అన్వేషించండి

Kerala nurse Nimisha Priya: కేరళ నర్సుకు స్వల్ప ఊరట.. నిమిషా ప్రియా ఉరిశిక్ష వాయిదా వేసిన యెమెన్ ప్రభుత్వం

Kerala Nurse News | కేరళ నర్సు నిమిషా ప్రియా మరణశిక్ష అమలు తాత్కాలికంగా వాయిదా పడింది. భారత్ ప్రయత్నాలతో ఆమె ఉరిశిక్షను యెమెన్ అధికారులు నిలిపివేశారు.

Nimisha Priya execution postponed | కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. భారత్ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష అమలును యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఒక నివేదిక ప్రకారం, నిమిషాకు షెడ్యూల్ ప్రకారం విధించనున్న ఉరిశిక్షను ప్రస్తుతం వాయిదా వేశారు.

జూలై 16న యెమెన్ అధికారులు నిమిషా ప్రియకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ కేసు విషయంలో భారత ప్రభుత్వం రంగంలోకి దిగి కేరళ నర్సు ప్రాణాలు కాపాడేందుకు చర్చలు జరుపుతోంది. దాంతో ప్రాథమికంగా నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా వేస్తూ యెమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె 2017 నుండి యెమెన్ జైలులో ఉన్నారని తెలిసిందే. యెమెన్ కోర్టు నర్సు నిమిషా ప్రియను హత్య కేసులో దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

బెడిసికొట్టిన అనస్థీషియా ఇంజెక్షన్

తమ దేశానికి చెందిన పౌరుడు తలాల్ అబ్దో మహదీని హత్య చేసినట్లు నిమిషా ప్రియపై యెమెన్ లో ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ పూర్తయి చివరకు ఆమె దోషిగా తేలింది. తన పాస్‌పోర్ట్‌ను తన వద్ద నుంచి తిరిగి తీసుకోవడానికి అబ్దో మహదీకి అనస్థీషియా ఇంజెక్ట్ చేసింది.అయితే అధిక మోతాదులో మందు డోసేజ్ ఇవ్వడం వల్ల అతను మరణించాడని ఆరోపణలున్నాయి. అనస్థీషియా ఇచ్చింది నర్సు నిమిషా ప్రియ కావడంతో ఈ కేసులో ఆమెకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, నిమిషా ఉరిశిక్షను అక్కడి ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది.

నిమిషా ప్రియను ఏ చట్టం కింద శిక్షించారు?

యెమెన్‌లో షరియా చట్టం అమలు చేస్తున్నారు. కాబట్టి, ఈ చట్టం కింద నిమిషా ప్రియకు మరణశిక్ష విధించారు ఈ చట్టంలో క్షమాపణకు కూడా ఒక నిబంధన ఉంది. బ్లడ్ మనీ అనే విధానం ద్వారా అది సాధ్యం. దీని ద్వారా హత్యకు పాల్పడిన నిందితులకు క్షమాబిక్ష ప్రసాదిస్తారు. కానీ దీని కోసం అతను మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారంగా భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అక్కడి షరియా చట్టం ప్రకారం నిమిషా ప్రియ కూడా ఉరిశిక్ష తప్పించుకుని జైలు నుంచి విడుదల చేయవచ్చు. కానీ దీని గురించి భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తన భర్త, కుమార్తె భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత నిమిషా ప్రియ యెమెన్‌లో చిక్కుకుంది. ఆమె కేరళలోని పాలక్కాడ్ కు చెందిన మహిళ. నిమిషా ప్రియ దాదాపు 2 దశాబ్దాల కిందట తన భర్త, కూతురితో కలిసి యెమెన్‌కు వెళ్లింది. ఆమె ఇక్కడే పనిచేస్తోంది. యెమెన్‌లో అంతర్యుద్ధం వల్ల 2016లో దేశం విడిచి వెళ్లడంపై నిషేధం విధించారు. అంతకు ముందుగానే ఆమె భర్త, కుమార్తె 2014లోనే భారత్ కు తిరిగొచ్చారు. నిమిషా ప్రియా తిరిగి రాలేక యెమెన్‌లోనే చిక్కుకుపోయింది. ఈ క్రమంలో ఆమెపై 2017లో హత్య ఆరోపణలు వచ్చాయి. చివరికి దోషిగా తేలడంతో కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget