అన్వేషించండి

BJP : మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం కష్టమే .. మొన్న కేంద్రమంత్రి ఇంద్రజిత్.. ఇవాళ గవర్నర్ మాలిక్ వ్యాఖ్యలు !

నోరు జారే నేతలున్నారు కానీ ఉద్దేశపూర్వకంగా సొంత పార్టీ గెలవదని చెప్పే నేతలు కొద్ది మందే ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు బీజేపీలో పెరిగిపోతున్నారు.


" రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రాదు. యూపీ గ్రామాల్లోకి లీడర్లు కూడా ప్రవేశించలేరు..." ఇవి ఏ కాంగ్రెస్ పార్టీ లీడరో లేకపోతే బీజేపీకి బద్ద శత్రువు అయిన ప్రాంతీయ పార్టీ నేతనో చేసిన విమర్శ కాదు. అచ్చంగా బీజేపీ నేతగా వ్యవహరించే మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు. గవర్నర్‌గా ఉంటూ రాజకీయ కామెంట్లు చేయడానికి ఆయన ఎప్పుడూ  సంకోచించలేదు. నిన్నామొన్నటి వరకూ జమ్మూకశ్మీర్‌కు లెప్టినెంట్ గవర్నర్‌గా ఉన్నారు. తర్వాత మేఘాలయ గవర్నర్‌గా వెళ్లారు. అయినా బీజేపీని కాకుండా ఇతర పక్షాలపై విమర్శలు చేయడంలో ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు  బీజేపీనే టార్గెట్ చేశారు. కేంద్రమంత్రి పదవికి అజయ్ మిశ్రా పనికి రారని మాలిక్ తేల్చేశారు. యూపీకే చెందిన సత్యపాల్‌ మాలిక్ కరుడు గట్టిన బీజేపీ నేత. రెండు సార్లు ఎంపీగా కూడా గెలిచారు. 

Also Read : కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చిచ్చు ! ప్రియాంకను ఎదగకుండా రాహుల్ అడ్డుకుంటున్నారా ?

సత్యపాల్ మాలిక్ కన్నా మూడు రోజుల ముందు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఇంకా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పుకుని పోటీ చేస్తే 45 సీట్లు సాధించడం కూడా సందేహమేననే అభిప్రాయపడ్డారు. కార్యకర్తలంతా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తేనే విజయం సాధ్యమని స్పష్టం చేశారు. మోడీ నాయకత్వంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మూడో సారి మోడీనే నమ్ముకుంటే కష్టమని.. మోడీ పేరు మీద ఓట్లు వస్తాయనే గ్యారెంటీ లేదని స్పష్టం చేశారు. హర్యానాలో ఓ ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లి ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also Read : యూపీ ఎన్నికల్లో 'ప్రియాంకం'.. 'భాజపా X కాంగ్రెస్' గా మారిన రాజకీయం

భారతీయ జనతా పార్టీకి కీలకమైన రాష్ట్రాల్లో అత్యంత క్లిష్టమైన సమస్యలు ఎదురు వస్తున్నాయి. యూపీ, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ చట్టాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఉద్యమం చేస్తున్న రైతులను పట్టించుకోకపోవడం .. వారిపై దాడులకు తెగబడటం వంటివి ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతున్నాయి. అదే సమయంలో పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు సామాన్యులపై పెను భారం మోపుతోంది. 

Also Read: Kerala Rain Fury: కేరళలో మహా విలయం.. వర్షాలు, వరదల ధాటికి 21 మంది మృతి

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతను అగ్రెసివ్‌గా ఉండే మంత్రులు, గవర్నర్లు బహిరంగంగానే చెబుతున్నారు. అలా చెప్పినప్పుడు సహజంగానే అందరి దృష్టిలో పడుతున్నాయి. కానీ వారు లేవనెత్తిన సమస్యల విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. ఫలితంగా ఇలా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపోటములపై కీలక నేతలు కూడా వ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చింది. 

Also Read : నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అన్యాయం జరిగింది.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

India Hockey Jersey: హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget