అన్వేషించండి

Tamil Nadu: కెమికల్స్ పరిశ్రమలో క్లోరిన్ గ్యాస్ లీక్... యజమాని మృతి, 13 మంది కార్మికులకు అస్వస్థత

తమిళనాడు ఈరోడ్ జిల్లాలో ఓ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. పరిశ్రమ నుంచి క్లోరిన్ వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో పరిశ్రమ యజమాని మరణించాడు. మరో 13 మంది అస్వస్థతకు గురైయ్యారు.

తమిళనాడు ఈరోడ్ జిల్లాలో చితోడ్ లో ఓ పరిశ్రమలో విష వాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో ఆ పరిశ్రమ యజమాని మృతి చెందగా, 13 మంది ఆసుపత్రి పాలయ్యారు. లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీధర్ కెమికల్స్ లో శనివారం మధ్యాహ్నం క్లోరిన్ గ్యాస్ పైపులో సమస్య తలెత్తి గ్యాస్ లీక్ అయింది. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఉన్న యజమాని దామోదరన్(40) క్లోరిన్ గ్యాస్ పీల్చి అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మరో 13 మంది ఈ విషవాయువు పీల్చడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో  వారిని ఈరోడ్‌లోని తాంథై పెరియార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read: Night Curfew: మళ్లీ నైట్ కర్ఫ్యూలు .. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు !

గ్యాస్ వ్యాప్తిని నియంత్రిస్తున్న రెస్క్యూ టీమ్స్

పరిశ్రమలోని ఇతర కార్మికులను రక్షించేందుకు నాలుగు ఫైర్, రెస్క్యూ సర్వీస్ వాహనాలను ఘటన స్థలంలో మోహరించారు. గ్యాస్ లీక్ వ్యాప్తి చెందకముందే నియంత్రించేందుకు అగ్ని మాపక బృందాలు పనిచేస్తున్నాయి. సంఘటనా స్థలాన్ని ఈరోడ్ కలెక్టర్ హెచ్ కృష్ణనున్ని, ఎస్పీ శశిమోహన్ పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: PM Modi: సైనికుడు మిలటరీలో ఉన్నంతవరకే కాదు.. జీవితాంతం యోధుడే 

వైజాగ్ లోనూ ఇలాంటి ప్రమాదం

ఇలాంటి ఘటనే గత ఏడాది మేలో ఏపీలోని వైజాగ్‌లో చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనలో స్టైరిన్ గ్యాస్ లీక్‌ అయ్యి 12 మంది మరణించారు. 585 మంది అస్వస్థతకు గురయ్యారు. లీకేజీ కారణంగా చుట్టుపక్కల ఉన్న జంతువులు, మొక్కలు కూడా దెబ్బతిన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఎల్‌జీ పాలిమర్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సుంకీ జియాంగ్, టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పూర్ణ చంద్రమోహన్ రావులను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన మిగిలిన ఉద్యోగులలో ప్రొడక్షన్ టీమ్ లీడర్, ముగ్గురు ఇంజనీర్లు, ఒక ఆపరేటర్, ఆపరేషన్ కోసం నైట్ డ్యూటీ ఆఫీసర్, నైట్ షిఫ్ట్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు. ఈ ఘటనపై అప్పట్లో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముఖ్యమంత్రి జగన్‌ కు నివేదిక అందించింది. 

Also Read : వామ్మో ఒమిక్రాన్.. ఒక్క రోజులో 4 వేల మందికా? గత వైరస్‌ల కంటే వేగంగా కొత్త వైరస్!

టాప్ హెడ్ లైన్స్

DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Breaking News: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు
Captain Cool MS Dhoni Birthday: లెజెండ్ ఎంఎస్ ధోని 45వ బర్త్ డే.. టికెట్ కలెక్టర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రోఫీ కలెక్టర్‌గా మారిన 'మహి' మైండ్ బ్లోయింగ్ సక్సెస్ జర్నీ!
లెజెండ్ ఎంఎస్ ధోని 45వ బర్త్ డే.. టికెట్ కలెక్టర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రోఫీ కలెక్టర్‌గా మారిన 'మహి' మైండ్ బ్లోయింగ్ సక్సెస్ జర్నీ!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Embed widget