అన్వేషించండి

Vizianagaram Protest: సర్వజన ఆసుపత్రిలో వృద్ధురాలి మృతి, వైద్యుల నిర్లక్ష్యం వల్లే అంటూ ఆందోళన

Vizianagaram Protest: వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబ పెద్ద రాములమ్మ కన్నుమూసిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో సర్వజన ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. 

Vizianagaram Protest: విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే వృద్ధురాలు మృతి చెందిందంటూ ఆమె బంధువులు సోమవారం ఆందోళన చేపట్టారు. సరైన చికిత్స అందించలేదని, అడిగితే సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ స్పందించి అదలేం లేదని వయసు ప్రభావం, ఆరోగ్య సమస్యల వల్లే వైద్యం చేసినా ఆమె శరీరం స్పందించ లేదని తెలిపారు. అందువల్లే ఆ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిందని వివరించారు. 

అసలేం జరిగిందంటే..? 

విజయనగరం జిల్లా ఎస్‌.కోటకు చెందిన కోరాడ రాములమ్మ(73)కు ఆదివారం ఉదయం మూత్రం బ్లాక్‌ అవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన చికత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు రాములన్నను ఆదివారం మధ్యాహ్నం విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో మృతి చెందింది. సరైన చికిత్స అందించ లేదని, వైద్యుల నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. 


Vizianagaram Protest: సర్వజన ఆసుపత్రిలో వృద్ధురాలి మృతి, వైద్యుల నిర్లక్ష్యం వల్లే అంటూ ఆందోళన

 మృతురాలి మనవడు వంశీ మాట్లాడుతూ.. తీవ్ర మధుమేహ సమస్యతో యూరిన్‌ బ్లాక్‌ అయ్యిందని, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఆమెను తీసుకొచ్చామని చెప్పాడు. మూత్రం సాఫీగా రావడానికి సరైన చికిత్స చేయలేదని ఆరోపించాడు. సాధారణ వైద్యం మాత్రమే అందించారని వాపోయాడు. దీనివల్లే తన అమ్మమ్మ రాములమ్మ మృతి చెందిందన్నాడు. దీనిపై వైద్యులను, సిబ్బందిని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాము పేదవారమని, ఎటువంటి సపోర్టు లేకపోవడం వల్లే నిర్లక్ష్యంగా వ్యహరించారని వాపోయాడు. ఇదే విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అప్పల నాయుడు వద్ద మీడియా ప్రస్తావించగా.. చికిత్సలో ఎటువంటి లోపమూ జరగలేదని, వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు. ఆమెకు తీవ్రమైన మధుమేహం, వయస్సు ప్రభావంతో సకాలంలో చికిత్స చేసినప్పటికీ శరీరం సహకరించలేదని చెప్పారు. రోగులతో వైద్యులు, వైద్యసిబ్బంది దురుసుగా ప్రవర్తించరాదని, ఇప్పటికే ఈ విషయంపై వైద్యులతో మాట్లాడామని తెలిపారు.

మూడు నెలల క్రితం గుంటూరులో వైద్యుల నిర్లక్ష్యం!

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు అపనమ్మకం కలిగే ఓ ఘటన తాజాగా జరిగింది. గర్భిణీకి పురుడు పోసిన అనంతరం అప్పుడే పుట్టిన శిశువుకు బొడ్డు తాడు కట్ చేయడంలో పెద్ద తప్పిదం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బొడ్డు కోయబోయి ఏకంగా బిడ్డ వేలు కోసేశారు.. వైద్య సిబ్బంది. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. 

బాధితుల కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వరూప అనే మహిళ గత ఏడాది సెప్టెంబరు 30న మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. తొలి కాన్పులో భాగంగా ఓ మగ బిడ్డకు జన్మ ఇచ్చింది. అయితే, పురుడు పోసిన అనంతరం ఆమె స్పృహలోకి రాక ముందే బిడ్డకు ఉన్న బొడ్డు తాడు కోసే క్రమంలో వైద్య సిబ్బంది శిశువు కుడి చేతి చిటికెన వేలు కోసేశారు. దీంతో వెంటనే తమ తప్పును తెలుసుకొని తల్లీ, బిడ్డ ఇద్దర్నీ గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రి జీజీహెచ్ కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షించిన అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాబు చిటికెన వేలు చివర్లో తెగిందని, ఆపరేషన్ చేసి ఆ తెగిన వేలును అతికిస్తామని ప్రైవేటు ఆస్పత్రి డాక్లర్లు తెలిపారు. అయితే, ఈ విషయం బయట పడకుండా ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు జాగ్రత్త పడ్డారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Embed widget