అన్వేషించండి

Bengal Train Accident: ఏడాది క్రితం బాలాసోర్ విషాదం, ఇప్పుడు బెంగాల్ రైల్ ప్రమాదం - వణికిపోతున్న ప్రయాణికులు

Bengal Train Accident: బెంగాల్ రైల్ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో కొందరు ప్రయాణికులు బయట పడ్డారు. ప్రమాదం జరిగిన ఆ క్షణాలను తలుచుకుని భయపడిపోతున్నారు.

 Kanchanjunga Express Accident: బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 35 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఒడిశా బాలాసోర్ ప్రమాదం నాటి రోజుల్ని గుర్తు చేసింది ఈ యాక్సిడెంట్. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ని వెనక నుంచి వచ్చి గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఏడాది క్రితం జూన్ 2వ తేదీన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఇదే తరహా ప్రమాదం జరగడం అలజడి రేపుతోంది. ఈ ప్రమాదంలో లోకోపైలట్ కూడా మృతి చెందాడని తెలుస్తోంది. అయితే...ఈ ఘటనపై ABP News ప్రయాణికులతో మాట్లాడింది. ప్రమాద సమయంలో అసలేం జరిగిందని అడిగి తెలుసుకుంది. అప్పుడు ఏం జరుగుతోందో ఏమీ అర్థం కాలేదని, నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని ప్రయాణికులు చెప్పారు. ఆ క్షణాలను తలుచుకుని వణికిపోతున్నారు.  Kanchanjunga Express అగర్తలా నుంచి కోల్‌కత్తాకి వెళ్తోంది. నిజ్బరి చత్తరహాట్‌ స్టేషన్ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 8.45 నిముషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. గూడ్స్ ట్రైన్‌ వేగంగా వచ్చి ఎక్స్‌ప్రెస్‌ని ఢీకొట్టింది. ఈ ధాటికి రెండు బోగీలు అమాంతం గాల్లోకి 20 అడుగుల ఎత్తులోకి ఎగిరి కింద పడిపోయాయి. మరో కోచ్ గూడ్స్‌పైకి ఎక్కింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయట పడ్డ ప్రయాణికులు ఆ సమయంలో ఏం జరిగిందో వివరించారు. ఉన్నట్టుండి పెద్ద శబ్దాలు వినిపించాయని, ఒక్కసారిగా కుదిపేసినట్టు అయిందని చెప్పారు. 

"ఒక్కసారిగా మాకు పెద్ద శబ్దం వినిపించింది. ఉలిక్కిపడ్డాం. లోపల ఉన్న వాళ్లంతో గట్టిగా కేకలు పెట్టారు. చాలా సేపటి వరకూ ఎలాంటి సాయం అందలేదు. రైల్వే అధికారులు కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ రాలేదు. ఎమర్జెన్సీ సర్వీస్‌ కూడా అందుబాటులో లేదు. కాస్త ముందే అప్రమత్తమై ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగి ఉండేది కాదు"

- బాధితుడు

మరో బాధితుడు కూడా స్పందించాడు. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయని ప్రశ్నించాడు. ప్రమాదం జరిగినప్పుడు అంతా చీకటి అయిపోయిందని, ఎవరికీ అర్థం కాక అయోమయంలో పడిపోయామని వివరించాడు. వెంటనే రైల్‌లో నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పాడు. 

"ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎలా వచ్చాయనేది అంతుపట్టకుండా ఉంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. అంత మంది ప్రాణాలకు రక్షణే లేదా..? ఒక్కసారిగా కుదిపేసినట్టు అయింది. గట్టిగా కేకలు పెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే అంతా చీకటి అయిపోయింది. ఎలాగోలా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాం"

- బాధితుడు 

Also Read: Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాదానికి కారణమిదే, అధికారులు ఏం చెబుతున్నారంటే?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Embed widget