![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Top 10 Headlines Today: మోగనున్న బడి గంట- గద్వాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
Top Headlines Today: తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ్టి షెడ్యూల్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవే.
![Top 10 Headlines Today: మోగనున్న బడి గంట- గద్వాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్ Top 10 Headlines Today 12th June Politics Andhra Pradesh Telangana India World sports News From ABP Desam Top 10 Headlines Today: మోగనున్న బడి గంట- గద్వాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/12/894a9b1f4036d36d0d2433d8d568e5eb1686537289968215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Top Headlines Today:
నేటి నుంచి బడి గంట గణ గణ
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి బడి గంట మోగనుంది. విపరీతమైన ఎండ కారణంగా పని వేళలను తగ్గించాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కొత్త విద్యాసంవత్సరం పని దినాలు, చేపట్టాల్సిన కార్యచరణను ప్రభుత్వాలు విద్యాసంస్థలకు పంపించాయి. తెలంగాణలో 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు తెరుచుకోనున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు స్కూల్కు వెళ్లనున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించారు. తెలంగాణలో పాఠశాలల సెలవులు పొడిగించారని వస్తున్న వార్తలపై విద్యాశాఖ స్పందించింది. విద్యాశాఖ సెక్రటరీ మాట్లాడుతూ... వేసవి సెలవులను 19 వరకు పొడిగించారని ఫేక్ న్యూస్ తమ దృష్టికి వచ్చిందన్నారు. అది నిజం కాదన్నారు. సెలవులను పొడిగించలేదని తేల్చి చెప్పారు. సోషల్మీడియాలో ఫేక్ సర్క్యులర్ వైరల్ అవుతోందని క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వేసవి సెలువుల పొడింగుపు లేదని అధికారులు తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువ రిజిస్ట్ర అవుతున్న వేళ కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. 17వ తేదీ వరకు ఒంటిపూట బడులే ఉంటాయని పేర్కొంది. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకు మాత్రమే స్కూల్ ఉంటుందని ప్రకటించింది.
నేటి నుంచి విద్యా కానుక అందజేత
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. విద్యార్ధుల బంగారు భవిష్యత్తుకు బాటను వేస్తూ, చదువుల భారం మొత్తాన్ని సర్కార్ భరిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. వరుసగా నాలుగో ఏడాది 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక పంపిణి చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లాంచనంగా ప్రారంభించనున్నారు.
కిట్లో ఏముంటాయి
ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు ( ఒక పేజీలో ఇంగ్లీష్ మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశాలు), నోట్ బుక్లు, వర్క్బుక్లు, 3జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ (6-10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1-5 తరగతి పిల్లలకు)తో కూడిన విద్యాకానుక కిట్ ను స్కూల్స్ తెరిచిన ఫస్ట్ డేనే అందించనున్నారు.
నేడు కేసీఆర్ టూర్
సీఎం కేసీఆర్ నేడు జోగుళాంబ గద్వాల్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ స్టార్ట్ చేయనున్నారు. అనంతరం గద్వాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
నేడు ఎడ్సెట్ ఫలితాలు
తెలంగాణలో బీఈడీ కోర్సు ఎంట్రన్స్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేయనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)