By: ABP Desam | Updated at : 29 Jan 2022 03:37 PM (IST)
రైల్లో ప్రయాణించాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..!
రైలు ప్రయాణమంటే టిక్కెట్ కొని ఇక్కడ రైలెక్కి ఎక్కడ దిగాలో అక్కడ దిగితే సరిపోతుంది కదా అని మీకు అనిపిస్తే వెంటనే అభిప్రాయం మార్చేసుకోండి. రైలు ప్రయాణం అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కేసవుతుంది. ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చేశాయి. ఆ రూల్స్లో ముఖ్యమైనది.. రాత్రి పది అవ్వగానే మీ సీటు దగ్గర లైట్ వెలుగుతూ ఉంటే మీకు బుక్కయిపోయినట్లే. రాత్రి 10 గంటల తర్వాత బోగీలో అన్ని లైట్లూ ఆర్పేయాలనేది కొత్త రూల్. ఈ నిబంధన పాటించని ప్రయాణికులపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
ఇదొక్కటే రైలు ప్రయాణంలో వర్క్ చేసుకోవచ్చు.. సినిమాలు చూసుకోవచ్చు అని అనుకోవచ్చు.. చేసుకోవచ్చు.. చూసుకోవచ్చు కూడా. కానీ దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే శబ్దం బయటకు రాకూడదన్నమాట. ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లలో పాటలు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేయకూడదు. అంతే కాదు ఫోన్లో పెద్దగా మాట్లాడినా కేసు పెట్టేస్తారు. సాధారణ ప్రయాణికులతో పాటు గుంపులుగా ప్రయాణించే వారు సైతం రాత్రి పది గంటల తరువాత ఇతరులకు ఇబ్బంది కలిగించే రీతిలో బిగ్గరగా మాట్లాడితే అంతే సంగతులు.
మీరు ఇబ్బంది పెడుతున్నారని ఎవరైనా 139 నంబరుకు ఫోన్ చేస్తే చాలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తక్షణం రంగంలోకి దిగిపోతుంది. వచ్చి వెంటనే చర్యలు తీసుకుంటారు. కేసు బుక్ చేస్తారు. బోగీల్లోని ఆర్ఫీఎఫ్ సిబ్బంది.. టికెట్ చెకర్లు, కోచ్ అటెండెంట్లు, క్యాటరింగ్ సహా ఇతర రైలు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ప్రయాణికులు ఇతరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండేలా వీరు అప్రమత్తం చేస్తుంటారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే ఆ రైలు సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే నిబంధనలు కఠినంగా అమలు చేస్తారు.
రైళ్లలో ఇబ్బంది లేకపోవడం ఏమిటి.. అసలు రైలంటేనే ఇబ్బంది కదా అని చాలా మంది సాధారణ ప్రయాణికులు అనుకుంటూ ఉంటారు. అలా అనుకుని చాలా మంది రైల్వేకు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులన్నీ వినీ వినీ విసుగొచ్చేసిన రైల్వే శాఖ... రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తామంటూ ఈ కొత్త నిబంధనలు రూపొందించింది. రైలులో తోటి ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా కేసు నమోదు చేసి.. జైలుకు పంపాలని నిర్ణయించింది. అందుకే ఎందుకైనా మంచిది ఈ సారి రైలెక్కటప్పుడు ఈ నిబంధనలు అన్నీ గుర్తుంచుకుని రాముడు మంచి బాలుడు తరహాలో ప్రయాణించి గమ్యం చేరుకోవడం బెటర్. కాస్త తేడా వచ్చినా కేసుల పాలయిపోతాం.. బీవేర్ ఆఫ్ రైల్వేస్..!
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్రావు, పార్థసారధి నామినేషన్ దాఖలు
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్ - ఇండియా టాప్-10లో ఉన్నట్టే!