అన్వేషించండి

Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ మొదలు.. ఉదయానికి అంతా బయటకి..

ఉత్తరాఖండ్ సొరంగంలో 11రోజులుగా మగ్గుతున్న కార్మికులను రక్షించే రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతోంది. మొత్తం 41 మంది కార్మికులను గురువారం ఉదయానికి బయటకు తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.

ఉత్తరాఖండ్‌ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ (Uttarakhand Tunnel Rescue) లో చివరి దశకు చేరుకుంది. 11రోజులుగా ఉత్తరకాశీలోని సిల్‌క్యారా సొరంగంలో (Silkyara Tunnel) చిక్కుకున్న 41 మంది కార్మికులను గురువారం ఉదయానికల్లా బయటకు తీసుకురానున్నారు.  11రోజులుగా ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న కార్మికులను ఎట్టకేలకు బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 15మంది సభ్యుల NDRF బృందం సొరంగంలోకి చేరుకుంది.  దాదాపు 45 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తి చేశారు. మరో 12 మీటర్ల శిథిలాల గుండా భారీ పైపులను పంపుతున్నారు. వీటి ద్వారా లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొస్తారు. పొద్దున 8కల్లా ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రాజెక్టు హెడ్‌ హర్పాల్ సింగ్ చెప్పారు. 

 

ఏం జరిగిందంటే... 

సిల్‌క్యారా- బారాకోట్ జాతీయ రహదారి పనుల్లో భాగంగా Silkyara వద్ద Tunnel నిర్మాణం చేపట్టారు. నవంబర్ 12 వ తేదీన కొండ చరియలు విరిగి పడి సొరంగం మూసుకుపోయింది. 41మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. శిిథిలాలు ఎక్కువుగా ఉండటం వాళ్లని బయటకు తెప్పించడానికి వేరే మార్గం లేకపోవడంతో పలు మార్గాల్లో వారిని చేరేందుకు 11 రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పలు జాతీయ -అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అమెరికా నుంచి ప్రత్యేకంగా Augur  మెషిన్ తెప్పించి తవ్వకాలు చేపట్టారు. రోజులు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో అందరిలో ఆందోళన వ్యక్తమైంది. ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు దగ్గరుండి మరీ ఆపరేషన్‌ ను పర్యవేక్షించారు. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేకపోయినా.. లోపల ఉన్నవారితో సంభాషించగలగడం, ఆక్సిజన్, ఆహారం అందించడం చేయగలిగారు. మంగళవారం ఎండోస్కోపిక్ కెమెరా ద్వారా లోపల ఉన్న వాళ్ల ఫోటోలు కూడా చిత్రీకరించగలిగారు. డ్రిల్లింగ్ చివరిదశకు రావడంతో ఎన్డీఆర్‌ఎఫ్ -NDRF బృందాలు వారిని బయటకు తెచ్చేందుకు వెళ్లాయి. 

 

బయటకు తెచ్చేది ఇలా

ఈ ఆపరేషన్ చాలా సంక్లిష్టమైంది. సొరంగం తవ్వకాల్లో అనుభవం ఉన్న వాళ్లకి కూడా చాలా రోజులు పట్టింది. షుమారు 60 మీటర్ల మేరకు శిథిలాలు కప్పేసినట్లు అంచనా వేశారు. బుధవారం రాత్రికి 45 మీటర్లు డ్రిల్లింగ్ చేశారు. మరో 12 కిలోమీటర్ల దూరంలో కార్మికులు ఉంటారన్న అంచనాతో ఈ శిథిలాల గుండా స్టీల్ పైపులను చొప్పిస్తున్నారు. టెలిస్కోపిక్ విధానంలో దీనిని పంపిస్తున్నారు. చుట్టూ ఉన్న మట్టి జారిపోయి సొరంగం పూడిపోకుండా మొదట 900 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న పైపలను పంపిస్తారు. ఆ తర్వాత టెలిస్కోప్ తరహాలో దాని లోపల మరోపైపును అమర్చి ముందుకు పంపుతారు.800MM వ్యాసం ఉన్న లోపలి పైపుగుండా కార్మికులను బయటకు తెస్తారు. ఇప్పటికే NDRF దీనిపై ట్రయల్ రన్ కూడా పూర్తిచేసింది. పొద్దున కల్లా అందరినీ బయటు తెచ్చేస్తామని చెప్పింది. 

 

ఆసుపత్రులు- హెలికాప్టర్లు

11 రోజులుగా బయట ప్రపంచాన్ని చూడకండా సొరంగంలోనే మగ్గిన కార్మికులలను  బయటకు వచ్చిన వెంటనే సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సొరంగం బయట 8 పడకల ఆసుపత్రిని 30 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. సమీప పట్టణంలో 41 బెడ్ల ఆసుపత్రిని సిద్దం చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిలో జార్ఖండ్ వాళ్లున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన 15మందిని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది ఆ ప్రభుత్వం.  అన్నీ అనుకూలిస్తే.. పొద్దున కల్లా అందరం శుభవార్త వినే అవకాశం ఉంది. 

 

 

సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్లకు అవసరమైన ఆహారం అందిస్తున్నారు. నిన్న రాత్రి (నవంబర్ 21) కార్మికులకు వెజ్ పులావ్, చపాతీలు అందించారు. అందరినీ మెడికల్ సూపర్‌విజన్‌లో ఉంచారు. పది రోజుల్లో తొలిసారి కార్మికుల ఫొటోలను విడుదల చేశారు అధికారులు. endoscopic flexi camera ని పైప్‌లైన్‌లో ఇన్‌సర్ట్ చేర్చారు. వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నారని కన్‌ఫమ్ చేసుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మూడు సార్లు కాల్ చేసి మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. కార్మికులకు అవసరమైన వెలుతురు, ఆక్సిజన్ ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget