By: ABP Desam | Updated at : 14 Apr 2022 11:50 AM (IST)
హోవార్డ్ యూనివర్సిటీలో సంయుక్త ప్రెస్ మీట్
భారతదేశంలో ‘మానవ హక్కుల ఉల్లంఘనల పెరుగుతున్నా’యని US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ చేసిన ఇటీవలి వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో మానవహక్కుల పరిస్థితిపై తమకు అభిప్రాయాలు ఉన్నాయని, చర్చ జరిగినప్పుడు వాటి గురించి మాట్లాడేందుకు వెనకాడబోమని తేల్చిచెప్పారు.
దేశ విధానాల గురించి ప్రజలు అభిప్రాయాలు కలిగి ఉండేందుకు ప్రజలు అర్హులని అన్నారు. అదే సమయంలో ప్రజల ఆసక్తుల గురించి కేంద్రానికి కూడా వివిధ అభిప్రాయాలు ఉండొచ్చని అన్నారు. అంతేకాక, న్యూయార్క్లో సిక్కు యువకులపై జరిగిన దాడి అంశంపైకూడా విదేశాంగ మంత్రి తొలిసారి స్పందించారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తోపాటు భారత్-అమెరికా 2+2 మంత్రుల చర్చల్లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్లో మంత్రుల సమావేశం తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఇటీవలి ఆందోళనకర పరిణామాలను అమెరికా పరిశీలిస్తోందని అన్నారు. అందులో ఆయన ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంటూ ప్రస్తావించారు. జైలులో, పోలీసు అధికారులు మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే, ఈ భేటీలో మానవ హక్కుల అంశం చర్చకు రాలేదని, గతంలోనే చర్చ జరిగిందని జైశంకర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ అంశం ఇంతకు ముందు చర్చకు వచ్చింది. విదేశాంగ మంత్రి బ్లింకెన్ భారత్కు వచ్చినప్పుడు ఇది తెరపైకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ మీకు గుర్తుంటే, ఈ విషయం గురించి నేను చాలా సార్లు చెప్పాను.’’ అని అన్నారు.
ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి రెండు దేశాల మధ్య విద్యా సంబంధాలను మరింతగా పెంచుకొనే ప్రాముఖ్యతను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఉద్ఘాటించారు. మంగళవారం వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో జరిగిన అమెరికా - ఇండియా ఉన్నత విద్యా సంభాషణలో భాగంగా జైశంకర్ బ్లింకెన్ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. తన ప్రసంగంలో బ్లింకెన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారతదేశం ఒకదాన్నుంచి మరొకటి నేర్చుకోవలసినవి ఎప్పుడూ ఉంటాయి. ఈ చర్చలు ముఖ్యంగా విద్యా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాయి. కొత్త ఇండో-యుఎస్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని ఇరు దేశాలు వ్యక్తం చేశాయి.
Pleased to participate in this conversation with my friend @SecBlinken.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 13, 2022
The Working Group on Education and Skill Development will further enhance opportunities for #IndiaUS cooperation. https://t.co/hVCXIurOMw
Miss World 2023: మిస్ వరల్డ్ 2023 పోటీలు భారత్లోనే, 3 దశాబ్దాల తరవాత సర్ప్రైజ్
Donald Trump charged: ట్రంప్ని వదలని బ్యాడ్టైమ్, మరో కేసులో ఇరుక్కున్న మాజీ అధ్యక్షుడు
Top 10 Headlines Today: మెగాస్టార్ ఇంట గ్రాండ్ ఎంగేజ్మెంట్, సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ విచారణ, తెలంగాణలో బీసీలకు లక్ష
Top 10 Headlines Today: కేసీఆర్ వ్యూహం ఏంటీ? అవినాష్ అరెస్టు విడుదల!, రహానే-భరత్పైనే భారం, ఇవే మార్నింగ్ చూడాల్సిన వార్తలు
France stabbing: ప్రీస్కూల్లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు
Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్పై మంగళవారం విచారణ
టీడీపీకి మరో సన్స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు
Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్