అన్వేషించండి

EVM లను మేనేజ్ చేయకపోతే బీజేపీకి 180 సీట్లు కూడా రావు - రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Lok Sabha Elections 2024: ఈవీఎమ్‌లను మేనేజ్ చేయకపోతే బీజేపీ గెలవలేదని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Lok Sabha Polls 2024: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ని నిరసిస్తూ I.N.D.I.A కూటమి ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi on EVMs) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఈలోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుస్తామని చెబుతోందని, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ లాటిందేనని విమర్శించారు. EVMలను మేనేజ్ చేయకపోతే బీజేపీ గెలవలేదని తేల్చి చెప్పారు. ఈసారి ఆ పార్టీకి 180 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లతో ఈ లోక్‌సభ ఎన్నికల్ని పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఐపీఎల్ మ్యాచ్‌లలో అంపైర్‌లపై ఒత్తిడి పెంచడం, ఆటగాళ్లను కొనేయడం, గెలవకపోతే కుదరదంటూ కేప్టెన్‌లని బెదిరించడం లాంటివి జరుగుతుంటాయని ఆరోపించారు రాహుల్. లోక్‌సభ ఎన్నికలు కూడా ఐపీఎల్ మ్యాచ్‌ లాంటిదేనని, ప్రధాని మోదీ అంపైర్స్‌ని ఎంపిక చేసి అందరిపైనా ఒత్తిడి తెస్తున్నారంటూ పరోక్షంగా దర్యాప్తు సంస్థలపై సెటైర్లు వేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల వివాదాన్ని ప్రస్తావించారు. అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేయడమేంటని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారని, దేశాన్ని మంటల్లో నెట్టేస్తారని మండి పడ్డారు రాహుల్ గాంధీ. 

"ఈవీఎమ్‌లు లేకపోతే, మ్యాచ్ ఫిక్సింగ్ జరగకపోతే, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోకపోతే, మీడియాపై ఒత్తిడి చేయకపోతే బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలుచుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లలో కేప్టెన్‌లను బెదిరించి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు ప్రధాని మోదీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అంపైర్‌లను ఆయనే ఎంపిక చేసి ప్లేయర్స్‌ని అరెస్ట్ చేయిస్తున్నారు. దేశంలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్‌లను ఫ్రీజ్ చేయించారు. మేం ప్రచారం చేయాలన్నా చిల్లిగవ్వ లేకుండా పోయింది"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 

బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారని, దేశాన్ని మంటల్లో నెట్టేస్తారని మండి పడ్డారు రాహుల్ గాంధీ. ఈ సారి ఎన్నికలు అత్యంత కీలకమైనవని, దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో మార్పులు రావడంతో పాటు దేశమూ ధ్వంసమైపోతుందని తేల్చి చెప్పారు.

"ఈ ఎన్నికలు చాలా కీలమైనవి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయమిది. ఓటర్లు ఆలోచించకుండా ఓటు వేస్తే వాళ్ల మ్యాచ్ ఫిక్సింగ్ సక్సెస్ అవుతుంది. అదే జరిగితే వాళ్లు రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు. ప్రజలకు గొంతుకనిచ్చే రాజ్యాంగాన్ని మార్చేసి దేశాన్ని ధ్వంసం చేస్తారు"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup - IND W Batting Order Change:  భార‌త‌ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయాల్సిందేనా..! సెమీస్ చేరాలంటే కొన్ని మార్పులు త‌ప్ప‌నిస‌రి!
భార‌త‌ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయాల్సిందేనా..! సెమీస్ చేరాలంటే కొన్ని మార్పులు త‌ప్ప‌నిస‌రి!
Abishek Porel Crime Update: ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. పెళ్లి పేరుతో మోసం, దాడి ఆరోపణలతో పోలీస్ స్టేషన్ ఎక్కిన యువతి
ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. పెళ్లి పేరుతో మోసం, దాడి ఆరోపణలతో పోలీస్ స్టేషన్ ఎక్కిన యువతి
Pune Murder News:‘హుడీ’ ఓపెన్ చేస్తే కాబోయే భార్య దురాగతం వెలుగులోకి, క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న పూణే మర్డర్ మిస్టరీ!
‘హుడీ’ ఓపెన్ చేస్తే కాబోయే భార్య దురాగతం వెలుగులోకి, క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న పూణే మర్డర్ మిస్టరీ!
Breaking News: ఆంధ్రప్రదేశ్‌లో ఓపీఎస్‌ అమలుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్‌- ట్విస్ట్ ఇచ్చిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో ఓపీఎస్‌ అమలుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్‌- ట్విస్ట్ ఇచ్చిన ప్రభుత్వం

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ACB Raids: మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
TMC Leader Humiliated: సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు
సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు
Vijay Trisha Breakup: విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
Ather 450X vs Honda Activa e:ఈవీ మార్కెట్‌లో అసలైన బాస్‌ ఫైట్‌! ఏథర్‌ 450X vs హోండా యాక్టివా ఇ! మీకు ఎవరు బెస్ట్?
ఈవీ మార్కెట్‌లో అసలైన బాస్‌ ఫైట్‌! ఏథర్‌ 450X vs హోండా యాక్టివా ఇ! మీకు ఎవరు బెస్ట్?
Vaddera Quarry Reservation: ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
Sreemukhi Saree Photos: శ్రీముఖి కట్టిన చీరలు ఎన్ని... 'మా ఇంటి బంగారం' లుక్ టెస్ట్ నుంచి షూటింగ్ వరకు!
శ్రీముఖి కట్టిన చీరలు ఎన్ని... 'మా ఇంటి బంగారం' లుక్ టెస్ట్ నుంచి షూటింగ్ వరకు!
అమ్మకాలు పెరిగినా, లాభాలు ఆర్జించలేకపోతున్న Electric Scooter కంపెనీలు- కారణాలివే
అమ్మకాలు పెరిగినా, లాభాలు ఆర్జించలేకపోతున్న Electric Scooter కంపెనీలు- కారణాలివే
Embed widget