నేస్తం, ఆగష్టు 16న విద్యాకానుక, రూ. 20 వేలలోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగష్టు 24న డబ్బు జమ, ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఆగష్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తారు. కలెక్టర్లు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

ALSO READ: ఎన్టీఆర్ VS రాజమౌళి.. నువ్వా నేనా 'సై'!

 

టాప్ హెడ్ లైన్స్

Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget