అన్వేషించండి

EVM లను మేనేజ్ చేయకపోతే బీజేపీకి 180 సీట్లు కూడా రావు - రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Lok Sabha Elections 2024: ఈవీఎమ్‌లను మేనేజ్ చేయకపోతే బీజేపీ గెలవలేదని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Lok Sabha Polls 2024: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ని నిరసిస్తూ I.N.D.I.A కూటమి ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi on EVMs) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఈలోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుస్తామని చెబుతోందని, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ లాటిందేనని విమర్శించారు. EVMలను మేనేజ్ చేయకపోతే బీజేపీ గెలవలేదని తేల్చి చెప్పారు. ఈసారి ఆ పార్టీకి 180 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లతో ఈ లోక్‌సభ ఎన్నికల్ని పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఐపీఎల్ మ్యాచ్‌లలో అంపైర్‌లపై ఒత్తిడి పెంచడం, ఆటగాళ్లను కొనేయడం, గెలవకపోతే కుదరదంటూ కేప్టెన్‌లని బెదిరించడం లాంటివి జరుగుతుంటాయని ఆరోపించారు రాహుల్. లోక్‌సభ ఎన్నికలు కూడా ఐపీఎల్ మ్యాచ్‌ లాంటిదేనని, ప్రధాని మోదీ అంపైర్స్‌ని ఎంపిక చేసి అందరిపైనా ఒత్తిడి తెస్తున్నారంటూ పరోక్షంగా దర్యాప్తు సంస్థలపై సెటైర్లు వేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల వివాదాన్ని ప్రస్తావించారు. అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేయడమేంటని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారని, దేశాన్ని మంటల్లో నెట్టేస్తారని మండి పడ్డారు రాహుల్ గాంధీ. 

"ఈవీఎమ్‌లు లేకపోతే, మ్యాచ్ ఫిక్సింగ్ జరగకపోతే, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోకపోతే, మీడియాపై ఒత్తిడి చేయకపోతే బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలుచుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లలో కేప్టెన్‌లను బెదిరించి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు ప్రధాని మోదీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అంపైర్‌లను ఆయనే ఎంపిక చేసి ప్లేయర్స్‌ని అరెస్ట్ చేయిస్తున్నారు. దేశంలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్‌లను ఫ్రీజ్ చేయించారు. మేం ప్రచారం చేయాలన్నా చిల్లిగవ్వ లేకుండా పోయింది"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 

బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారని, దేశాన్ని మంటల్లో నెట్టేస్తారని మండి పడ్డారు రాహుల్ గాంధీ. ఈ సారి ఎన్నికలు అత్యంత కీలకమైనవని, దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో మార్పులు రావడంతో పాటు దేశమూ ధ్వంసమైపోతుందని తేల్చి చెప్పారు.

"ఈ ఎన్నికలు చాలా కీలమైనవి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయమిది. ఓటర్లు ఆలోచించకుండా ఓటు వేస్తే వాళ్ల మ్యాచ్ ఫిక్సింగ్ సక్సెస్ అవుతుంది. అదే జరిగితే వాళ్లు రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు. ప్రజలకు గొంతుకనిచ్చే రాజ్యాంగాన్ని మార్చేసి దేశాన్ని ధ్వంసం చేస్తారు"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget