అన్వేషించండి

Massive Crowd At Prajavani: ప్రజావాణికి విశేష స్పందన-తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు

Telangana News: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి విశేష స్పందన వస్తోంది. సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.

Huge Response To Prajavani: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఒకటి ప్రజావాణి  కార్యక్రమం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని... సమస్యలతో సతమతమయ్యారని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రజాసమస్యలు  తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమం చేపట్టింది. ప్రగతిభవన్‌ను జ్యోతిరావ్‌ పూలే ప్రజాభవన్‌గా పేరు మార్చి... అక్కడే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ  కార్యక్రమానికి మొదటి నుంచి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివస్తున్నారు జనం. ప్రజావాణిలో  ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి, ఆరోగ్యం,నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ వనతిపత్రాలు వస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం.. వారానికి రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. మంగళవారం, శుక్రవారాల్లో కచ్చితంగా ప్రజావాణి నిర్వహించాలని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. దీంతో ఆ రెండు రోజుల్లో జ్యోతిరావ్‌ పూలే ప్రజాభవన్‌కు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు ప్రజలు. సమస్యలు చెప్పుకునేందుకు తెల్లవారుజాము  నుంచే ప్రజాభవన్‌ ముందు క్యూకడుతున్నారు. దీంతో ప్రజావాణి నిర్వహిస్తున్న రెండు రోజుల్లో ప్రజాభవన్‌ దగ్గర రద్దీ కనిపిస్తోంది. 

ఇవాళ (శుక్రవారం) కూడా ప్రజావాణి నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా ప్రజాభవన్‌కు తరలివచ్చారు. తెల్లవారుజామున 5గంటల నుంచే ప్రజాభవన్‌కు పోటెత్తారు. ఉదయం  9గంటల అయ్యే సరికి.. ప్రజాభవన్‌ ముందు కిలోమీటర్ మేర క్యూలైన్‌ పెరిగిపోయింది. అయితే... పెద్దసంఖ్యలో తరలివస్తున్న ప్రజలను ఒక క్రమపద్ధతిలో ఉంచి... వారందరినీ  ఒక్కొక్కరిగా లోపలికి పంపడం అక్కడి భద్రతా సిబ్బందికి ఒక టాస్క్‌ అనే చెప్పాలి. ప్రజావాణికి విశేష స్పందన వస్తుండటం... సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రం  నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వస్తుండటంతో... రద్దీ విపరీతంగా పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. Image

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వచ్చేందుకు ప్రజలు కూడా  ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో... ప్రభుత్వం ప్రత్నామ్యాయ మార్గాలు అన్వేషిస్తే బెటరని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో  మాత్రమే కాకుండా... అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ప్రజావాణి నిర్వహిస్తే బాగుటుందని సూచిస్తున్నారు. దీని వల్ల.. ఆయా నియోజకవర్గ ప్రజల సమస్యలకు... ఆయా  నియోజకవర్గాల పరిధిలోనే పరిష్కారం చూపినట్టు అవుతుంది. అంతేకాదు.. వారంతా హైదరాబాద్‌ వరకు రావాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు ప్రజాభవన్‌ దగ్గర రద్దీ  కూడా తగ్గుకుంది. దీని వల్ల అటు ప్రభుత్వ యంత్రాంగానికి... ఇటు ప్రజలకు భారం, ఒత్తిడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది.Image

ఇక... తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాదర్భార్‌ పేరుతో కార్యక్రమం మొదలుపెట్టింది. మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా.. ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ప్రజాదర్భార్‌ను.. ప్రజావాణిగా పేరు మార్చారు. వారానికి రెండు సార్లు ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో రోజు ఒక్కో మంత్రు ప్రజావాణిలో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకోవాలని... వారి నుంచి వినతిపత్రాలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం... ప్రజావాణి కార్యక్రమానికి రోజుకో మంత్రి హాజరవుతూ.. ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకుంటున్నారు.
Massive Crowd At Prajavani: ప్రజావాణికి విశేష స్పందన-తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు


Massive Crowd At Prajavani: ప్రజావాణికి విశేష స్పందన-తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు
Massive Crowd At Prajavani: ప్రజావాణికి విశేష స్పందన-తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Tesla Full Self Driving Software :టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌పై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం! సభ్యత్వం తీసుకుంటేనే సర్వీస్‌!
టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌పై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం! సభ్యత్వం తీసుకుంటేనే సర్వీస్‌!
Cyber ​​Truck in Amalapuram: అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ - గోదావరి జిల్లాల వాళ్లతో మామూలుగా ఉండదు మరి !
అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ - గోదావరి జిల్లాల వాళ్లతో మామూలుగా ఉండదు మరి !
ED vs I-PAC: మమతా బెనర్జీది దొంగతనమే - ఈడీ వాదనలు - సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మమతా బెనర్జీది దొంగతనమే - ఈడీ వాదనలు - సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Embed widget