అన్వేషించండి

Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ మొదలు.. ఉదయానికి అంతా బయటకి..

ఉత్తరాఖండ్ సొరంగంలో 11రోజులుగా మగ్గుతున్న కార్మికులను రక్షించే రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతోంది. మొత్తం 41 మంది కార్మికులను గురువారం ఉదయానికి బయటకు తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.

ఉత్తరాఖండ్‌ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ (Uttarakhand Tunnel Rescue) లో చివరి దశకు చేరుకుంది. 11రోజులుగా ఉత్తరకాశీలోని సిల్‌క్యారా సొరంగంలో (Silkyara Tunnel) చిక్కుకున్న 41 మంది కార్మికులను గురువారం ఉదయానికల్లా బయటకు తీసుకురానున్నారు.  11రోజులుగా ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న కార్మికులను ఎట్టకేలకు బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 15మంది సభ్యుల NDRF బృందం సొరంగంలోకి చేరుకుంది.  దాదాపు 45 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తి చేశారు. మరో 12 మీటర్ల శిథిలాల గుండా భారీ పైపులను పంపుతున్నారు. వీటి ద్వారా లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొస్తారు. పొద్దున 8కల్లా ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రాజెక్టు హెడ్‌ హర్పాల్ సింగ్ చెప్పారు. 

 

ఏం జరిగిందంటే... 

సిల్‌క్యారా- బారాకోట్ జాతీయ రహదారి పనుల్లో భాగంగా Silkyara వద్ద Tunnel నిర్మాణం చేపట్టారు. నవంబర్ 12 వ తేదీన కొండ చరియలు విరిగి పడి సొరంగం మూసుకుపోయింది. 41మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. శిిథిలాలు ఎక్కువుగా ఉండటం వాళ్లని బయటకు తెప్పించడానికి వేరే మార్గం లేకపోవడంతో పలు మార్గాల్లో వారిని చేరేందుకు 11 రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పలు జాతీయ -అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అమెరికా నుంచి ప్రత్యేకంగా Augur  మెషిన్ తెప్పించి తవ్వకాలు చేపట్టారు. రోజులు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో అందరిలో ఆందోళన వ్యక్తమైంది. ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు దగ్గరుండి మరీ ఆపరేషన్‌ ను పర్యవేక్షించారు. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేకపోయినా.. లోపల ఉన్నవారితో సంభాషించగలగడం, ఆక్సిజన్, ఆహారం అందించడం చేయగలిగారు. మంగళవారం ఎండోస్కోపిక్ కెమెరా ద్వారా లోపల ఉన్న వాళ్ల ఫోటోలు కూడా చిత్రీకరించగలిగారు. డ్రిల్లింగ్ చివరిదశకు రావడంతో ఎన్డీఆర్‌ఎఫ్ -NDRF బృందాలు వారిని బయటకు తెచ్చేందుకు వెళ్లాయి. 

 

బయటకు తెచ్చేది ఇలా

ఈ ఆపరేషన్ చాలా సంక్లిష్టమైంది. సొరంగం తవ్వకాల్లో అనుభవం ఉన్న వాళ్లకి కూడా చాలా రోజులు పట్టింది. షుమారు 60 మీటర్ల మేరకు శిథిలాలు కప్పేసినట్లు అంచనా వేశారు. బుధవారం రాత్రికి 45 మీటర్లు డ్రిల్లింగ్ చేశారు. మరో 12 కిలోమీటర్ల దూరంలో కార్మికులు ఉంటారన్న అంచనాతో ఈ శిథిలాల గుండా స్టీల్ పైపులను చొప్పిస్తున్నారు. టెలిస్కోపిక్ విధానంలో దీనిని పంపిస్తున్నారు. చుట్టూ ఉన్న మట్టి జారిపోయి సొరంగం పూడిపోకుండా మొదట 900 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న పైపలను పంపిస్తారు. ఆ తర్వాత టెలిస్కోప్ తరహాలో దాని లోపల మరోపైపును అమర్చి ముందుకు పంపుతారు.800MM వ్యాసం ఉన్న లోపలి పైపుగుండా కార్మికులను బయటకు తెస్తారు. ఇప్పటికే NDRF దీనిపై ట్రయల్ రన్ కూడా పూర్తిచేసింది. పొద్దున కల్లా అందరినీ బయటు తెచ్చేస్తామని చెప్పింది. 

 

ఆసుపత్రులు- హెలికాప్టర్లు

11 రోజులుగా బయట ప్రపంచాన్ని చూడకండా సొరంగంలోనే మగ్గిన కార్మికులలను  బయటకు వచ్చిన వెంటనే సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సొరంగం బయట 8 పడకల ఆసుపత్రిని 30 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. సమీప పట్టణంలో 41 బెడ్ల ఆసుపత్రిని సిద్దం చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిలో జార్ఖండ్ వాళ్లున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన 15మందిని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది ఆ ప్రభుత్వం.  అన్నీ అనుకూలిస్తే.. పొద్దున కల్లా అందరం శుభవార్త వినే అవకాశం ఉంది. 

 

 

సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్లకు అవసరమైన ఆహారం అందిస్తున్నారు. నిన్న రాత్రి (నవంబర్ 21) కార్మికులకు వెజ్ పులావ్, చపాతీలు అందించారు. అందరినీ మెడికల్ సూపర్‌విజన్‌లో ఉంచారు. పది రోజుల్లో తొలిసారి కార్మికుల ఫొటోలను విడుదల చేశారు అధికారులు. endoscopic flexi camera ని పైప్‌లైన్‌లో ఇన్‌సర్ట్ చేర్చారు. వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నారని కన్‌ఫమ్ చేసుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మూడు సార్లు కాల్ చేసి మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. కార్మికులకు అవసరమైన వెలుతురు, ఆక్సిజన్ ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. 

 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget