అన్వేషించండి

Nawaz Sharif: భారత్‌ చంద్రుడ్ని తాకింది, పాకిస్థాన్ అడుక్కుతింటోంది - నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

నవాజ్ షరీఫ్ అక్టోబర్ 21న పాకిస్థాన్‌కు వస్తారని ఆయన సోదరుడు ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా ఆయనకు స్వాగతం పలికేందుకు పాకిస్తాన్‌లో సన్నాహాలు కూడా చేస్తున్నారు.

భారత్ ఓ వైపు చంద్రుడిని చేరుకుంటే, మరోవైపు పాకిస్తాన్ ప్రపంచం ముందు అడుక్కుతింటోందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. భారత్ G20 సమ్మిట్‌ని నిర్వహించిందని, ప్రస్తుతం భారత్‌లో 600 బిలియన్ డాలర్ల ట్రెజరీ ఉందని అన్నారు. అదే సమయంలో పాకిస్తాన్.. చైనా, అరబ్ దేశాలు సహా ప్రపంచం నలుమూలల నుంచి 1-1 బిలియన్ డాలర్లను యాచిస్తోందని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో వారి ముందు మనం ఏం తలెత్తుకోగలమని అన్నట్లుగా పాకిస్తాన్ మీడియా కథనాలు రాసింది.

నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌కు ఈ స్థితికి రావడానికి కారణమైన వారు దేశంలోని అతిపెద్ద నేరస్థులు. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (పిడిఎం) ప్రభుత్వం దేశాన్ని డిఫాల్ట్ నుంచి రక్షించింది. లేదంటే దేశంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.వెయ్యికి చేరుకునేది. దేశం ప్రస్తుత ఈ పరిస్థితికి రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ మాజీ చీఫ్ ఫైజ్ హమీద్, మాజీ చీఫ్ జస్టిస్ మియాన్ సాకిబ్ నిసార్ బాధ్యులు’’ అని నవాజ్ షరీఫ్ ఆరోపించారు.

పాకిస్తాన్‌లో ఆహారం కోసం ఆగచాట్లు పడుతున్న పేదలు
నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ ‘‘నేడు దేశంలో పేదలు ఆహారం కోసం వెంపర్లాడుతున్నారు. దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? 2017లో పాకిస్థాన్‌లో ఇది కనిపించలేదు. అప్పట్లో పిండి, నెయ్యి, పంచదార అన్నీ చౌకగా దొరికేవి. కరెంటు బిల్లులు ప్రజల స్తోమతకు తగ్గట్టుగానే వచ్చేవి. నేడు ప్రజలకు రూ.30 వేల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను పోషించేందుకు కూడా డబ్బులు మిగలడం లేదు. నా పాలనలో దేశం పురోగమించింది. అయినప్పటికీ, నాకు కోర్టులో 27 సంవత్సరాల శిక్ష వేసింది. నాపై అనర్హత వేటు వేసింది. కొన్నాళ్లు దేశం బయట ఉండాల్సి వచ్చింది. వీటన్నింటి వెనుక జనరల్ బజ్వా, జనరల్ ఫైజ్ ఉన్నారు’’ అని ఆవేదన చెందారు.

‘‘1990లో భారతదేశం మనల్ని చూసి ఆర్థిక సంస్కరణ ఉత్తర్వును అమలు చేసింది. ఈ రోజు వారి దేశం ఎక్కడికి చేరుకుందో చూడండి. వాజ్‌పేయి ప్రధానమంత్రి అయినప్పుడు, భారత్ వద్ద 1 బిలియన్ డాలర్లు కూడా లేవు. నేడు అది 600 బిలియన్ డాలర్లకు చేరింది’’ అని అన్నారు.

పాకిస్తాన్ నేడు యాచించే దేశంగా మారింది - పీఎంఎల్
ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లో పీఎంఎల్-ఎన్ పార్టీ ఉపాధ్యక్షుడు హమ్జా షాబాజ్ మాట్లాడుతూ.. నవాజ్ పాకిస్థాన్‌ను అణుశక్తి దేశంగా మార్చారని, కానీ నేడు మనం బిచ్చగాళ్ల దేశంగా మారామని అన్నారు. ‘‘ఇది చాలా సిగ్గుచేటు. ఇప్పుడు నవాజ్ షరీఫ్‌ను ప్రధాని చేయడం ద్వారా పాకిస్తాన్ ప్రజలు దేశ భవిష్యత్తును సురక్షితం చేయవచ్చు’’ అని అన్నారు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. తన సోదరుడు నవాజ్ అక్టోబర్ 21న తిరిగి పాకిస్థాన్‌కు వస్తారని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా ఆయనకు స్వాగతం పలికేందుకు పాకిస్తాన్‌లో కూడా సన్నాహాలు కూడా చేస్తున్నారు. లండన్‌లో జరిగిన పీఎంఎల్‌-ఎన్‌ అగ్ర నాయకత్వ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

జీవితకాల అనర్హత చట్టాన్ని పార్లమెంటు మార్చింది
మూడు నెలల క్రితం, పాకిస్తాన్‌లోని షాబాజ్ ప్రభుత్వం పార్లమెంటులో ‘జీవితకాల అనర్హ’ను రద్దు చేసింది. కొత్త చట్టం ప్రకారం, ఇప్పుడు ఏ ఎంపీ కూడా 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అనర్హులుగా ఉండలేరు. ఈ నిర్ణయంతో నవాజ్ షరీఫ్‌కి నేరుగా లబ్ధి పొందినట్లు అయింది.

నవాజ్ పై అనర్హత వేటు ఎందుకు పడింది?
పనామా పేపర్స్ కేసులో పాకిస్తాన్ సుప్రీంకోర్టు 2017లో నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరకుండా నిషేధం విధించింది. 2019లో లాహోర్ హైకోర్టు నవాజ్ చికిత్స కోసం నాలుగు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది. నవాజ్ నవంబర్ 19, 2019న లండన్‌కు వెళ్లారు. అప్పటి నుండి తిరిగి పాకిస్తాన్‌కు తిరిగి రాలేదు.

నవాజ్‌కు ఏడేళ్ల శిక్ష 
2018లో అల్-అజీజియా స్టీల్‌ మిల్స్‌ అవినీతి కేసులో నవాజ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అవాన్‌ఫీల్డ్ ప్రాపర్టీ కేసులో అతనికి 11 ఏళ్ల శిక్ష, రూ.80 కోట్ల జరిమానా విధించింది. 16 నవంబర్ 2019న లాహోర్ హైకోర్టు నవాజ్ శిక్షను సస్పెండ్ చేసింది. చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది. నవాజ్ షరీఫ్ ఇప్పటి వరకు మూడుసార్లు పాకిస్తాన్ ప్రధానిగా పని చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget