అన్వేషించండి

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో ఎండు మండిపోతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో పోటా పోటీగా ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయితే... ఆంధ్రప్రదేశ్‌లో 45 డిగ్రీలు నమోదైంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. 
 
తెలంగాణలో శనివారం 46 డిగ్రీల ఉష్ణోగ్రత దాటేసింది. అత్యధిక ఉష్ణోగ్రత సూర్యపేట జిల్లా లక్కవరంలో నమోదైంది. అక్కడ 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. 
 
హైదరాబాద్‌లో పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళలో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, 28 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా. నిన్న నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత- 39.1 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత- 23.6 డిగ్రీలు
 
ఇవాళ నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.
ప్రాంతం                                       గరిష్ట ఉష్ణోగ్రత                కనిష్ట ఉష్ణోగ్రత
ఆదిలాబాద్‌                                        41.3                            26.2
భద్రాచలం                                          42.4                           28
హకంపేట్                                           36.6                            23.9
దుండిగల్‌                                           38.33                          24.9
హన్మకొండ                                          4 .5                              25
హైదరాబాద్‌                                        39.1                             26.6
ఖమ్మం                                                42.4                             30
 
రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతా­యని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా జూన్‌ మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
 
రాష్ట్రానికి వాయవ్య. పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు చెప్పింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో భగభగలు
మండిపడుతున్న ఎండలతో ఆంధ్రరప్రదేశ్‌ భగ్గుమంటోంది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైబడి నమోదు అవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నయ్యగూడెంలో 45 డిగ్రీలుగు నమోదు అయింది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6, బాపట్ల జిల్లా, ఏలూరు జిల్లాల్లో 44.5 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు చోట్ల 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 13 ప్రాంతాల్లో 43 డిగ్రీలు రిజిస్టర్ అయితే... 3 చోట్ల 42 డిగ్రీలు నమోదు అయ్యాయి. 35 మండలాల్లో వడగాల్పులు వీచాయి. 
 
ఆదివారం, సోమవారం కూడాఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 73 మండలాల్లో 12 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. వీటిలో గుంటూరు జిల్లాలో ఎక్కువ మండలాలు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. గుంటూరులో 15, తూర్పుగోదావరి జిల్లాలో 11 మండలాల్లో ఎన్టీఆర్‌ జిల్లాలో 10 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖాధికారులు. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP DesamTirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూSRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget