అన్వేషించండి

Bengal Train Accident: ఏడాది క్రితం బాలాసోర్ విషాదం, ఇప్పుడు బెంగాల్ రైల్ ప్రమాదం - వణికిపోతున్న ప్రయాణికులు

Bengal Train Accident: బెంగాల్ రైల్ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో కొందరు ప్రయాణికులు బయట పడ్డారు. ప్రమాదం జరిగిన ఆ క్షణాలను తలుచుకుని భయపడిపోతున్నారు.

 Kanchanjunga Express Accident: బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 35 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఒడిశా బాలాసోర్ ప్రమాదం నాటి రోజుల్ని గుర్తు చేసింది ఈ యాక్సిడెంట్. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ని వెనక నుంచి వచ్చి గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఏడాది క్రితం జూన్ 2వ తేదీన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఇదే తరహా ప్రమాదం జరగడం అలజడి రేపుతోంది. ఈ ప్రమాదంలో లోకోపైలట్ కూడా మృతి చెందాడని తెలుస్తోంది. అయితే...ఈ ఘటనపై ABP News ప్రయాణికులతో మాట్లాడింది. ప్రమాద సమయంలో అసలేం జరిగిందని అడిగి తెలుసుకుంది. అప్పుడు ఏం జరుగుతోందో ఏమీ అర్థం కాలేదని, నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని ప్రయాణికులు చెప్పారు. ఆ క్షణాలను తలుచుకుని వణికిపోతున్నారు.  Kanchanjunga Express అగర్తలా నుంచి కోల్‌కత్తాకి వెళ్తోంది. నిజ్బరి చత్తరహాట్‌ స్టేషన్ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 8.45 నిముషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. గూడ్స్ ట్రైన్‌ వేగంగా వచ్చి ఎక్స్‌ప్రెస్‌ని ఢీకొట్టింది. ఈ ధాటికి రెండు బోగీలు అమాంతం గాల్లోకి 20 అడుగుల ఎత్తులోకి ఎగిరి కింద పడిపోయాయి. మరో కోచ్ గూడ్స్‌పైకి ఎక్కింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయట పడ్డ ప్రయాణికులు ఆ సమయంలో ఏం జరిగిందో వివరించారు. ఉన్నట్టుండి పెద్ద శబ్దాలు వినిపించాయని, ఒక్కసారిగా కుదిపేసినట్టు అయిందని చెప్పారు. 

"ఒక్కసారిగా మాకు పెద్ద శబ్దం వినిపించింది. ఉలిక్కిపడ్డాం. లోపల ఉన్న వాళ్లంతో గట్టిగా కేకలు పెట్టారు. చాలా సేపటి వరకూ ఎలాంటి సాయం అందలేదు. రైల్వే అధికారులు కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ రాలేదు. ఎమర్జెన్సీ సర్వీస్‌ కూడా అందుబాటులో లేదు. కాస్త ముందే అప్రమత్తమై ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగి ఉండేది కాదు"

- బాధితుడు

మరో బాధితుడు కూడా స్పందించాడు. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయని ప్రశ్నించాడు. ప్రమాదం జరిగినప్పుడు అంతా చీకటి అయిపోయిందని, ఎవరికీ అర్థం కాక అయోమయంలో పడిపోయామని వివరించాడు. వెంటనే రైల్‌లో నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పాడు. 

"ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎలా వచ్చాయనేది అంతుపట్టకుండా ఉంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. అంత మంది ప్రాణాలకు రక్షణే లేదా..? ఒక్కసారిగా కుదిపేసినట్టు అయింది. గట్టిగా కేకలు పెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే అంతా చీకటి అయిపోయింది. ఎలాగోలా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాం"

- బాధితుడు 

Also Read: Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాదానికి కారణమిదే, అధికారులు ఏం చెబుతున్నారంటే?

టాప్ హెడ్ లైన్స్

Womens World Cup IND W VS AUS W : కంగారూలతో టీమిండియా మహిళలకు అసలైన అగ్నిపరీక్ష.. సెమీస్ బెర్త్ కోసం చావో రేవో, అడుగు దూరంలో నాకౌట్ రేస్
కంగారూలతో టీమిండియా మహిళలకు అసలైన అగ్నిపరీక్ష.. సెమీస్ బెర్త్ కోసం చావో రేవో, అడుగు దూరంలో నాకౌట్ రేస్
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Embed widget