అన్వేషించండి

Thackeray Vs Shinde: శిందే వర్సెస్ ఠాక్రే అంశంపై విచారణ చేపట్టనున్న సుప్రీం కోర్టు, శివసేన ఎవరిదో తేలేది అప్పుడే

Thackeray Vs Shinde: శిందే వర్సెస్ ఠాక్రే అంశంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.

Uddhav Thackeray Vs Shinde: 

గురువారం విచారణ..

శివసేన ఎవరిదన్న అంశంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. సుప్రీం కోర్టునీ ఆశ్రయించాయి ఇరు వర్గాలు. ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న విచారణ...ఇప్పుడు మొదలు కానుంది. ఈ విచారణ చేపట్టేందుకు 5గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. ఈ  ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమదే నిజమైన శివసేన అని ఏక్‌నాథ్ శిందే వర్గాలు చెప్పటంతో పాటు, శివసేన
పార్టీ గుర్తుని తమకే ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. అయితే...విచారణ తేలేంత వరకూ ఎన్నికల సంఘం ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన త్రిసభ్య ధర్మాసనం...పరిధిలో ఉన్న ఈ అంశం..ఇప్పుడు 5-గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ అయింది. ఉద్ధవ్ క్యాంప్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ విజ్ఞప్తి మేరకు...సుప్రీం కోర్టు ఈ విచారణ చేపట్టనుంది.

 

మాటల యుద్ధం..

మహారాష్ట్రలో రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఇంకా శివసేన ఎవరిది అన్న చర్చ వాడివేడిగా సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అంశంపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. శివసేనలో ఎవరికి మెజార్టీ ఉందో డాక్యుమెంట్ రూపంలో ఆధారాలు సమర్పించాలని ఏక్‌నాథ్‌ శిందేతో పాటు ఉద్ధవ్ ఠాక్రేను కూడా అడిగింది. ఈ అంశంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఎన్నోసార్లు స్పందించారు. బాలాసాహెబ్ స్థాపించిన శివసేనను కేంద్ర ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని
విమర్శించారు. 56 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఇలా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. "ఇది మహారాష్ట్ర ప్రజల్ని షాక్‌కు గురి చేసింది. 
బాలాసాహెబ్ ఠాక్రే 56 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించారు. ఇలాంటి పార్టీపై ఈసీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కేంద్రం మా పార్టీని నాశనం చేయాలని చూస్తోంది. శివసేనకు ఒకే ఒక లీడర్ ఉన్నారు. అది ఉద్దవ్ ఠాక్రే మాత్రమే" అని స్ఫష్టం చేశారు సంజయ్ రౌత్. ఇదే అంశమై గతంలో ఏక్‌నాథ్ శిందే కూడా స్పందించారు. "ఎన్నికల సంఘం చెప్పినట్టుగా నడుచుకుంటాం. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఆధారాలు సమర్పిస్తాం. శివసేన మాదే. మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పాటు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఉంది" అని వెల్లడించారు. 

Also Read: ఎన్టీఆర్ చెప్పిన ఫార్ములాలో తెలంగాణ పాలిటిక్స్

Also Read: Sonali Phogat Death: భాజపా నేత సోనాలి ఫోగట్ గోవాలో గుండెపోటుతో మృతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BrahMos range: బ్రహ్మోస్‌తో పాకిస్తాన్ పని ఫినిష్ - ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే - రాజ్‌నాథ్‌ హెచ్చరిక
బ్రహ్మోస్‌తో పాకిస్తాన్ పని ఫినిష్ - ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే - రాజ్‌నాథ్‌ హెచ్చరిక
Shubman Gill: రోహిత్ శర్మ, కోహ్లీతో బాండింగ్‌‌లో మార్పులేదు.. ఆ విషయంలో వెనుకాడను: గిల్
రోహిత్ శర్మ, కోహ్లీతో బాండింగ్‌‌లో మార్పులేదు.. ఆ విషయంలో వెనుకాడను: గిల్
Zoom App : జూమ్‌ యాప్‌పై ప్రభుత్వం సంచలన ప్రకటన;  ప్రమాదంలో వినియోగదారుల డేటా!
జూమ్‌ యాప్‌పై ప్రభుత్వం సంచలన ప్రకటన; ప్రమాదంలో వినియోగదారుల డేటా!
Kavitha Son Aditya Political Entry: బీసీల కోసం రోడ్లపై ధర్నా చేసిన కవిత కుమారుడు ఆదిత్య- రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టేనా?
బీసీల కోసం రోడ్లపై ధర్నా చేసిన కవిత కుమారుడు ఆదిత్య- రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టేనా?
Advertisement

వీడియోలు

Rohit Sharma Records | India vs Australia | వణికిస్తున్న రోహిత్ శర్మ రికార్డ్స్
What is Test Twenty | టెస్టు ట్వంటీ పేరుతో కొత్త ఫార్మాట్
Mohammed Shami Comments in Selection Committee | టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌పై షమీ కామెంట్స్
India vs Australia ODI 2025 Head to Head Records | భారత్ - ఆస్ట్రేలియా రికార్డ్స్
6 ఏళ్ల వేట సక్సెస్.. పట్టుబడ్డ రోలెక్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BrahMos range: బ్రహ్మోస్‌తో పాకిస్తాన్ పని ఫినిష్ - ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే - రాజ్‌నాథ్‌ హెచ్చరిక
బ్రహ్మోస్‌తో పాకిస్తాన్ పని ఫినిష్ - ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే - రాజ్‌నాథ్‌ హెచ్చరిక
Shubman Gill: రోహిత్ శర్మ, కోహ్లీతో బాండింగ్‌‌లో మార్పులేదు.. ఆ విషయంలో వెనుకాడను: గిల్
రోహిత్ శర్మ, కోహ్లీతో బాండింగ్‌‌లో మార్పులేదు.. ఆ విషయంలో వెనుకాడను: గిల్
Zoom App : జూమ్‌ యాప్‌పై ప్రభుత్వం సంచలన ప్రకటన;  ప్రమాదంలో వినియోగదారుల డేటా!
జూమ్‌ యాప్‌పై ప్రభుత్వం సంచలన ప్రకటన; ప్రమాదంలో వినియోగదారుల డేటా!
Kavitha Son Aditya Political Entry: బీసీల కోసం రోడ్లపై ధర్నా చేసిన కవిత కుమారుడు ఆదిత్య- రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టేనా?
బీసీల కోసం రోడ్లపై ధర్నా చేసిన కవిత కుమారుడు ఆదిత్య- రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టేనా?
Telugu Bigg Boss Bharani Eliminate: బిగ్‌బాస్‌ హౌస్‌ సీజన్ 6 నుంచి భరణి అవుట్!- బాండింగ్‌ బాబాయ్‌కి బై బై చెప్పి ఆడియెన్స్!
బిగ్‌బాస్‌ హౌస్‌ సీజన్ 6 నుంచి భరణి అవుట్!- బాండింగ్‌ బాబాయ్‌కి బై బై చెప్పి ఆడియెన్స్!
Rare Earth: భారత్, రష్యాల అరుదైన ఒప్పందం.. ఇక చైనా ఆధిపత్యానికి చెక్ పెడుతుందా?
భారత్, రష్యాల అరుదైన ఒప్పందం.. ఇక చైనా ఆధిపత్యానికి చెక్ పెడుతుందా?
Garib Rath Express: గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ! - ఆ డైరెక్టర్‌తో పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీ
పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ! - ఆ డైరెక్టర్‌తో పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీ
Embed widget