Pakistan Bans Holi: పాకిస్థాన్లో హోళి వేడుకలపై నిషేధం, హిందూ విద్యార్థులకు వార్నింగ్
Pakistan Bans Holi: పాకిస్థాన్లోని అన్ని యూనివర్సిటీల్లో హోళి వేడుకలపై బ్యాన్ విధించారు.

Pakistan Bans Holi:
ఉన్నత విద్యా కమిషన్ నిర్ణయం..
పాకిస్థాన్ ఉన్నత విద్యా కమిషన్ (HEC) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో హోళి వేడుకలు చేసుకోడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మధ్యే జూన్ 12వ తేదీన Quaid-i-Azam యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున హోళి వేడుకలు చేసుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన విద్యా కమిషన్...ఇంకెప్పుడూ ఈ పండుగ జరపడానికి అవకాశం లేకుండా బ్యాన్ విధించింది. దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని స్పష్టం చేసింది.
"విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, మతాచారాలు ఉండడం సమాజానికి అవసరమే. కానీ...అవి హద్దులు మించకుండా ఉంటేనే మంచిది. విద్యార్థులెవరైనా సరే కచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సొంత అభిప్రాయాలను, ఇష్టాలని కావాలని రుద్దడం మానేయాలి. అందరి అభిప్రాయాలనూ గౌరవించాలి. ఈ ఈవెంట్ కారణంగా దేశానికే మచ్చ వచ్చేలా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశ గౌరవాలకు, సామాజిక విలువలకు భంగం వాటిల్లే పనులు విద్యార్థులు చేయకూడదు."
- యూనివర్సిటీ నోటీస్
Holi celebrations in Quaid-I-Azam University Islamabad Pakistan 🍁
— QAU News (@NewsQau) June 13, 2023
Biggest holi celebration in Pakistan 💓 pic.twitter.com/xdBXwYEglt
వీడియోలు వైరల్..
ఇస్లామాబాద్లోని క్వాయిద్ ఇ అజామ్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున హోళీ వేడుకలు జరుపుకున్నారు. క్యాంపస్లోనే రంగులు జల్లుకుంటూ నానా హంగామా సృష్టించారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. మెహరన్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఈ వేడుకలు నిర్వహించింది. అయితే...ఓ ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు వీటిని అడ్డుకున్నారు. అంతకు ముందు పంజాబ్ యూనివర్సిటీలోనూ ఇలానే వేడుకలు చేసుకోగా...ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరిపై దాడి చేశారు. ఈ గొడవల్లో దాదాపు 15 మంది హిందూ విద్యార్థులు గాయపడ్డారు. ఇవి మరీ ముదరక ముందే మేల్కోవడం మంచిదని భావించిన హైయర్ కమిషన్..హోళి వేడుకలపై నిషేధం విధించింది.
Holi celebrations Quaid-i-Azam University Islamabad 🖤 🥀#QAU_ISLAMABAD #holi #holi2023 pic.twitter.com/CHVkY5NL1m
— QAU News (@NewsQau) June 19, 2023
పాక్ రచయిత పాఠం తొలగింపు..
ఇటీవలే NCERT సిలబస్ నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనిపై భిన్న వాదనలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విమర్శలూ ఎదురయ్యాయి. ఇదే క్రమంలో అకాడమిక్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ (Academic Council of Delhi University) సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్కు చెందిన రచయిత మహమ్మద్ ఇక్బాల్పై (Muhammad Allama Iqbal) ఉన్న లెసన్ని సిలబస్లో నుంచి తీసేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఓ సర్య్కులర్ కూడా జారీ చేసింది. పొలిటికల్ సైన్స్ సిలబస్లో నుంచి ఈ పాఠాన్ని తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది. 1877లో సియాల్కోట్లో జన్మించారు మహమ్మద్ ఇక్బాల్. "సారే జహాసే అచ్ఛా" గీతాన్ని రచించింది ఈయనే. పాకిస్థాన్కి ఆద్యుడిగానూ ఆయనను పిలుచుకుంటారు. బీఏ ఆరో సెమిస్టర్ పేపర్లో Modern Indian Political Thought పేరుతో ఉన్న ఛాప్టర్లో ఇక్బాల్ గురించి ప్రస్తావన ఉంది. అయితే...ఈ లెసన్ ప్రస్తుతానికి అవసరం లేదని అకాడమిక్ కౌన్సిల్ భావిస్తోంది. తొలగిస్తున్నట్టు ప్రకటిస్తూనే...ఈ ప్రతిపాదనను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందుంచింది. ఈ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఆ పాఠం ఉంటుందా లేదా అన్న క్లారిటీ వచ్చేస్తుంది.
Also Read: Twitter Bonus: బోనస్ ఎగ్గొట్టిన మస్క్, కోర్టుకెక్కిన ఉద్యోగులు - ట్విటర్పై పిటిషన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

