అన్వేషించండి

Viper Venom for Covid 19: ఇది విన్నారా? ఆ పాము విషంతో కరోనాకు చెక్!

ఓ పాములోని విషంలో ఉండే పదార్థం.. కరోనా వైరస్ ను నియంత్రిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. కోతుల్లో కరోనాను ఇది 75 శాతం నియంత్రించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

పామును చూస్తేనే చాలా మందికి వణుకొస్తుంది. కానీ అలాంటి పాము విషాన్ని రకరకాల మందుల తయారీలో వినియోగిస్తారు. తాజాగా కొవిడ్ ను నివారించే శక్తి కూడా ఓ పాము విషానికి ఉందని తాజా అధ్యయనంలో తేలింది.

ఎక్కడంటే..?  

బ్రెజిల్ అడ‌వుల్లో ఎక్కువగా క‌నిపించే స‌ర్పం 'జ‌రారాకుసో' విషంతో కరోనాను అడ్డుకోవచ్చని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఈ పాము పొడవు 2 మీటర్ల వరకు ఉంటుంది. బొలీవియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లోనూ ఈ పాములు కన్పిస్తుంటాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అధ్య‌య‌నం సైంటిఫిక్ జ‌ర్న‌ల్ మాలిక్యూల్స్‌లో ప్రచురితమైంది.

Also Read: Tollywood drugs case: టాలీవుడ్ డర్టీ పిక్చర్‌లో ఊహించని ట్విస్ట్.. డ్రగ్స్ కేసులో లొంగిపోయిన కీలక నిందితుడు

ర‌క్త‌పింజ‌రి జ‌రారాకుసో విషంలో ఉండే అణువులు.. కొవిడ్ వైర‌స్ పునరుత్పత్తిని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటున్న‌ట్లు ఈ పరిశోధనలో గుర్తించారు. ఆ స‌ర్ప విష అణువులు కోతుల్లో 75 శాతం క‌రోనా వైర‌స్ క‌ణాల వృద్ధిని నియంత్రిస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. సావో పౌలో యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ రఫేల్ గైడో దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. 

Also Read: Dengue Fever in UP: యూపీలో మిస్టరీ ఫీవర్.. 40 మందికి పైగా మృతి

మానవులపై..

వైపర్‌ విషంలోని ఓ 'పెప్టైడ్‌'.. కరోనా వైరస్‌ పునరుత్పత్తిలో కీలక పాత్ర పోషించే 'పీఎల్‌ప్రో' అనే ఎంజైమ్‌కు అనుసంధానమవుతున్నట్లు ప్రొఫెసర్‌ గైడో తెలిపారు. అయితే ఇతర కణాలను ఈ పెప్టైడ్‌ హాని చేయట్లేదని వివరించారు. యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలున్న ఈ పెప్టైడ్‌ను ప్రయోగశాలల్లోనూ ఉత్పత్తి చేయొచ్చని గైడో తెలిపారు. ఇందుకోసం పాముల్ని హింసించాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఎంత డోసులో ఇస్తే ఆ పదార్థం ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలియాల్సి ఉంది. జంతువులపై చేసే ఈ ప్రయోగాలన్నీ సఫలమైతే తర్వాతి దశలో మనుషులపై కూడా వీటిని పరీక్షిస్తామని పరిశోధకులు తెలిపారు.

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 41,965 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3.28 కోట్లకు చేరింది. 460 మంది మరణించారు. దీంతో కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4,39,020కి పెరిగింది. ఇక నిన్న ఒక్క రోజే 33,964 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3.19 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.51 శాతానికి చేరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

Also Read: Al Qaeda on Taliban: తాలిబన్లకు అల్ ఖైదా అభినందనలు.. 'కశ్మీర్'పై కీలక వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ODI World Cup Predictions: 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget